assembly session
-
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజుల పాటు జరిగిన సమావేశాలు97 గంటల 32 నిమిషాలు సాగిన సభమూడు తీర్మానాలను ఆమోదించిన సభ12 బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదంసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం
Telangana Assembly Session Updates..అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.అరగంట పాటు వివేక్, సుమన్ మధ్య చర్చలు.వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..ఇప్పటి వరకు సస్పెండ్పై బులెటిన్ ఇవ్వలేదు.రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహంబులెటిన్ ఇస్తే నేను రానుఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుందిపద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదురాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందిసస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్ను కలుస్తాను.స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదుసస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులుగంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు.నిన్న జాన్ పాడ్లో జానారెడ్డి దావత్కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.మార్షల్స్తో బీజేపీ సభ్యుల వాగ్వాదం.. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్కి మధ్య వాగ్వాదం.అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల డిమాండ్రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీటన్నెల్ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులుకార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలుఅసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి.. -
మీ ప్రాథమ్యాలు యజ్ఞయాగాలే!
సాక్షి, హైదరాబాద్: ‘అప్పుడు మీ ప్రాథమ్యాలు కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలు, కొత్త సచివాలయం, పెద్ద భవనాలు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయాలు, పోలీసులకు ఏసీ వాహనాలు, చండీయాగాలు, ప్రగతి భవన్లో య జ్ఞాలు, యాగాలే.. ప్రజలకు మంచి రోడ్లు ఉండాలని మా త్రం కాదు. నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు, బ్రిడ్జీలు కట్టాలని ఉంది’అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం రాజేశాయి.రోడ్ల నిర్మాణంపై శనివారం ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యాగాలు చేశామని, సచివాలయం కట్టామని తమను అవమానించారని వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు దేవుడిపై భక్తి ఉందన్నారు. ‘నేను వాటర్ నీళ్లు అనను... ఎక్కడంటే అక్కడ చేపల పులుసు తినను’అని కోమటిరెడ్డి తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులంతా నిష్క్రమించారు.దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు స్పందిస్తూ యాగాలు చేయడం తప్పని కోమటిరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ ప్రాథమ్యాల గురించే మాట్లాడారని.. దీనికే వారు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని వివరణ ఇచ్చారు. తన సమాధానాలకు దిమ్మ తిరిగే వారు వెళ్లిపోయారని విమర్శించారు.రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై కోమటిరెడ్డి వర్సెస్ ప్రశాంత్రెడ్డి అంతకుముందు రోడ్ల మరమ్మతు లు, నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయ డం లేదని.. ఫలితంగా తమ హయాంలో ప్రారంభమైన పనులు సైతం ఆగిపోయాయని ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో తాము రోడ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో రూ. 200 కోట్లతో రోడ్లు వేశామన్నారు.అయితే ఈ వాదనను కోమటిరెడ్డి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 8,112 కోట్లతో 6,668 కి.మీ. రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్రెడ్డికి కొబ్బరికాయ కొట్టి సన్మానం చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తనపై కక్షతో నియోజకవర్గంలో రోడ్లకు నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 7 కి.మీ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను బీఆర్ఎస్ పాలనలో కట్టలేకపోయారని కోమటిరెడ్డి ఆరోపించగా అది ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అని ప్రశాంత్రెడ్డి వివరణ ఇచ్చారు. -
తెలంగాణ అసెంబ్లీ: బీఆర్ఎస్ Vs మంత్రులు..
Telangana Assembly Session Updatesతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంబీఆర్ఎస్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్తెలంగాణవ్యాప్తంగా 29వేల కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి.మాజీ ఆర్ అండ్ బీ మంత్రి చేసిన ఘనకార్యం మాకు తెలుసుపదేళ్లలో 6వేల కిలో మీటర్లు రోడ్లు వేశారు.పదేళ్లలో 3900 కోట్లు ఆర్ అండ్ బీకి కేటాయించిగా 4వేల కోట్లు లోన్స్ తీసుకున్నారుహరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వస్తారా చూపిస్తాం.హరీష్ రావు మాట్లాడితే బాధ వేస్తోంది.మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుంది.వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అవుతాయి.రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది.మేము పనిచేస్తాం.. బీఆర్ఎస్ నేతల్లాగా మాట్లాడలేం.పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీనే.ఉద్యోగాలు ఇచ్చాం అంటే మేము రెడీ చేసాం అంటున్నారు..మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదు.బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారు.మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డిరోడ్లు వేయలేదని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే 200 కోట్లకు పైచిలుకు నిధులతో రోడ్లు వేశాను.ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం పరిధిలో ఉంది. పనులు అప్పుడు కాలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది ఏమైనా పనులు జరిగాయా?నా క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండి.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..నా నియోజకవర్గంలో 200 కోట్లతో రోడ్లు వేసామని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.ఆ రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్ రెడ్డికి సన్మానం చేపిస్తా.బీఆర్ఎస్ నాయకుల అబద్దాలకు లెక్కలేదు. బీఆర్ఎస్ ప్రశ్నకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా వాకౌట్.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో డబల్ రోడ్లు 8000 కిలోమీటర్లు.నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశాం.17వేల కిలో మీటర్లకు 23వేల కోట్లు ఖర్చు అవుతాయి.మొత్తం ఖర్చులో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.ప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుంది.ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారు.ఇప్పటికీ ఏడాదిన్నర కాలం పూర్తయింది.మూడున్నర సంవత్సరాలలో 17వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు?మాజీ మంత్రి హరీష్ కామెంట్స్..ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది.సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి.కొత్త ప్రతిపాదనలు లేవని మంత్రి అంటున్నారు.బడ్జెట్ పుస్తకంలో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది.60 శాతం ప్రభుత్వమని భట్టి విక్రమార్క అంటే.. ప్రైవేట్ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.బీఆర్ఎస్ పాలనలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్డులు వేశాం. శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న..సరూర్నగర్ చెరువు, మూసీ అభివృద్ధిపై ప్రశ్న వాయిదాఫీజు రియింబర్స్మెంట్పై చర్చ ప్రారంభంమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు.మేము టార్గెట్, ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం.. సాధిస్తాంకొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం119 సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్లను ఏర్పాటు చేస్తాం.భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు.సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయమై ముఖ్యమంత్రిని కలిశాం72ఏళ్ల వయసులో నేను ఎందుకు పార్టీ మారతాను?కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్ లో ఉన్నారుఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుబీఆర్ఎస్ లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్దంగా ఉన్నాంజమిలి ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానుసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు దాదాపు 7000 కోట్లు ఉన్నాయి.పెండింగ్ వల్ల కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.కాలేజీలు మూతపడితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.మంత్రి సీతక్క కామెంట్స్.. ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్సార్ తీసుకొచ్చిన గొప్ప పథకంఫీజు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తాంగత ప్రభుత్వంలోనే 4వేల కోట్లకు పైగా బకాయిలు ఉండేవి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11 వందల కోట్లకు పైగా బకాయిలు అయ్యాయి.12 వందల టోకెన్లు ఇప్పటికే రైజ్ అయ్యాయి.హరీష్ రావు కామెంట్స్..సీతక్క గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ రెండు వేల కోట్లు బకాయిలు ఉండేవి.బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు అనేది సత్యదూరం20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం.800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీతక్క అన్నారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.వెంటనే 2వేల కోట్లు విడుదల చేస్తే కాలేజీలు బతుకుతాయి సచివాలయంలో ఎర్త్ అవర్..తెలంగాణ సచివాలయంలో శనివారం ఎర్త్ అవర్ పాటింపు.శనివారం 23/03/2025 రోజున ఎర్త్ అవర్లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు సచివాలయంలో ఎర్త్ అవర్ పాటింపు.సచివాలయంలో గంటసేపు లైట్లు ఆఫ్ చేయాలని నిర్ణయం -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్మెంట్పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్గా క్యాలెండర్గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్నగర్లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
జగన్ నామ స్మరణతోనే ముగిసిన AP అసెంబ్లీ
-
తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం. -
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అభ్యంతరం
AP Assembly And Council Updates11:05 AMశాసనమండలికి స్వల్ప విరామంశాసనమండలి కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సభ్యులువైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడుమంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల పై వైఎస్సార్సీపీ అభ్యంతరంశాసనమండలి విపక్ష నేత,బొత్స సత్యనారాయణవ్యవసాయానికి పేటెంట్ ఎవరిదో...వ్యవసాయం సుద్ధ దండగ అని ఎవరు చెప్పారో అందరికీ తెలుసువ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చించుకుమదామంటే మేం రెఢీసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదుకేంద్రం ఇచ్చిన క్లస్టర్ల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం10:45AMపెన్షన్ల పై మండలిలో ప్రశ్నోత్తరాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్ లు ఉన్నాయికూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయిఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ...ఎన్ని తొలగించారువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసిందికూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మంది పెన్షన్లు తగ్గించారుబడ్జెట్ లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా.. లేదా..పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారుకూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు..కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు. నిన్నటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలుఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదంరాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పురాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు‘నిరుద్యోగ భృతి’.. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’పథకం అమలుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్న సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి ‘ఆ పథకాన్ని తమ శాఖ అమలు చేయడం లేదంటూ’ జవాబు ఎప్పటిలోగా అమలు చేస్తారన్నదానికి ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ పథకం ఎప్పటినుంచి అమలు అన్నదానిపైనా దాటవేత చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్డీఏ ఎండీకి అధికారం. -
శాసనమండలి.. ఫీజు రియింబర్స్మెంట్, వలంటీర్లపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు
ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్డేట్స్.. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలు..వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చవలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామివాలంటీర్ల తొలగింపుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారుఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించిందివలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారునవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారువాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారువ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారుజీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయంవాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారుఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందిలేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.ఫీజు రియింబర్స్మెంట్పై వైఎస్సార్సీపీ సభ్యుల నిలదీత..రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామిఫీజు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తామన్నారుఇప్పటి వరకూ ఇవ్వలేదు.వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్ జగన్.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారుకాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారుగతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారుఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయంవిద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలిమొత్తం ఫీజు రియింబర్స్మెంట్ చేస్తారా?హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్మెంట్ తెచ్చారుఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారుఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారువిద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి -
తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..
Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వం ఫోకస్పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్ గంగుల.. 👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు. -
మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంంలో మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో తమతో చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గవర్నర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీనవర్గాలకు చెందిన మహిళ గవర్నర్గా ఉంటే.. ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్పూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం.. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణం. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించాం. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం. గతంలో ఎన్నికప్పుడే రైతుబంధు అన్నదాత అకౌంట్లలో పడేది. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా అందిస్తామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారు. మా తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్కు, బీఆర్ఎస్ నేతలకు క్షమాపణ చెబుతాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతాం. లెక్కలతో సహా నిరూపిస్తాను.. చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీటి కోసం పోరాటం చేస్తున్నాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా?. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్న పెంచితే తెలంగాణ ఎడారి అవుతుందని పీజేఆర్ అడ్డుకున్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు.. సంతోష్కు రాజ్యసభ ఇవ్వలేదా?. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలిచ్చారు.. పదేళ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు?. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు తక్కువ, పెట్టిన పరీక్షలు ఎక్కువ. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లా అమ్మేశారు. గత ప్రభుత్వంలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మేసింది. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దిగజారిస్తే మేం ప్రక్షాళన చేశాం. ఒక్క ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చాం. 19 శాతం నిరుద్యోగాన్ని తగ్గించిన ఘనత మాది. విద్యాశాఖను మేం ప్రక్షాళన చేశాం. 20 ఏళ్లు ప్రమోషన్, 10 ఏళ్లు ట్రాన్స్ఫర్ లేని వారికి శుభవార్త అందించాం. చిన్న వివాదం కూడా లేకుండా 36వేల మంది టీచర్లను బదిలీ చేశాం. గ్రూప్-2,3,4 పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశాం’ అని తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
-
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం
-
తొలిసారి కాదు .. రెండో సారి ఎన్నికల్లో గెలవడం గొప్ప .. సీఎల్పీలో రేవంత్
సాక్షి,హైదరాబాద్ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా. వచ్చే నెల 6 నుండి జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్లో ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో మేం చేసిన డిమాండ్స్ ఇవే
సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు తరలిస్తుంటే రేవంత్ సర్కార్ చోద్యంగా చూస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించాలని తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం (BAC Meeting)లో డిమాండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Telangana Assembly Speaker) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం హరీష్ రావు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపాం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా స్పీకర్ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం. సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్కు సభలో సమయం ఇవ్వాలని కోరాం. తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. రైతాంగ సమస్యలు, తాగు సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరామని.. వివిధ (సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం,ఎస్ ఎల్ బీసీ ప్రమాదం) ప్రాజక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేమన్నారు. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరామన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల వినియోగంలో విఫలం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఏసీలో చెప్పామన్నారు. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలని, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పామన్నారు. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. -
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. బడ్జెట్పై మాట్లాడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడాలన్నారు. అలాగే, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.ఎమ్మెల్సీ కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్ వచ్చారు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్ నామినేట్ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్ బీఆర్ఎస్ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్ఎస్పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.రెండు జాతీయ పార్టీలదీ ఒకటే ధోరణి. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు టీడీఆర్ ల్యాండ్ కొనే పనిలో తిరుగుతున్నారు. టీడీఆర్ అతి పెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారు. రేవంత్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల ద్వారా శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే యోచనలో రేవంత్ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం లేని అప్పులు చూపించి.. ఎక్కువ మిత్తి చూపిస్తున్నారు. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న రేవంత్.. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒక్క పోరాటమైనా చేసిందా?. బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్గా ఉంది. అందుకే అటెన్షన్ కోసం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. ఈ-కారు రేసును ముందుకు తెచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం ఏం సాధిస్తారు?. 200 కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది?. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని ప్రశ్నించారు. -
ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025 అప్డేట్స్.. సమావేశాల్లో భాగంగా కూటమి హామీల ఎగవేతను, అరాచక పాలనను, గత ప్రభుత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని శాసన మండలిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్సీపీ 👉 శాసన మండలి రేపటికి వాయిదావీసీల బలవంతపు రాజీనామాలపై చర్చ..వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు ఇస్తే విచారణ చేస్తామని గతంలో మంత్రి లోకేష్ ప్రకటనసభకు ఆధారాలను అందజేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపించాలని డిమాండ్చేనేతపై చర్చ..చేనేత రంగానికి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని కోరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుసమాధానం దాటవేస్తూ వైఎస్సార్సీపీపై మంత్రి సవిత విమర్శలుబొత్స సత్యనారాయణను మాట్లాడకుండా అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ సభ్యులువైఎస్ జగన్ నేతన్న ద్రోహి అంటూ తీవ్ర విమర్శ చేసిన మంత్రి సవితమంత్రి సవిత వ్యాఖ్యలపై బొత్స ఫైర్శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్గత 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలను మోసం చేసిందినేతతన్నలకు రుణమాఫీ చేస్తామని చేయలేదుచేనేతల సమస్యలపై అధ్యయనం చేస్తామని చేయలేదు.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామని ఇవ్వలేదు.వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకానికి 969 కోట్లు ఇచ్చాం.మేము తప్పు మాట్లాడితే మాపై చర్యలు తీసుకోవచ్చు.మా సభ్యులు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పటం లేదుచేనేతల వ్యవహారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం.దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా?ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలిపనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారుదిశ యాప్ ఉంటే ఎంతో ఉపయోగపడేదిదిశ యాప్ను కొనసాగిస్తారా లేదా?దిశ యాప్ స్థానంలో మరొక యాప్ తీసుకొస్తారా లేదా సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కామెంట్స్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రశ్నోత్తరాలుఛార్జీలు పెంచబోమని చెప్పి యూనిట్ పై 2 రూపాయలు భారం వేశారుసర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు భారం వేశారుగత టీడీపీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది2014 నుంచి 19 వరకూ 13 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే2019 నుంచి 24 వరకూ 47 వేల కోట్ల రూపాయల సబ్సిడీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరించిందిరేట్లు పెంచకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరించాలిఉన్నదానిని తగ్గిస్తామని మాటిచ్చారుఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..విద్యుత్ చార్జీలు పెంచమని టీడీపీ రకరకాలుగా ప్రచారాలు చేసిందిట్రూ అప్ తో పాటు సర్దుబాటు ఛార్జీలు.. టైమ్ ఆఫ్ ది డే ఛార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారుమీరిచ్చిన మాటేంటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటిటారిఫ్, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారా.. ఇది మాటతప్పడం కాదా? YSRCP ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభంమండలి లో వైస్సార్ర్సీపీ వాయిదా తీర్మానంనిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన YSRCP ఎమ్మెల్సీ లుఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్ హామీ ఇచ్చిన కూటమి9 నెలలు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ పూర్తి కాని వైనంమెగా డీస్సీపైనా జాప్యం ఏది విధ్వంసం.. ఎవరిది విధ్వంసం?అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలుఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే చెత్తబుట్టకు చేరిన మేనిఫెస్టో పైగా గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా?ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్లో కోతలు పెట్టిన చంద్రబాబు చేసేది విధ్వంసమా? ఎవరిది విధ్వంసం? ఎవరు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు.జగన్ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం:::కూటమి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులుఇదీ చదవండి: సీఎం పదవిలో ఉన్నవాళ్లెవరైనా అలా మాట్లాడతారా? -
భారీగా అప్పుల అంచనాతో ఏపీ బడ్జెట్
-
Watch Live: అసెంబ్లీ కి వైఎస్ జగన్
-
రేపు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ నేతలు.. ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రేపు(సోమవారం) అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు. ఆ హోదాలో ఉంటేనే సభలో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్సీపీ ప్లాన్ చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో తగిన సమయం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని పట్టబడనుంది.కూటమి ప్రభుత్వం కుట్రలను అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టేందుకు వైఎస్సార్సీపీ రెడీ అయింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే ఒక ప్లాన్ ను రూపొందించింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు మాత్రమే. అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే రావాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశ్యంతో వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ఆ హోదా ఇస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఎక్కడ గట్టిగా నిలదీస్తుందోననే భయంతో కూటమి పార్టీలు ఉన్నాయి. నిజానికి ప్రతిపక్షంగా గుర్తిస్తే కచ్చితంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికి అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజల గొంతు విప్పటానికి ఒక హక్కుగా తగిన సమయం కూడా లభిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఈ అవకాశం ఉండదు. అందుకనే వైఎస్సార్సీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. వైయస్సార్ సీపీ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ ఇప్పటి వరకు ఈ పిటిషన్ పై తన అభిప్రాయాన్న చెప్పలేదు. అంటే ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశం వైఎస్సార్సీపీకి ఇవ్వకూడదన్నదే తమ నిర్ణయమని చెప్పకనే చెప్పినట్లు అయింది.కూటమి నేతల కుట్రలు..వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఇష్టం లేదన్న సంగతి గతంలోనే కూటమి నేతల మాటల్లోనే తేలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనేకసార్లు మీడియా సమావేశాల్లోనే తమ బుద్దిని బయట పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం వారిలో ప్రతిసారీ కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటం లేదు. పైగా గతంలో జగన్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామనీ, ఏ పథకాన్ని నిలిపేసేది లేదని చెప్పిన చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎక్కడ నిలదీస్తుందోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. మిర్చి రైతుల కోసం..అదేకాదు.. మిర్చి రైతులకు కనీసం గిట్టుబటు ధరలు కూడా లేకపోవటం దగ్గర్నుంచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లటం, మహిళలు-ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం, దారుణ హత్యల వరకు అన్ని అంశాలపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందనే భయంతో కూటమి నేతలు ఉన్నారు. గ్రూపు-2 అభ్యర్థులను మోసం చేసిన తీరు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనంపై వైఎస్సార్సీపీ చంద్రబాబు సర్కారుకు చుక్కలు చూపిస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో ఉంది. ఇలా వరుస వెంబడి ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో కూటమి నేతలు ఉన్నారు. సభ సాక్షిగా ప్రజల గొంతుకగా వైసీపీ నిలవడం, సమస్యలపై నిశితంగా మాట్లాడటం అనేది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధ్యం కాదు. కాబట్టే వైయస్సార్ సీపీకి ఆ హోదాను ఇచ్చేందుకు కూటమి పెద్దలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదాపై శాసనసభలో డిమాండ్ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ డిమాండ్కు వెనుక ఉన్న సదుద్దేశాన్ని, న్యాయబద్ధతను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనని వైయస్సార్ కాంగ్రెస్పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం సోమవారం జరగబోయే సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కానుంది. -
మార్చిలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక భేటీలో బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిపాదించనుంది.అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ బిల్లులను ఆమోదిస్తారు. ఆపై వీటి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించనున్నారు. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టంగా రూపాంతరం చెందనుంది. దీంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోనుంది. ఈ మూడు బిల్లుల ముసాయిదా రూపకల్పనలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మూడు ముసాయిదా చట్టాలకు తుదిరూపు లభించనుంది.బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడోవారంలో!2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
తెలంగాణ అసెంబ్లీలో బీసీ జనాభా లెక్కల నివేదికపై చర్చ
-
