
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. ఈనివేదికకు ఆమోద ముద్ర వేసింది.
04:29PM
తెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా
04:26PM
మాకు మైక్ ఇవ్వకపోవడం అన్యాయం: KTR
- స్పీకర్ మైక్ ఇవ్వాలని BRS డిమాండ్.
- మైక్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్న కేటీఆర్
04:24PM
బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
- తమకు మైక్ ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు బీజేపీ సభ్యుల నిరసన
- బీసీలపై చర్చ సందర్భంగా.. బీసీలకు మైక్ ఇవ్వకుంటే ఎలా? అని నిలదీత
04:22PM
శాసనసభలో బీఆర్ఎస్ ఆందోళన
- సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్న వాళ్లకే మైక్ ఇవ్వాలని స్పీకర్ను కోరిన సీఎం రేవంత్
- కేటీఆర్ ప్రసంగం అనంతరం.. సీఎం అభ్యంతరం
- సర్వేకి, అసెంబ్లీకి సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఆందోళన
- సీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
04:17PM
వాళ్లకు మైక్ ఇవ్వకండి అధ్యక్షా: సీఎం రేవంత్ రెడ్డి
- MCHRD వెబ్ సైట్ లో మాత్రమే ఎస్ కే ఎస్ రిపోర్ట్ ఉంది..
- దానికి ఎవరు ఓనర్ క్లెయిం చేయలేదు
- ప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వే లో పాల్గొనలేదన్న కేటీఆర్.. ఈ చర్చలో ఎలా పాల్గొంటారు?
- సర్వే లో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ కోరిన సీఎం రేవంత్
04:11PM
అధికార పక్షానికి కేటీఆర్ కౌంటర్
- సమగ్ర కుటుంబ సర్వే పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికారులకు గుర్తు చేశాం
- 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది
- ఆ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు
- ఆ డాటాను పారదర్శకంగా వెబ్సైట్లోనూ ఉంచాం
- సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు.
- ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1కోటి 85లక్షల మంది.. 51 శాతం
- ముస్లిం బీసీలతో(10 శాతం) కలిపితే 61 శాతం
- కాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారు
- బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి
- ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి.
- 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం
- కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు.
04:08PM
ఎంఐఎం అక్బరుద్దీన్ ప్రసంగం
- రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12.56 శాతం
- ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
- కుల గణన రిపోర్ట్ సభలో పెట్టే విధానంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
- కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.
- ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి?
- సభలో రిపోర్ట్ పెట్టకుండా.. కనీస సమయం ఇవ్వకుండా సూచనలు ఎలా? చేస్తారు?
- బలహీన వర్గాలకు చాలా కాలంగా అన్యాయం జరిగింది
04:08PM
విపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్
- సర్వేలో ఎలాంటి తప్పులు లేవు
- సర్క్యూలేట్ అవుతున్న డాక్యుమెంట్లోనూ తప్పులే ఉన్నాయి
- పాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారు
- రాష్ట్రంలో బీసీల సంఖ్య పెరిగింది
- మా సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతం
- కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు ఈ సర్వేలో పాల్గొనలేదు
- డీకే అరుణ సహా అనేక మంది నేతలూ పాల్గొనలేదు
- మోదీ ప్రధాని అయ్యాక ఇప్పటిదాకా ఎందుకు కులగణన చేపట్టలేదు
- కుల గణన చేపట్టింది ప్రజల సంక్షేమం కోసమే
- మా కులగణన నివేదిక 100కు వంద శాతం పారదర్శకమైంది
- అపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయి
- పాయల్ శంకర్ను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారు
- సర్వేలో పాల్గొనని నేతలు ఇప్పటికైనా సహకరించండి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాం
- చట్టం ప్రకారం కుదరకపోతే.. పార్టీ పరంగా ఇస్తాం
- బీసీ ల సంఖ్య తగ్గడం ఏంటి.. మిగతా సంఖ్య ఎలా పెరిగింది?
- తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి
:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
మంత్రులు పదే పదే మాట్లాడడం సరైంది కాదు .
అందరూ మాట్లాడాక చివర మాట్లాడితే మంచిది..
:::తలసాని
2014 సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అసలు డాటా ఉందా?
:::ఉత్తమ్
- గత ప్రభుత్వం చేసిన సర్వే ను తప్పు పడితే ఎలా..
- ప్రభుత్వం సర్వే పనికిరాదా?
:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
03:49PM
శాసన సభలో మంత్రి ఉత్తమ్
- ప్రతిపక్ష నేతలు ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
- దేశంలో పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంది.. ఏ రాష్ట్రంలో అయినా బీసీ కులగణన చేశారా?
- తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన జరిగింది.
- కాంగ్రెస్ స్లోగన్ ‘‘సోషల్ జస్టిస్’’
- ప్రతిపక్ష నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ప్రజెంటేషన్ ఇస్తాం.
- ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న సూచనలు, సద్విమర్శలు తీసుకుంటాం
- అపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదు
- జనాభా ను తగ్గించామని చెప్పడం సరైంది కాదు
- నాలుగున్నర కోట్లు ,అయిదు కోట్లు అని అపోహలు సృష్టించడం సరైంది కాదు
03:41PM
శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్
- ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక.. సమగ్ర ఇంటింటి కుల సర్వే.. ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది..