Updates: అసెంబ్లీలో వాడీవేడిగా కులగణనపై చర్చ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. ఈనివేదికకు ఆమోద ముద్ర వేసింది. 04:29PMతెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా04:26PMమాకు మైక్ ఇవ్వకపోవడం అన్యాయం: KTRస్పీకర్ మైక్ ఇవ్వాలని BRS డిమాండ్.మైక్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్న కేటీఆర్04:24PMబీజేపీ ఎమ్మెల్యేల నిరసన తమకు మైక్ ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు బీజేపీ సభ్యుల నిరసనబీసీలపై చర్చ సందర్భంగా.. బీసీలకు మైక్ ఇవ్వకుంటే ఎలా? అని నిలదీత04:22PMశాసనసభలో బీఆర్ఎస్ ఆందోళనసమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్న వాళ్లకే మైక్ ఇవ్వాలని స్పీకర్ను కోరిన సీఎం రేవంత్కేటీఆర్ ప్రసంగం అనంతరం.. సీఎం అభ్యంతరంసర్వేకి, అసెంబ్లీకి సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఆందోళనసీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు04:17PMవాళ్లకు మైక్ ఇవ్వకండి అధ్యక్షా: సీఎం రేవంత్ రెడ్డిMCHRD వెబ్ సైట్ లో మాత్రమే ఎస్ కే ఎస్ రిపోర్ట్ ఉంది..దానికి ఎవరు ఓనర్ క్లెయిం చేయలేదుప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వే లో పాల్గొనలేదన్న కేటీఆర్.. ఈ చర్చలో ఎలా పాల్గొంటారు?సర్వే లో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ కోరిన సీఎం రేవంత్04:11PMఅధికార పక్షానికి కేటీఆర్ కౌంటర్సమగ్ర కుటుంబ సర్వే పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికారులకు గుర్తు చేశాం2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందిఆ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారుఆ డాటాను పారదర్శకంగా వెబ్సైట్లోనూ ఉంచాంసమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు.ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1కోటి 85లక్షల మంది.. 51 శాతంముస్లిం బీసీలతో(10 శాతం) కలిపితే 61 శాతంకాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారుబీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలిఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి.42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాంకాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు.04:08PMఎంఐఎం అక్బరుద్దీన్ ప్రసంగంరాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12.56 శాతంముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతంకుల గణన రిపోర్ట్ సభలో పెట్టే విధానంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహంకేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి?సభలో రిపోర్ట్ పెట్టకుండా.. కనీస సమయం ఇవ్వకుండా సూచనలు ఎలా? చేస్తారు?బలహీన వర్గాలకు చాలా కాలంగా అన్యాయం జరిగింది04:08PMవిపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్సర్వేలో ఎలాంటి తప్పులు లేవుసర్క్యూలేట్ అవుతున్న డాక్యుమెంట్లోనూ తప్పులే ఉన్నాయిపాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారురాష్ట్రంలో బీసీల సంఖ్య పెరిగిందిమా సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంకేసీఆర్, కేటీఆర్, హరీష్రావు ఈ సర్వేలో పాల్గొనలేదుడీకే అరుణ సహా అనేక మంది నేతలూ పాల్గొనలేదుమోదీ ప్రధాని అయ్యాక ఇప్పటిదాకా ఎందుకు కులగణన చేపట్టలేదుకుల గణన చేపట్టింది ప్రజల సంక్షేమం కోసమేమా కులగణన నివేదిక 100కు వంద శాతం పారదర్శకమైందిఅపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయిపాయల్ శంకర్ను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారుసర్వేలో పాల్గొనని నేతలు ఇప్పటికైనా సహకరించండిస్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాంచట్టం ప్రకారం కుదరకపోతే.. పార్టీ పరంగా ఇస్తాం బీసీ ల సంఖ్య తగ్గడం ఏంటి.. మిగతా సంఖ్య ఎలా పెరిగింది?తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రులు పదే పదే మాట్లాడడం సరైంది కాదు .అందరూ మాట్లాడాక చివర మాట్లాడితే మంచిది..:::తలసాని2014 సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అసలు డాటా ఉందా?:::ఉత్తమ్గత ప్రభుత్వం చేసిన సర్వే ను తప్పు పడితే ఎలా..ప్రభుత్వం సర్వే పనికిరాదా?:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 03:49PM శాసన సభలో మంత్రి ఉత్తమ్ప్రతిపక్ష నేతలు ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.దేశంలో పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంది.. ఏ రాష్ట్రంలో అయినా బీసీ కులగణన చేశారా?తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన జరిగింది.కాంగ్రెస్ స్లోగన్ ‘‘సోషల్ జస్టిస్’’ప్రతిపక్ష నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ప్రజెంటేషన్ ఇస్తాం.ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న సూచనలు, సద్విమర్శలు తీసుకుంటాంఅపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదుజనాభా ను తగ్గించామని చెప్పడం సరైంది కాదునాలుగున్నర కోట్లు ,అయిదు కోట్లు అని అపోహలు సృష్టించడం సరైంది కాదు03:41PMశాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక.. సమగ్ర ఇంటింటి కుల సర్వే.. ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది..స్వతంత్రం రాక ముందు 1931 ముందు కుల సర్వే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కుల సర్వే జరగలేదుబలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవిభారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగిందిబలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందిఫిబ్రవరి 4 కేబినెట్ సమావేశం జరిగింది.. 16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాంపార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగిందిలక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం..1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండిబలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాంప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి..తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలిఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుందిబలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైందితెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్..తెలంగాణ దేశానికి దిక్సూచినిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారునివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది..తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించినంబావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమంఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల్ కొలమానం భవిష్యత్ లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది.ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం.నివేదిక సబ్ కమిటీకి సమర్పించారుసబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది..బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు..కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు..దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది..సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం.చాలా కాలంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది..బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలిబలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదుఅందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి..బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు..బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి..గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా ,సబ్ కమిటీ సభ్యుడిగా , డిక్లరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది..మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి బీసీలకు టిక్కెట్ లలో అన్యాయం జరుగుతుందిటిక్కెట్ వచ్చిన వాల్లలో కొంత మందిని గెలిపించారుబీసీ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాం::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు.. బీజేఎల్పీగా బీసీ కి అవకాశం ఇస్తే బావుండేది.:::మంత్రి పొన్నం బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించింది మేము కాదు..కేంద్ర మంత్రి గా ఉన్న బీసీ నేత బండారు దత్తాత్రేయ ను మేము తొలగించలేదు..బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చేదే మేము::మంత్రి శ్రీధర్ బాబుబలహీనవర్గాలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయిబీఆర్ఎస్ హయాంలో బీసీలకు అధిక లబ్ధి జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదుతెలంగాణ కుల గణన సర్వేలో ఎస్సీ, బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది:::తలసాని శ్రీనివాస యాదవ్2: 45pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..పార్లమెంట్ ఎన్నికల కారణం గా కులగణన కొంత ఆలస్యం అయింది: సీఎం రేవంత్ రెడ్డివివిధ రాష్ట్రాలలో సర్వే లు చేసి... పకడ్బందీగా కులగణన చేశాం: సీఎం రేవంత్ రెడ్డిలక్ష కు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు: సీఎం రేవంత్ రెడ్డి76 వేల మంది ఉధ్యోగులు డేటా ఎంట్రీ చేశారు: సీఎం రేవంత్ రెడ్డికులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీ లకు అతీతంగా అభినందించాలి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం.. కులగణన చేసిన విధానాన్ని సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు: సీఎం రేవంత్ రెడ్డిఅందుకే కులగణన చేసాం: సీఎం రేవంత్ రెడ్డి1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డికేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmతెలంగాణ శాసన సభ లో కుల గణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2: 20pmతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. కులగణన,ఎస్సీ వర్గీకరణపై చర్చ 01:02PMముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీకులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలిసీఎం రేవంత్ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీభేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా 11:53AMసభ వాయిదాపై హరీష్రావు సెటైర్అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంనాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదుఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?:::ఎక్స్లో మాజీ మంత్రి హరీష్రావు పోస్ట్11:44AMసభ వాయిదాపై బీఆర్ఎస్ నేతల ఫైర్శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం :::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ? బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .బీసీ గణన తప్పుల తడక :::మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది :::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్11.33AMఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు11.21AMఅవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యేతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం:::రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే11.13AMఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్ఎస్ ఫిర్యాదుస్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్ఎస్అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్ఎస్బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్ఎస్శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్కు BRS ఫిర్యాదు 11:07AMతెలంగాణ అసెంబ్లీ వాయిదాతెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాకొనసాగుతున్న కేబినెట్ భేటీమంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. మధ్యాహ్నాం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం 11:05AMక్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబుసీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్ బాబుసభను వాయిదా వేయాలని స్పీకర్ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్ బాబు 11:03AMతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం10:50AMఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..SC వర్గీకరణ - శాతంగ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%గ్రూప్ 2 - మాదిగ మాదిగ ఉప కులాలు - 9%గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%10:40AMఅసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం10:30AMకులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.కుల గణన సర్వేపై అపోహలు వద్దు.ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది:: మంత్రి పొన్నం ప్రభాకర్ 10:20AMబీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డిరాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డిమతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డిఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డికామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి10:04AMహైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి09:30AMనేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం.. -
బీసీ రిజర్వేషన్లకు 5న కేబినెట్, అసెంబ్లీ ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని ఈ నెల 5న జరగనున్న కేబినెట్ సమావేశంలో తేల్చనున్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన 5న మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి, బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఆ నివేదికపై సభలో చర్చించను న్నారు. అదే రోజు నివేదికను సభ ఆమోదించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.కాగా ఆదివారం ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కులగణన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్కు సచివాలయంలో అందించనున్నట్లు తెలిసింది. ఉత్తమ్ నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం, సీతక్కలతో కులగణనపై గత ఏడాది అక్టోబర్ 19న మంత్రివర్గ ఉపసంఘం వేసిన విషయం తెలిసిందే.ఈ ఉపసంఘం ఆది, సోమవారాల్లో సమావేశమై నివేదికపై చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేయనుంది. ఆ తర్వాత తుది నివేదికను సీఎం కు సమర్పించనుంది. ఉపసంఘం సూచనల మేరకు రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించిన విషయం తెలిసిందే. -
నేడు తెలంగాణ శాసనసభ ప్రత్యేక భేటీ
-
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ తో మాట్లాడా: CM Reventh
-
మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు: సీఎం రేవంత్
-
అది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ: సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.వందల ఎకరాల్లో ఫాంహౌస్లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు. -
నిరూపిస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తా
-
Watch Live: ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
మన రాష్ట్ర అగ్రిమెంట్ పలు దేశాలకు మారింది
-
ఇందిరాగాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపణీ జరిగింది: CM Revanth
-
అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ
-
Watch Live: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య.. -
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
Watch Live: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. -
ధరణి పోర్టల్ పై పొంగులేటి సంచలన కామెంట్స్..
-
కాంగ్రెస్ కి అక్బరుద్దీన్ కౌంటర్..
-
హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
-
సభలో పొలిటికల్ రచ్చ.. అసెంబ్లీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలన్న హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్ఆర్ఆర్ను పూర్తి చేస్తాం అన్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు. అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్యే వివేకానందపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
-
Watch Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024
-
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు ఆర్వోఆర్ బిల్లును.. -
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్
-
తెలంగాణ సభ సమరం..అసెంబ్లీలో ప్రధాన చర్చలు ఇవే!
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం.. -
తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు.. యెట్టి బిడ్డలు కాదు.. సభలో సీతక్క ఫైర్
-
పిడికిలి బిగించిన ఉత్తేజపు జ్వాలా..
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు
-
బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు. -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగే అవకాశం ఉంది.. -
శాసన మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
AP: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు లైవ్ అప్డేట్స్.. -
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
Watch Live: AP అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
సాక్షి, అమరావతి: రేపటి(సోమవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ వాయిదా పడనుంది.రేపటి నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఈనెల ఆఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సమావేశాల్లో కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సభల్లో బడ్జెట్ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ వాయిదా పడనుంది. -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్తత
-
రణరంగంలా మారిన జమ్మూకశ్మీర్
-
మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం లాభం?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంపై స్పందించారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం కాబట్టి మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో మాకు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం. అందుకే ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.‘‘అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొస్తాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ.. ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను’’ అని అన్నారాయన. -
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రసాభాస
-
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..
-
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తే పేరును మారుస్తామన్నారు.కాగా, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘సురవరం ప్రతాపరెడ్డికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. వారి అభ్యర్థన మేరకు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున నేను సురవరం పేరును ప్రతిపాదిస్తున్నాను. సభలో అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఆమోదం అయితే పేరును మారుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉద్యోగుల జాతరకు ముహూర్తం..
-
నేడు సభ లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న ప్రభుత్వం
-
రేవంత్.. యూఎస్ వెళ్లాక సీఎం కుర్చీకి ఎసరే: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సీఎం అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలి. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పాయింట్ వద్ద కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ.. మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు.హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి. హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. నా జీతం నుంచి నాలుగు లక్షలు వారికి ఇచ్చాను. హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్శిటీ
-
నమ్మితే ప్రాణమిస్తాం
-
రేవంత్ వ్యాఖ్యలు.. సబిత కన్నీరు
-
నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ
-
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
-
నేను చెప్పేటప్పుడు మధ్యలో రాకు
-
నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్@ 2.90 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాస్తవిక కోణాన్ని ప్రతిబింబిస్తూనే అదనపు ఆదాయ రాబడులు, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.2,75,890 కోట్లను ప్రతిపాదించిన ప్రభుత్వం దాని కంటే 5 శాతం మేర కేటాయింపుల పెంపుతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. రాబడుల్లో సంస్కరణలు అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీ లీకేజీలు అరికట్టాలని, గనుల రాయల్టీ చెల్లింపు ఎగవేతలను నిరోధించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో భూముల మార్కెట్ విలువల సవరణ జరిగితే రూ.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు ఈ బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భూముల అమ్మకాలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. మద్యం రేట్లు పెంచడం, ఎలైట్ షాపుల ఏర్పాటు లాంటి విధాన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరిగిన ఆదాయానికి తోడు, ఆర్థిక వృద్ధి కూడా కేటాయింపులకు ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పద్దులూ కీలకమే! ఈసారి బడ్జెట్లో అన్ని శాఖల పద్దులూ భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణమాఫీతో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.64 వేల కోట్లు, సాగునీటి శాఖకు రూ.26–28 వేల కోట్లు, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.45 వేల కోట్ల వరకు, సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రుణమాఫీకే రూ.31 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ఇప్పటికే రూ.6 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఆగస్టు నెలాఖరు నాటికి మిగిలిన రూ.25 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇక ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.53 వేల కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్షి్మ, పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మరిన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరం కాగా, అందులో ఏ మేరకు నిధులు ప్రతిపాదిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. సాగునీటి శాఖకు సంబంధించి రూ.9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం కాగా, అప్పులు, వేతనాలు, ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు అవసరమపి ఆ శాఖ కోరింది. శాఖల వారీ కేటాయింపులకు తోడు అప్పుల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం వేతనాలు, సాధారణ వ్యయం, విద్యుత్ సబ్సిడీలు (గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్) తదితర అనివార్య చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. పింఛన్ల పెంపు కష్టమేనా? ఎన్నికలకు ముందు ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ ప్రకారం ఏడాదికి రూ.11 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కాగా హామీ ఇచ్చిన ప్రకారం పెంచితే నెలకు రూ.1,000 కోట్ల చొప్పున ఏడాదికి మరో రూ.12 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో పింఛన్ల పెంపు ప్రతిపాదన ఉంటుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. అయితే వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినందున ఈ ఏడాదికి పింఛన్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.45వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆర్థిక వృద్ధి ఆసరాగా..! పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈసారి 6.5 నుంచి 7 శాతం వరకు ఆర్థిక వృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి మరో 2–3 శాతం వరకు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ వృద్ధికి తోడు రెవెన్యూ రాబడుల్లో చేపడుతున్న సంస్కరణల కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్లో పెట్టిన రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్ను మరో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంచుతూ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
‘తల్లికి వందనం’పై యూటర్న్.. మంత్రి లోకేష్ ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కార్ మరోసారి విఫలమైంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం పథకం ఉండదని స్వయంగా మంత్రి నారా లోకేష్ సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలులోకి తీసుకోస్తామన్నారు.కాగా, ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో తల్లికి వందనంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు సరిగా జరగలేదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరలేదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేరలేదో సమీక్ష చేయాలి. అలాగే, తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుపరుస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ఇవ్వడంపై చర్చించాల్సి ఉంది. తల్లిదండ్రులు, మేధావులతో చర్చించి ఈ పథకాన్ని అమలుపరుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై దొంగాట ఆడుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 29లో ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని బొంకుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తామని గానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఇస్తామని గానీ చెప్పడం లేదు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకునెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి.. చేయబోయే మోసంపై దాటవేత ధోరణి అవలంబించారు. -
బడ్జెట్ సమావేశాల్లో జాబ్ కేలండర్..
-
డిప్యూటీ స్పీకర్ విషయంలో ట్విస్ట్ తప్పదా?
అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్ టాక్. డిప్యూటీ స్పీకర్ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం. -
కాంగ్రెస్ పాలనపై గద్దర్ పాట పడిన హరీష్ రావు..
-
కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు
-
అసెంబ్లీలో కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి బర్త్డే విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సీటులోంచి లేచారు. మాజీ సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పున్నర్మిణంలో.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని.. ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ గుండెకాయలాంటిది: మంత్రి ఉత్తమ్
-
కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా: సీఎం రేవంత్ రెడ్డి
-
రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేంటి ?..తప్పుగా మాట్లాడితే..
-
కాంగ్రెస్ పార్టీకి చీడపురుగువు..
-
నేడు ఐదవ రోజు తెలంగాణ శాసన సభ సమావేశాలు
-
మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిదో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ జరగనుండగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. మేడిగడ్డకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి సభ్యులు వాస్తవాలు చూడాలి. మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ను కూడా ఆహ్వానించాం. కేసీఆరే ముందుండి ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తే బాగుంటుంది. బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలికాప్టర్లో రావచ్చు. కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మపదార్ధాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు. సాగునీటి ప్రాజెక్టులపై నిన్న చర్చించి వాస్తవాలు చెప్పాం. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కుంగిన ప్రాజెక్ట్ను చూడకుండా గత ప్రభుత్వం దాచిపెట్టింది. అక్కడికి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. కొందరు అధికారులు డాక్యుమెంటను మాయం చేశారు. ఫైళ్ల మాయంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం సభ్యులు వాస్తవాలు చూడాలి. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలనే మేడిగడ్డ పర్యటన. ఇరిగేషన్ ప్రాజెక్టులపై త్వరలో శ్వేతపత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు ఇలా కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీలో భారీ అవినీతి జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన డ్యాంలు 50 ఏళ్లకు పైగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన బ్యారేజీ అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాం. విజిలెన్స్ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసలు వాస్తవలు ప్రజల ముందు ఉంచేందుకు మేడిగడ్డ పర్యటన. సభ్యులందరినీ ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి. వాస్తవాలు కళ్లారా చూసేందుకు బీఆర్ఎస్ను రమ్మంటున్నాం. అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాసేపట్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బస్సులో మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. -
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
హరీష్ రావు Vs కోమటిరెడ్డి
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
-
ఇరిగేషన్ పై శ్వేతపత్రం ఇస్తాం: రేవంత్
-