- స్వతంత్రం రాక ముందు 1931 ముందు కుల సర్వే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కుల సర్వే జరగలేదు
- బలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవి
- భారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగింది
- బలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఫిబ్రవరి 4 కేబినెట్ సమావేశం జరిగింది.. 16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాం
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది
- లక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం..
- 1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండి
- బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాం
- ప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి..
- తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలి
- ఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుంది
- బలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైంది
- తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్..
- తెలంగాణ దేశానికి దిక్సూచి
- నిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారు
- నివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది..
- తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది
- 1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించినం
- బావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమం
- ఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల్ కొలమానం భవిష్యత్ లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది.
- ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం.
- నివేదిక సబ్ కమిటీకి సమర్పించారు
- సబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది..
- బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది
- 2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు..
- కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు..
- దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది
- 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది..
- సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం.
- చాలా కాలంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది..
- బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలి
- బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదు
- అందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి..
- బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు..
- బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు
- 10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి..
- గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా ,సబ్ కమిటీ సభ్యుడిగా , డిక్లరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది..
- మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి
- బీసీలకు టిక్కెట్ లలో అన్యాయం జరుగుతుంది
- టిక్కెట్ వచ్చిన వాల్లలో కొంత మందిని గెలిపించారు
- బీసీ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాం
::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
- బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు.. బీజేఎల్పీగా బీసీ కి అవకాశం ఇస్తే బావుండేది.
:::మంత్రి పొన్నం
- బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించింది మేము కాదు..
- కేంద్ర మంత్రి గా ఉన్న బీసీ నేత బండారు దత్తాత్రేయ ను మేము తొలగించలేదు..
- బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చేదే మేము
::మంత్రి శ్రీధర్ బాబు
- బలహీనవర్గాలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి
- బీఆర్ఎస్ హయాంలో బీసీలకు అధిక లబ్ధి జరిగింది.
- జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదు
- తెలంగాణ కుల గణన సర్వేలో ఎస్సీ, బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది
:::తలసాని శ్రీనివాస యాదవ్
2: 45pm
అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..
- పార్లమెంట్ ఎన్నికల కారణం గా కులగణన కొంత ఆలస్యం అయింది: సీఎం రేవంత్ రెడ్డి
- వివిధ రాష్ట్రాలలో సర్వే లు చేసి... పకడ్బందీగా కులగణన చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
- లక్ష కు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు: సీఎం రేవంత్ రెడ్డి
- 76 వేల మంది ఉధ్యోగులు డేటా ఎంట్రీ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
- కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీ లకు అతీతంగా అభినందించాలి: సీఎం రేవంత్ రెడ్డి
2: 21pm
అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..
- కులగణన చేసిన విధానాన్ని సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు: సీఎం రేవంత్ రెడ్డి
- అందుకే కులగణన చేసాం: సీఎం రేవంత్ రెడ్డి
- 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డి
- కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి
2: 21pm
తెలంగాణ శాసన సభ లో కుల గణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
2: 20pm
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. కులగణన,ఎస్సీ వర్గీకరణపై చర్చ
01:02PM
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
- కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలి
- సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీ
- భేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా
11:53AM
సభ వాయిదాపై హరీష్రావు సెటైర్
- అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?
- కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం
- నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు
- ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?
:::ఎక్స్లో మాజీ మంత్రి హరీష్రావు పోస్ట్
11:44AM
సభ వాయిదాపై బీఆర్ఎస్ నేతల ఫైర్
- శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది
- ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు
- సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు
- తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది
- కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ?
- కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు
- మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు
- ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం
:::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
- బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ?
- కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ?
- బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది
- మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా
- మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .
- బీసీ గణన తప్పుల తడక
:::మాజీ మంత్రి గంగుల కమలాకర్
- తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..
- ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..
- షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..
- కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...
- మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..
- మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..
- స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..
- సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..
- సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..
- నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...
- బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..
- బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..
- బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..
- తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది
:::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
11.33AM
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు
11.21AM
అవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది
తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం
అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం
పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం
కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం
:::రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
11.13AM
ఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్ఎస్ ఫిర్యాదు
- స్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు
- ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్ఎస్
- అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్ఎస్
- బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్ఎస్
- శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్కు BRS ఫిర్యాదు
11:07AM
తెలంగాణ అసెంబ్లీ వాయిదా
- తెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా
- కొనసాగుతున్న కేబినెట్ భేటీ
- మంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
- అంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. మధ్యాహ్నాం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం
11:05AM
- క్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబు
- సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్ బాబు
- సభను వాయిదా వేయాలని స్పీకర్ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్ బాబు
11:03AM
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
10:50AM
ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..
SC వర్గీకరణ - శాతం
గ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%
గ్రూప్ 2 - మాదిగ మాదిగ ఉప కులాలు - 9%
గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%
10:40AM
అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం
10:30AM
- కులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.
- హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.
- హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.
- గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.
- కుల గణన సర్వేపై అపోహలు వద్దు.
- ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.
- బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.
- బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.
- మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది
:: మంత్రి పొన్నం ప్రభాకర్
10:20AM
- బీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం
- అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
- కాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డి
- రాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డి
- మతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డి
- ఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డి
- కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి
10:04AM
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
09:30AM
- నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
- ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..
- కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..
- కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..
- అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
- అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం..
Comments
Please login to add a commentAdd a comment