తెలంగాణ బడ్జెట్: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Live Updates.. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్లు ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు. రెవెన్యూలోటు రూ.5944 కోట్లు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం సమానత్వమే మా ప్రభుత్వ విధానం అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్ సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్దే హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజిస్తాం ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ RRR ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్ గా విభజన సాగుకు పనికి రాని భూములకు సైతం గత సర్కార్ రైతుబంధు ఇచ్చింది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చారు రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తాం ఆయిల్ పామ్ సాగుకు అదనంగా లక్ష ఎకరాలకు పెంపు కైలు రైతులకు రైతు బీమా పథకం వర్తింపజేస్తాం త్వరలో నూతన విత్తన విధానం అమల్లోకి తెస్తాం ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా మారింది ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనంపై ఐదుగురితో కమిటీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250కోట్లు గురుకులాల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలు ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు సాంప్రదాయ వృత్తుల వారికి శిక్షణతోపాటు పనిముట్లు బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు కేటాయింపు కాంగ్రెస్ మేనిఫెస్టో సింహభాగం మహిళల సంక్షేమానికే మహిళలకు గత డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పోషకాహారం తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కేటాయింపులు ఇలా.. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు రూ.40080 కోట్లు. పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల సంక్షేమానికే. బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు. సాంప్రదాయ వృత్తుల శిక్షణతో పాటు పనిముట్లు. విద్యుత్-గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. విద్యుత్ రంగానికి 16825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు. గృహజ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ విద్యారంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.21874కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు. పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు ప్రతిపాదిస్తాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం. విద్యారంగానికి రూ.21389 కోట్లు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు రూ.500 కోట్లు కేటాయింపు. 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు. మా ప్రభుత్వంలో 6956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం. వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు. యువజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. యువకులను రెచ్చగొట్టం కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. జాబ్ క్యాలెండర్ తయారు ప్రక్రియను ప్రారంభించాం. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. త్వరలో 15వేల కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం. టీఎస్పీఎస్సీకి రూ.40కోట్ల ఆర్థిక వనరులు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగి మరణిస్తే రూ.5లక్షల ఎక్స్గ్రేషియా. చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కొనుగోలు చేస్తాం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్కు కట్టుబడి ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్. గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయింపు. ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ.16,825 కోట్లు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించాం. నూతన హైకోర్టు భవనానికి వంద ఎకరాల స్థలం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయిష్టంగా ఉంది. ప్రణాళిక, హేతుబద్దత లేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు సవాళ్లుగా మారాయి. నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతుంది. ►తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. ►మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు. ►తెలంగాణ బడ్జెట్ 2.75 లక్షల కోట్లు. నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి కేటీఆర్ దూరం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని. అనంతరం తెలంగాణ భవన్కు కేటీఆర్ ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు ►బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. ►శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ►ఈనెల 12వ తేదీన బడ్జెట్ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. ►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. ►సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం. ►కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. ►కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్కు అప్పగించిన సీఎం రేవంత్ ►కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ►బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్ స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను. కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు 9:50AM, Feb 10, 2024 బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను అమలు చేస్తాం 9:47AM, Feb 10, 2024 ముగిసిన తెలంగాణ కేబినెట్సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 3లక్షల కోట్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు ►తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం ►బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క ►బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం. ►తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ►కాసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలుపునున్న రాష్ట్ర కేబినెట్ ►తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ►మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
అసెంబ్లీలో కౌంటర్ రీ కౌంటర్
-
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: సీఎం రేవంత్
-
ఆటోలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
-
ఏపీ అప్పులపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఛాలెంజ్
-
బరితెగించిన టీడీపీ సభ్యులు..మంత్రి బుగ్గన సీరియస్
-
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
-
ఏపీ: ముగిసిన బీఏసీ సమావేశం
-
TS Assembly: సీఎం రేవంత్ Vs అక్బరుద్దీన్.. మాటల యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ నడుస్తోంది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాల్లో ఎంఐఎం పాత్ర ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ను, నిజామాబాద్ అర్బన్లో షబ్బీఆర్ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పనిచేసింది. కవ్వంపల్లి వంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదు. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే.. అన్ని విషయాలను సభ ముందు పెడితే అక్బరుద్దీన్ను అభినందిస్తాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఎంఐఎంకు కేసీఆర్ మిత్రుడు కావచ్చు. మోదీకి కూడా మద్దతు ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇష్టం. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశాం. అక్బర్ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయింది. ఫాతిమా చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీనే’ అని అన్నారు. పవర్ పంచ్.. మరోవైపు విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ సీరియస్.. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. మేం ఎవరికీ భయపడం. మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. నిజామాబాద్లో ఎంఐఎం పోటీ చేసిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడు ఎక్కడా ఎలా పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్కు ఛాలెంజ్ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా గందరగోళం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. భట్టి విక్రమార్క్ ఫైర్.. అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నేను ఏం చెబుతున్నానో వినకుండా మాట్లాకండి. కొత్తవాళ్లు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. అక్బరుద్దీన్ అఖల్ ఉందా అని మాట్లాడటం సరికాదు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
First Session of Third Telangana Legislative Assembly Day 6 Live Updates తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా బీజేపీ వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మొన్నటివరకు బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోయింది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ అంటుంది. బీజేపీకి ఎంఐఎంకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వాస్తవం లేదు. మీరు ఏమైనా చేసుకోండి బీజేపీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు. విషయం తెలుసుకుని మాట్లాడాలి: హరీష్ రావు సిద్దిపేట, గజ్వేల్లో విద్యుత్ బకాయిలు ప్రజలు కట్టకుండా ఉన్నవి కావు. అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల బకాయిలు ఉన్నవి అన్నది సీఎం తెలుసుకోవాలి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తేనే టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే. సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీలు మారాడు. జూబ్లీహిల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చింది: పొన్నం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీనే. తెలంగాణ కోసం ఆనాడు పార్లమెంట్లో ఎంపీలుగా మేము కొట్లాడం, కేసీఆర్ లేడు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి నేత. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి స్వరాష్ట్ర కల నెరవేరింది. తెలంగాణ కోసం పోరాడితే బతికుండగానే నాకు పిండ ప్రధానం చేసిన నాయకులు వాళ్లు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినా గత పదిహేళ్లుగా అధికారంలో ఉండి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఎంపీగా కేసీఆర్ను గెలిపిస్తే కరీంనగర్ ప్రజలకు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? తెలంగాణ కోసం చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా అన్న కేసీఆర్ కరీంనగర్లో ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? శ్వేత పత్రంపై స్పందించిన కేటీఆర్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఇవ్వలేమంటూ శ్వేత పత్రం విడుదల చేసిన అసమర్ధ పార్టీ. విద్యుత్ శాఖను 22వేల కోట్ల నష్టాల్లో అప్పజెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నేదునూరు శంకర్పల్లిలో ధర్నా చేసింది మేమే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు పిండం పెడతా అన్నాడు. దేశంలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఎక్కడా సక్సెస్ కాలేదు. కేంద్రం అనుమతి ఇవ్వలేదు కాబట్టే నేదునూరులో ప్రాజెక్టు టేకప్ చేయలేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది నేదునూరులో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయాలి. నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన సభలో చేయాలి. మేం ఎవరికీ భయపడం: అక్బరుద్దీన్ విద్యుత్ అప్పులపై అసెంబ్లీలో చర్చ. స్పీకర్ వెల్లోకి ఎంఐఎం సభ్యులు కిరణ్ కుమార్రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు: అక్బరుద్దీన్ కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకొన ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే. ముస్లిం అందరికీ నాయకుడు కాదు. జూబ్లీహిల్స్లో అజారుద్దీన్కు టికెట్ ఇస్తే మజస్లిస్ ఓడించే ప్రయత్నం చేసింది. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి కేసీఆర్, అక్బరుద్దీన్ కలిసి పని చేశారు. విద్యుత్ రంగంపై చర్చ విద్యుత్ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు: పాయల్ శంకర్. 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందే. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ శాసనసభలో పవర్ పంచాయితీ తెలంగాణ ప్రస్తుత విద్యుత్ రంగ పరిస్థితిపై కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం విడుదల రూ.81 వేల కోట్ల బకాయిలున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్లే ఈ పరిస్థితంటూ ఆక్షేపణ అప్పులతో ఆస్తులు పెంచామన్న మంత్రి జగదీష్రెడ్డి పక్కదారి పట్టిన విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అవినీతి చేసిందని కోమటిరెడ్డి విమర్శలు జగదీష్రెడ్డిపైనా అవినీతి ఆరోపణలు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ జగదీష్రెడ్డి సవాల్ సవాల్ స్వీకరించిన సీఎం రేవంత్రెడ్డి మూడు అంశాలపై విచారణకు ఆదేశం విచారణకు రెడీ అంటూ ధీటుగా స్పందించిన జగదీష్రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలకు కౌంటర్ ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగదీష్రెడ్డి తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సభా గౌరవం కాపాడలంటూ కోరిన మాజీ స్పీకర్ పోచారం, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంకా బీజేపీపై తప్పుడు ప్రచారమేనా? విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు నష్టాల్లోకి నెట్టాయి ధర్నాలు లేవని మాజీ మంత్రి చెప్తున్నారు.. అసలు ధర్నా చేసే ఆలోచన చేస్తేనే అరెస్ట్ చేశారు కదా! రెండు వందల యూనిట్ల కరెంటు ఎప్పటి నుంచి ఫ్రీ గా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి డిస్కం లకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిధులు సకాలంలో చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు అయినా బీఆర్ఎస్, బీజేపీపై గ్లోబెల్ ప్రచారం చేస్తోంది ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారో లెక్కలు తేల్చేందుకే మీటర్లు కానీ బిల్లు వసూలు కోసమే అని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేశారు అప్పులు చేయకుండా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యమా? సౌత్, నార్త్ గ్రిడ్ లను కలిపింది కేంద్ర ప్రభుత్వమే.. అయినా ఈ విషయాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు తెలంగాణ శాసనసభకు స్వల్ప విరామం సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు? సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంకా అసెంబ్లీలోనే సీఎం రేవంత్ మధ్యాహ్నాం ఫ్లైట్ మిస్ కావడంతో మరో విమానం కోసం ప్రయత్నించిన సీఎంవో! విద్యుత్ రంగంపై శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చతో వేడెక్కిన శాసనసభ ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్రెడ్డి సభలోనే ఉండాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి? ఆనాడు ఏమైపోయారు మీరంతా?: రాజగోపాల్రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గతంలో సభలో మంత్రిగా ఉండి ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను ఉరికించి కొడతానన్నారు ఆరోజు నన్ను ఒక మంత్రి అలా అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం శాసనసభలో నేటి పరిణామాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తిగత దూషణలకు సభలో అవకాశం లేదు సభలో ఉన్న ప్రతీ సభ్యుడు సభా మర్యాదను కాపాడాలి వ్యక్తిగత దూషణలు చేసిన అంశాలపై పరిశీలన చేస్తాం ‘ఖబడ్దార్’పై జగదీష్ రెడ్డి అభ్యంతరం బీఆర్ఎస్ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. తన జోలికి రావొద్దని, ఖబడ్దార్ అని హెచ్చరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి జగదీష్రెడ్డి సభలో ఖబర్దార్ లాంటి పదాలు వాడొచ్చా? అని స్పీకర్కు జగదీష్రెడ్డి ప్రశ్న ఖబర్దార్ అని స్పీకర్ చైర్ ను అన్నారా? మమ్మల్ని అన్నారా? అని నిలదీత నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు విమర్శలు చేయలేదు నాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యాఖ్యలను తొలగించాలి ఖబడ్దార్ అన్నందుకు ఆ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ చెప్పాలి శాసనసభలో రగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో బెదిరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు ఖబడ్దార్..: రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే నేను పార్టీలు మారిన టైంలో పదవికి రాజీనామా చేశా దొంగల లెక్క పదవుల కోసం పార్టీలు నేను మారలేదు నా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ ఏమనుకుంటున్నారో? సభామర్యాదను కాపాడండి: పోచారం రిక్వెస్ట్ సభా మర్యాదను కాపాడుకుందాం ఒకరి పైన ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు సభలోకి కొత్త సభ్యులు చాలామంది వచ్చారు మాజీ స్పీకర్గా.. సభ ఉందాగా నడపాలని కోరుకుంటున్నా వ్యక్తిగత విమర్శలు ఏమైనా ఉంటే బయట విమర్శలు చేసుకోవాలి సభకు సహకరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం జగదీష్రెడ్డికి రాజగోపాల్ చురకలు అధికారంలో పర్మినెంట్గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్తో మతిభ్రమించింది అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు పార్టీలు మారామని మా బ్రదర్స్ ని విమర్శిస్తున్న వాళ్లకు.. వాళ్ల అధినేత కేసిఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? నాలుగు రూపాయలకు దొరికే పవర్ ని.. ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసింది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోంది కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రూ. 1000 కోట్ల హైదరాబాద్ బంగ్లా ఎలా సంపాదించారు ? నేను పార్టీలు మారింది ప్రజల కోసమే.. పదవుల కోసమో, పైసల కోసమో కాదు మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడి ధైర్యం ఉందా? మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలు అయింది ఇలాగే ఉంటా.. మీలాగా కాదు: మాజీమంత్రి జగదీష్ రెడ్డి నన్ను ఎంత రెచ్చగొట్టినా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను సభలోనే కాదు బయట కూడా వ్యక్తిగత ఆరోపణలు నేను చేయను అలవాటు నాకు లేదు అవసరాల కోసం.. పదవుల కోసం నేను విమర్శలు ఆరోపణలు చేయను పార్టీలు మారే క్యారెక్టర్ నాది కాదు కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర ఆ సోదరులదిది(కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి..) విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రం తప్పులు తడకగా ఉంది కేసీఆర్ ఇచ్చినట్లే 24 గంటల కరెంటు ఇస్తారా లేదా సభ సాక్షిగా క్లారిటీ ఇవ్వాలి మీటర్లు పెట్టకుండా కరెంటు ఇస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలి మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా? అనే దానిపై సభాముఖంగా ప్రకటన చేయాలి భవిష్యత్తులో అప్పులు చేయకుండా విద్యుత్ ఇస్తారా లేదా అని కూడా చెప్పాలి రాజగోపాల్ మైక్ అందుకోవడంతో రగడ తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చ మంత్రులు మాట్లాడుతుండగా.. మైక్ అందుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు: రాజగోపాల్ రెడ్డి విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి విచారణలో అన్ని బయటకు వస్తాయి: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఎలా అవకాశం ఇస్తారంటూ స్పీకర్ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో భారీ అవినీతి జరిగింది విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన విద్యుత్ మంత్రి కాదు యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ విచారణలో అన్నీ వెలుగు చూస్తాయి ఇదంతా ఆన్ రికార్డు చెబుతున్నా మాజీ అధికారి ప్రభాకర్రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయం నేనూ సిద్ధం: మాజీ మంత్రి జగదీష్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి జగదీష్రెడ్డి అభ్యంతరం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరించలేకపోతోంది కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలపై ధర్నాలు జరిగాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు రైతుల గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదు.. వాళ్ల వైపు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లు పెట్టుబడి దారుల వైపు ఉన్నారు కేసీఆర్ రైతుల పక్షపాతి విద్యుత్ రంగంపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోండి.. అందుకు నేను సిద్ధం ఈఆర్సీ రూల్స్ ప్రకారమే Electricity Regulatory Commission విద్యుత్ను కొనుగోలు చేశాం విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయి విద్యుత్పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధం: సీఎం రేవంత్రెడ్డి ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం జగదీష్రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నాం విద్యుత్పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నాం కరెంట్ అనే సెంటిమెంట్ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని నాడు మార్షల్స్ చేత బయటకు గెంటించారు ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు రెండేళ్లలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలవలేదు బ్యాక్ డోర్ నుంచి టెండర్లు అంటగట్టారు మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తాం ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నాం రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ చేర్చాం మూడో అంశంగా యాద్రాద్రి పవర్ప్లాంట్ పైనా విచారణ జరిపిస్తాం మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశం అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తాం మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయి ప్రభుత్వం రంగంలో విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ సాధించింది గుండు సున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు? కోమటిరెడ్డి లాక్బుక్ చూపిస్తే.. బుక్లు మాయం చేశారు ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు? విద్యుత్ రంగంపై అవాస్తవ శ్వేతపత్రం విడుదల చేశారు: జగదీష్రెడ్డి బీఆర్ఎస్ పాలనలో విద్యుత్రంగంలో ఆస్తులు పెరిగాయి: జగదీష్రెడ్డి కోమటిరెడ్డి ఆరోపణలపై విచారణ జరిపించాలి :జగదీష్రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి :జగదీష్రెడ్డి జగదీష్కు భట్టి కౌంటర్ విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చలో విమర్శల పర్వం తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డిస్కంలకు బకాయిలకు భారంగా ఉన్నాయి మాజీ మంత్రి జగదీష్రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వలేదు గొంతు తెరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోవు ఆరోపణలపై మాజీ మంత్రి స్పందన.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలి విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నా జగదీష్రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇచ్చిందన్నది 9 గంల కరెంట్ కూడా ఇవ్వలేదు విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగింది టెండర్ లేకుండా పవర్ప్లాంట్ పెట్టారు యాదాద్రి పవర్ప్లాంట్లో రూ.20 వేల కోట్ల స్కామ్ జరిగింది ఇందులో జగదీష్రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నాడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్దే దొంగలు, అవినీతి పరులు అనే వరకు భుజాలు తడుముకుంటున్నారు బీఆర్ఎస్ నేతలకు టీఎస్ ట్రాన్స్కో, జెన్కో అప్పటి సీఎండీ ప్రభాకర్రావు దోచిపెట్టారు ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం.. అలా వదిలేస్తామా? విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఆరోజుల్లో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు నాడు ఊళ్లలోకి వెళ్తే విద్యుత్ అధికారుల్ని నిర్బంధించే పరిస్థితులు ఉండేవి మన రాష్ట్రంలోనే అప్పులు చేసినట్లు మాట్లాడుతున్నారు పరిశ్రమలకు విద్యుత్ హాలిడే - జనరేటర్ లేని దుకాణాలు ఆనాడు లేవు విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్లిన అధికారులను పంచాయితీ ఆఫీసు లో బంధించే వాళ్ళు ఆనాడు విద్యుత్ కష్టాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే బాధ్యులు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం మేము 50వేల కోట్ల అప్పులు తీర్చాం అప్పు కోసం ఆలోచిస్తే.. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉండేది కాదు తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం చెయ్యలేం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మనకు బతుకు తెలంగాణ వచ్చేనాటి పరిస్థితి ఏంటో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు 2014లో ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు సహకారం ఇవ్వలేదు సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు రావాల్సిన వాట ఇవ్వడానికి అడ్డుకున్నారు ఆనాడు కేంద్రం పలుకుబడి ఉపయోగించి ఆనాటి సీఎం ఇబ్బంది పెట్టారు తెలంగాణకు ఎవరైనా విద్యుత్ అమ్మడానికి వచ్చే ప్రైవేట్ వ్యక్తులను సైతం బెదిరించారు విద్యుత్ రంగంలో చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా ఆగకుండా జరిగింది బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్: మంత్రి శ్రీధర్బాబు 2014కి ముందు కరెంటే లేనట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్బాబు కరెంట్ను బీఆర్ఎస్ కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్బాబు నిన్న నీళ్ల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారు: మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ భట్టి ప్రసంగంపై మాజీ మంత్రి స్పందన తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం వైట్ పేపర్పై స్పందించిన మాజీ మంత్రి జగదీష్రెడ్డి దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: జగదీష్రెడ్డి తెచ్చిన అప్పులతో ఆస్తులు క్రియేట్ చేశాం 👉: విద్యుత్రంగంపై శ్వేతపత్రం.. పూర్తి కాపీ ప్రభుత్వానికి భారంగా విద్యుత్ బకాయిలు: డిప్యూటీ సీఎం భట్టి ఏ రంగానికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరం - డిప్యూటీ సీఎం రాష్ట్రం ఏర్పాటు నాటికి 24వందల మెగావాట్ల ఉత్పత్తి ఉండే. రాష్ట్రం ఏర్పడే నాటికే ఆనాటి పాలకుల ముందు చూపుతో మరో 2500 ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం విద్యుత్ శాఖ ఆందోళన కరంగా ఉంది రూ.81.516 కోట్లు ప్రస్తుతం అప్పులు ఉన్నాయి రూ.36వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.. మరో 28వేల కోట్లు చెల్లించాల్సి ఉంది డిస్కమ్ లకు చెల్లించాల్సిన 14వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల మరింత భారం పడింది విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత మా పై ఉంది ఆర్థిక ఇబ్బందులు శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాము విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి భారంగా ఉన్నాయి బీఆర్ఎస్ వచ్చిన తరువాతే రాష్ట్రంలో బల్బ్ వెలిగింది అన్నట్లు గత పాలకులు మాట్లాడారు బీఆర్ఎస్ వచ్చిన తరువాతే ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పాలనలో కొనసాగించాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదు 2014 వరకు జెన్కోలకు 10వేల లోపు అప్పులు ఉంటే.. BRS పదేళ్లలో 81వేలకు తీసుకెళ్లారు సరైన దూరదృష్టి లేకపోవడం వల్ల డిస్కంలు ఇబ్బందుల్లో పడ్డాయి రోజూవారీ మనుగడ కోసం డిస్కంలు అవికాని అప్పులు చేయాల్సి వస్తోంది తెలంగాణ కరెంట్ లెక్కలు తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: డిప్యూటీ సీఎం భట్టి గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది: డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో రూ. 81వేల కోట్ల అప్పు ఉంది: డిప్యూటీ సీఎం భట్టి డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.28,842 కోట్లు డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిల్ని గత ప్రభుత్వం చెల్లించలేదు సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే రూ. 14 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది గత ప్రభుత్వం చేసిన అప్పులు మరింత ఆందోళన పరిస్థితికి దిగజార్చాయి విద్యుత్ రంగంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: భట్టి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ సీఎం లేకుండానే కొనసాగనున్న సభ? రేపు కూడా సభ నిర్వహణ? శాసనసభ సమావేశాల పొడిగింపు? రేపు.. డిసెంబర్ 22వ తేదీన కూడా సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో రేవంత్రెడ్డి సర్కార్ సీఎం రేవంత్ ఇంట్లో మంత్రి ఉత్తమ్ భేటీ.. హాజరైన సీఎస్ తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం: మాజీ మంత్రి హరీష్రావు ఇందులో అప్పులు రూ.6,71,757 కోట్లు అని చూపించారు... అది రూ.5 లక్షల కోట్లే గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఇది తెలంగాణను దివాలా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా పర్యవసానాలు విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రావు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ సవాల్ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టీకరణ వాడీ వేఢీగా తెలంగాణ శాసన సభ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇరు పార్టీల నేతల విమర్శలు-ప్రతివిమర్శలతో దద్దరిల్లిన సభ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై.. 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు.. రిజర్వు బ్యాంకు, కాగ్ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలతో రూపకల్పన 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 22 టేబుళ్లతో వివరణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశమన్న సర్కారు నేడు ఆరవరోజు కొనసాగనున్న సభ హాట్హాట్గా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలతో వేడెక్కిన సభ అధికార-ప్రతిపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం నేడు ఆరో రోజు కొనసాగనున్న సభ శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఆపై లఘు చర్చ -
శ్వేతపత్రంపై వాడీవేడీ చర్చ
-
చేసిందంతా చేసి పరువు పోతుందంటున్నారు: భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీలో భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ..‘ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్తో ఏం సాధించారు. కానీ, గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది. ఓఆర్ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్ను పోగొట్టారు. రెండు ఫామ్హౌజ్లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం. గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా?’ అని అన్నారు. -
‘ఇంట్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోం.. ఏదైనా అసెంబ్లీలోనే..’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదన్నారు. ఇది ఎవరినీ నిందించే ప్రయత్నం కాదని క్లారిటీ ఇచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ప్రభుత్వం ఆశించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పదేళ్లు రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులను అవమానించేలా హరీష్రావు మాట్లాడారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే నిధులు ఖర్చు చేసిందా? లేదా అనేది కాగ్ చెబుతుంది. ఈ శ్వేతపత్రం మేం ఇచ్చిన వాగ్దానాలను ఎగవేసేందుకు కాదు. 2014-15లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజులు మిగులు నిధులు ఉండేవి. పదేళ్లలో అది 30 రోజులకు తగ్గింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లోన్లు పుట్టని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్బీఐ సమాచారం ఇస్తుంది. ఏ నిర్ణయమైనా సభలోనే.. ఇవి వాస్తవాలు.. వీటిని కప్పిపుచ్చి గొప్పలకు పోతే నష్టపోతాం. గత ప్రభుత్వ సమయంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వెళ్లినందుకు వాళ్లకు దు:ఖం ఉండవచ్చు. అర్హులైన వారికి అవకాశాలను ఇస్తుందని చెప్పేందుకే మా ప్రయత్నం. తెలంగాణ అభివృద్ధి కోసం సిద్ధాంత విబేధాలున్నప్పటికీ ప్రధానిని కలిసేందుకు కిషన్రెడ్డిని నేనే అడిగాను. మేం ఏం చేయాలనుకున్నా సభ ముందు పెడతాం. తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా చేయాలన్నదే మా లక్ష్యం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. త్వరలో అఖిలపక్ష భేటీ.. త్వరలోనే అఖిలపక్షం సమావేశం పెడతాం. గ్రేటర్ సిటీతో పాటు పలు అంశాలపై చర్చలు జరుపుతాం. సభలో ఉన్న వాళ్ళే కాదు.. లేని సీపీఎం పార్టీ వంటి నేతలను సైతం పిలుస్తాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్న డాక్యుమెంట్ రూపంలో సభలో పెడతాం. ఇంట్లో కూర్చుని నిర్ణయాలు తీసుకొము. అందరితో చర్చలు జరిపే నిర్ణయాలు ఉంటాయి’ అని స్పష్టం చేశారు. -
TS Assembly: సీఎం రేవంత్ Vs హరీశ్ రావు మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీ చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హరీష్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి, రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. గత పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు రూ.97,449 లోన్ మంజూరు అయితే విడుదల అయింది రూ.79, 287కోట్లు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్కు నిధులు వేరే వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాళేశ్వరం నీళ్ళు అమ్ముతామని రూ.5,100 కోట్ల అప్పులు చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు, ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్తోంది. మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని బ్యాంకులను మభ్యపెట్టి లోన్స్ తెచ్చారు. నీళ్ళపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారు. TSIICకి వచ్చిన లోన్ నిధులకు ప్రభుత్వమే బాధ్యత అని గ్యారెంటీ ఇచ్చారు. అప్పుల కోసం ఆదాయం తప్పుగా చుపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. తన పద్ధతి మార్చుకోవాలంటూ కాగ్ గత ప్రభుత్వానికి హెచ్చరించింది.శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ.. సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి అంటూ కామెంట్స్ చేశారు. -
Dec 20: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
First Session of Third Telangana Legislative Assembly Day 5 Live Updates తెలంగాణ అసెంబ్లీ రేపటికి(గురువారానికి) వాయిదా హరీష్ రావు కామెంట్స్.. పదవుల కంటే వ్యవస్థలు ముఖ్యం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది మేము. రేవంత్ రెడ్డి సీఎంగా కాకుండా పీసీసీ అధ్యక్షులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సభను, రాష్ట్ర ప్రజలను శ్వేత పత్రం ద్వారా కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని వైట్ పేపర్లు అయినా పెట్టినా మాకు అభ్యంతరం లేదు. సత్యహరిచంద్రుడిలా హరీష్రావు మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి రూ.1.34లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు. సత్యహరిచంద్రుడిలా హరీష్రావు మాట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించారని చెప్పి ఉంటే హరీష్ హుందాతనం పెరిగేది. గత పాలకులంటూ ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు. ఇంకా మూడువేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయాల్సి ఉంది. రూ.90వేల కోట్లు పేమెంట్స్ జరిగాయి. గత పాలకులు రాజీవ్ ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదు. దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు. హాస్టల్లో వంటచేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. పెద్దకొడుకును అన్న కేసీఆర్ ఇప్పుడు రెండు, మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. పేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు. లక్షకోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. నాలుగు నెలల తర్వాత పిలవాల్సిన టెండర్లను ఎన్నికలకు ముందే పిలిచారు. ఓడీ ఏమైనా నేరమా?: హరీష్ రావు హరీష్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్ గ్యాప్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. నికర అప్పు రూ.5,16,881కోట్లు అప్పులు చెప్పారు, ఆస్తుల విలువ చేప్పలేదు. కేంద్ర సంస్థలను కాంగ్రెస్ హయాంలో తెచ్చినట్టుగా చెప్పారు.. అది రాష్ట్రానికేం సంబంధం. మీరు భవిష్యత్తులో ఓడీ వాడమని హామీ ఇస్తారా?. ఓడీ ఏమైనా నేరమా? పెరిగిన జీఎస్డీపీ చెప్పలేదు. 47 లక్షల మంది వృద్ధులు, మహిళలకు పెన్షన్లు ఇచ్చాం. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. రూ. ఏడులక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు, అది అబద్దం. పెరిగిన పంటల ఉత్పత్తి చెప్పలేదు. కట్టిందే ఒక్క ప్రాజెక్ట్.. అది కూడా కూలిపోయింది: భట్టి విక్రమార్క గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్తో ఏం సాధించారు. గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది. ఓఆర్ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్ను పోగొట్టారు. రెండు ఫామ్హౌజ్లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం’ అని అన్నారు. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు: అక్బరుద్దీన్ ఫైర్ తెలంగాణ దీవాలా తీసిందని చెప్పడం సరికాదు రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు. కేంద్రం కూడా అప్పులు చేసింది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని ఎందుకు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటక అప్పుల లెక్కలను చెప్పిన అక్బరుద్దీన్ రాంగ్ మెసేజ్ వెళ్లకూడదనేదే నా ఉద్దేశ్యం ఆర్బీఐ, కాగ్, బడ్జెట్ లెక్కలను అవసరానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అక్బరుద్దీన్ అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్ బాబు అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్ బాబు అప్పులు ఎందుకోసం చేస్తామన్నది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితి నుంచి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐదేళ్లలో నెంబర్ వన్గా చేస్తాం. ఇది ప్రగతి నివేదిక లాంటిదే. దేశంలో తెలంగాణను నంబర్ వన్గా చేయాలన్నదే మా ఉద్దేశం మంత్రి పొన్నం వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు పార్లమెంట్లో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘనత బీజేపీది. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఉంటే రూ.500లకే గ్యాస్ ఇవ్వడంలో సహకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పాలనలో పార్లమెంట్లో రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పు చేసింది: మహేశ్వర్ రెడ్డి శ్వేతపత్రం విడుదల అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు ఇలా చట్టసభల్లో అప్పులు వివరిస్తే భవిష్యత్త్లో ఎలా అప్పులు పుడుతాయ్?. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు సివిల్ సప్లై కార్పొరేషన్పై చేసిన కామెంట్స్ వాస్తవం కాదు. సివిల్ సప్లై లో అప్పు 3వేల కోట్ల నుంచి 56వేల కోట్లకు చేరింది. గత పదేళ్లలో సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ఒక్క సబ్సీడీ కూడా ఇవ్వలేదు. రూ.3వేల కోట్ల మిత్తీ ప్రతీ ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్ కట్టాల్సి ఉంది. రూ.22వేల ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది. గత నాలుగేళ్లుగా సివిల్ సప్లై ఆడిట్ లేదు. ఆరు కిలోల్లో ఒక కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. 39 రూపాయలు కిలోకి ఖర్చు చేసింది గత ప్రభుత్వం. 75శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రాష్ట్రం దగ్గర స్టాక్ ఉన్నా కర్ణాటక, తమిళనాడుకు బియ్యం అమ్మలేదు. ప్యాడీ ప్రోకూర్మెంట్ కింద కేంద్రం నిధులు సమయానికి ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖపై ఉత్తమ్ కుమార్ సంచలన ఆరోపణలు ఇరిగేషన్ శాఖలో చాలా దుర్మంగంగా జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పకుండా విచారణ చేస్తాం తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే పాలమూరు రంగారెడ్డి 25వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో సీతారామ ప్రాజెక్టుపై 7వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో మేడిగడ్డ డ్యామేజ్ అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రపంచ చరిత్రలో ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదు డిజైన్ చేసింది ప్రభుత్వమే అని నిర్మాణ ఎల్అండ్టీ సంస్థ చెప్పింది ఎవరి ఎజెండా అని ప్రశ్నిస్తే.. ఇంకా ఎవరు అన్ని ఆయనే కదా అని ఎల్ అండ్ టీ వాళ్లు అన్నారు డిజైన్ సరిగ్గా లేదని ఆ సంస్థ చెప్తోంది పెద్ద పెద్ద మాటలు చెప్పారు.. పెద్ద ప్రాజెక్ట్.. కానీ ఫలితం లేదు మన కుటుంబాలను తాకట్టుపెట్టి అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టి ప్రయోజనం లేదు అబద్దాలతో హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. అమలు కానీ హామీలు ఇవ్వొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని కలిపి ఏడాది0కు 25వేలకు పైగా ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణలో 39లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. న్యాయపరంగా కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువగానే తెలంగాణకు ఇచ్చింది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీష్ రావు శుద్ధ అబద్ధం చెప్పారు. అబద్ధాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినట్లు హరీష్ రావు ఆధారాలు చూపించాలి. మీటర్లు పెట్టమని కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తున్నా గత ప్రభుత్వం కావాలని తప్పుడు ప్రచారం చేసింది. వచ్చే ఆదాయంలో 30శాతం మాత్రమే ప్రజలకు చేరుతోంది. 30శాతం నిధులతో అమలు కానీ హామీలు ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు. కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇచ్చారు. కాంగ్రెస్కు వంద రోజుల సమయం ఇస్తాం. హామీలు అమలు కాకపోతే ప్రజా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ కామెంట్స్ పదేళ్లలో తెలంగాణను అప్పులమయం చేశారు. గత ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం అని చెప్పారు. కానీ, అది నిజం కాదు. పేదల కోసం ఆరు గ్యారంటీలు తీసుకొచ్చాం. గ్రామాల్లో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు రెవెన్యూ వ్యవస్థ గ్రామాల్లో లేదు ఎక్కడ తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. రాష్ట్రంలో 75లక్షల కుటుంబాలు బీపీఎల్ కింద ఉన్నాయి. అన్నా రాష్ట్రాల మాదిరిగానే ఐటీ అభివృద్ధి ఇక్కడ కూడా జరిగింది. బీఆర్ఎస్ చెప్పుకోవడమే తప్ప మంచి చేసిందేమీ లేదు. అంత ఆవేశం ఎందుకు: భట్టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు లేదు. హరీష్ రావు తన పేరు తీసుకున్నారు కాబట్టే ఆయన స్పందించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. రెండు రోజులు కాలేదు అప్పుడే అవేశం ఎందుకు కడియం శ్రీహరి కామెంట్స్.. డిప్యూటీ సీఎం భట్టి స్పీకర్ చైర్ను డిక్టెట్ చేస్తున్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్ రావుకు సమయం ఇచ్చారు. శ్రీధర్ బాబు చెప్పిన దానికి లేచి హరీష్ రావుకు మైక్ ఇవ్వొద్దు అంటే అర్థం ఏంటి? హరీష్రావుపై ఫైర్ అసెంబ్లీలో హరీష్ రావుపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు ఆగ్రహం కొత్త సభ్యులు మాట్లాడుతుంటే అడ్డుకోవడం హరీష్ రావుకు కరెక్ట్ కాదు. పది నిమిషాలు ఓపిక పట్టలేని వాళ్లు పదేళ్లు ఎలా రూల్ చేశారు. హరీష్ రావు కామెంట్స్.. నేను ఇవ్వాళ సభలో రాజగోపాల్ రెడ్డి పేరును తీసుకోలేదు. నా పేరు తీసుకోని నా మీద కామెంట్స్ చేశారు. నేనేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీపీ పదవి తీసుకోలేదు. హరీష్ రావు కామెంట్స్పై శ్రీధర్ బాబు సీరియస్. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. హరీష్ రావు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. హరీష్ రావు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సభ నుంచి బహిష్కరిస్తాము. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేను వెనక్కి తీసుకుంటా-హరీష్ రావు నేను కొత్తగా చేసిన కామెంట్స్ కాదు కోమటి రెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలే ఇవి -హరీష్ రావు రాజగోపాల్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకుంటే నేను తీసుకుంటా. మా నాయకుడిపై కామెంట్స్ చేస్తే మేము సమాధానం చెప్పకూడదా? హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరెందుకు కలుగజేసుకుంటారు. పదేళ్లు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలి. మేము మా సీఎం నాయకత్వంలో పనిచేస్తాం. స్పీకర్ సీరియస్ హరీష్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కామెంట్స్ హరీష్ రావు సీనియర్ సభ్యులు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను పోడియం ముందుకు పంపడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునవృతం కాకూడదు. సభలో గందరగోళం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల ఆందోళన హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు నిరసన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్బాబు ఆగ్రహం కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు అయింది శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో BRS ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం. స్పీకర్ పోడియం ముందుకు వచ్చి స్పీకర్ చైర్ను బెదిరించడం సరికాదు BRS ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ను అవమానిస్తున్నారు. కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల పద్ధతి కాదు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్.. హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా సమయం సరిపోలేదు అంటున్నారు. అబద్ధాలను నిజం అని చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ పోలికలు వచ్చాయి. హరీష్ రావు ఎన్ని ఎండ్లు కష్టపడ్డా కేసీఆర్ తరువాత, కేటీఆర్ సీఎం అవుతాడు కానీ హరీష్ రావు కాలేడు. తండ్రి కొడుకులు వాడుకోవాల్సినంత వాడుకొని వదిలేస్తారు. నాకు మంత్రి పదవి రాదు అని హరీష్ రావు అన్నారు. నా మంత్రి పదవిపై నిర్ణయం మా సీఎం, అధిష్టానం తీసుకుంటుంది. అసెంబ్లీలో హరీష్ రావు కామెంట్స్.. సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్ శ్వేతపత్రం పేజీ నెంబర్ 21 చూసుకోవాలి కాళేశ్వరం కోసమే 80 వేల కోట్ల రుణం తీసుకున్నారు ఇవి కాకుండా ఖర్చు ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టింది కాళేశ్వరం అద్భుతం అని హరీశ్రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారు హరీశ్రావు చెప్పేవన్నీ అబద్ధాలు కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారు ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారు మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారు ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ : హరీశ్రావు మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం మా లీడర్ కేసీఆర్ తన కోసం ఏదీ కట్టుకోలేదు అన్నీ ప్రజల కోసమే కట్టారు ప్రగతిభవన్పై హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు ప్రగతిభవన్లో ఏముందో భట్టి విక్రమార్క ఇప్పుడు చెప్పాలి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గదులున్నాయి ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ హరీశ్రావు ప్రసంగంపై మంత్రుల మండిపాటు హరీశ్రావు శ్వేతపత్రం మాట్లాడుతుండగా మంత్రులు ఉత్తమ్కుమార్, పొన్నం, జూపల్లి అభ్యంతరం హరీశ్రావు కేంద్రంపై మళ్లీ అవే అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఉత్తమ్ తమకూ బడ్జెట్పై అవగాహన ఉందన్న పొన్నం హరీశ్రావు కార్పొరేషన్ రుణాలపై అబద్ధాలు చెప్పారన్న జూపల్లి అన్నీ కూలగొట్టి మళ్లీ కట్టి నిధులన్నీ వృథా చేశారని ఆరోపించిన కొండా సురేఖ సెక్రటేరియల్ కూల్చి మళ్లీ ఎందుకు కట్టారని ప్రశ్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం కట్టలేదని విమర్శించిన సురేఖ శ్వేతపత్రంపై హరీశ్రావు ఫైర్ ముఖ్యమంత్రి గారి పాత గురువు శిష్యులు శ్వేతపత్రం వండి వార్చారు తయారు చేసిన వాళ్లలో ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు శ్వేతపత్రంలోని వివరాలు శుద్ధతప్పు అప్పులను రెవెన్యూతో పోల్చారు అప్పులను జీఎస్డీపీతో పోల్చలేదు కరోనా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదు ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది అవాస్తవం కరోనా వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసింది కరోనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పడింది అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు కేంద్రంతో మా ఎంపీలు పోరాడారు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పుడూ అడగలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది పన్నుల్లో వాటా సెస్ల రూపంలో ఎగ్గొట్టారు ఏపీ విద్యుత్ బకాయిలు కేంద్రం వల్లే రాలేదు సీఎస్ఎస్లో కేంద్రం వల్లే నష్టపోయాం లక్షకోట్ల కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగింది ఇవి వస్తే ఇంకో లక్ష కోట్ల అప్పు తగ్గేది సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్ల అప్పులు తేల్చారు అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనేది పూర్తి అబద్ధం కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి లేదంటే పెట్టుబుడు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావు అధికారంలోకి వచ్చి కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు టీ బ్రేక్ తర్వాత ప్రారంభమైన అసెంబ్లీ ఆర్థిక స్థితిపై రిలీజ్ చేసిన వైట్పేపర్ మీద చర్చ అసెంబ్లీ అరగంట పాటు వాయిదా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి స్వల్పకాలిక చర్చ ప్రారంభించిన డిప్యూటీ సీఎం అరగంట ముందు 42 పేజీల బుక్ ఇచ్చి మాట్లాడమంటే ఎలా అన్న హరీశ్రావు, అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో కూడా ఈ సంప్రదాయం ఉందన్న లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిశ్రీధర్బాబు దీంతో అరగంట పాటు సభను వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చిన స్పీకర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కనీసం రోజువారి ఖర్చులు కూడా లేని పరిస్థితి తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, కళలు నెరవేర్చాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నాం నేను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నాను 👉: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్ చేయండి తెలంగాణ శాసనసభ సమావేశం ప్రారంభం CPI ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశవరావు పేరును ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ MIM ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ పేరు ప్రకటన శాసనసభలో బీఆర్ఎస్ సమావేశం శాసనసభలో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీఆర్ఎస్ పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని చెప్తున్న గులాబీ పార్టీ 51 పేజీల ఆస్తుల వివరాలను విడుదల 33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు. ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం 2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు 8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు 1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు 7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్, 23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్ 70 గదుల నిర్మాణం 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం 1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్ 22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 334 చిన్న పరిశ్రమల పురుద్దరణ 10,40p ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్ 81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం Hmda పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లకులు 19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం 109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం 1,00,691 కిమి రహదారి వనాలు 10,886 కిమీ కందకల తవ్వకం 19వేళ పల్లెల్లో పార్కులు 2700 ట్రీ పార్కులు 1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం 2800 కోట్ల ఆలయాల అభివృద్ధి 100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు 75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం 212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం ఆరోగ్య శాఖ లో 34000 హాస్పిటల్ బెడ్స్ 34000 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐ సీ యు కేంద్రాలు 56బ్లడ్ బ్యాంక్ లు 82 డయాలసిస్ కేంద్రాలు 500 బస్తీ దవాఖానాలు 1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్ 1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ 3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు 585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు 10.13 లక్షల సీసీ కెమెరాలు 20,115 పోలీసు వాహనాలు 9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం విద్యుత్ రంగం 2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు 15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం 57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు 2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు 2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు 2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు 59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు దళిత బంధు పథకం అమలు 5000 కోట్లతో గొర్రెల పంపిణీ 72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల 5402 కోట్ల రైతు బీమా 572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు 1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం 8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ 617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం 146.50కోట్ల తో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం 178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి 2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు 2014 లో 2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు 2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో 3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం 159.6 పెరిగిన తలసరి ఆధాయం పెరిగిన రూపాయి అప్పులు 1000 రూపాయల ఆస్తి పెంచాం ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బీఆర్ఎస్ సభలో వార్ తప్పదా? బీఆర్ఎస్ ముందుగానే.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల ప్రభుత్వ శ్వేత పత్రం కంటే ముందే విడుదల చేసిన ప్రతిపక్ష పార్టీ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీఆర్ఎస్ శాఖల వారీగా అభివృద్ధి, ఆస్తులు, ఆదాయం ప్రకటించిన బీఆర్ఎస్ 2014 నుంచి 2023 బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై శాఖల వారీగా లెక్కలు అప్పులా? ఆస్తులా? తెలంగాణ ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లేదంటున్న అసెంబ్లీ వర్గాలు కాంగ్రెస్ ప్రజంటేషన్ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్ సభలో నివేదిక ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్కు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఇవ్వనున్న హరీష్రావు? సభలో సమరానికి ముందే పార్టీల ఫైటింగ్ అప్పులే మిగిలాయని కాంగ్రెస్.. ఆస్తులు సృష్టించామంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ పొలిటికల్ రచ్చ తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక ఘట్టం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ సర్కార్ శ్వేత పత్రం అప్పులు, నీటి పారుదల, విద్యుత్ పరిస్థితులపై వివరణ 2014 నుంచి ఆదాయ-వ్యయాలు అప్పుల ప్రస్తావన పాయింట్ టు పాయింట్.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న సర్కార్ సీఎం రేవంత్తో పాటు భట్టి, ఉత్తమ్ ప్రసంగించే ఛాన్స్ ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అయిన బీఆర్ఎస్ వాడీవేడిగా చర్చ నడిచే అవకాశం హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం రేవంత్ ఖర్గే కొడుక్కి కేటీఆర్ కౌంటర్ శాసనసభ సమావేశం కంటే ముందే పొలిటికల్ హీట్ నిన్నటి నుంచి కర్ణాటక నేతలతో కేటీఆర్ ట్విటర్ వార్ సీఎం సిద్ధరామయ్యతో నిన్నంతా జరిగిన విమర్శలు-ప్రతివిమర్శల పర్వం ఇవాళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశించి ట్విట్టర్ లో కేటీఆర్ హాయ్ ప్రియాంక్ జీ మీరు కూడా ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. 2 లక్షల మంది కర్ణాటక యువతకు ఉపాధి గురించి మీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనలు , ఖజానా ఖాళీ పై డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలు కూడా నకిలీవా? మేము కాంగ్రెస్ పార్టీని కాదు, వారి ముగ్గురు ఎంపీలతో సహా తెలంగాణలోని బిజెపి పెద్దలందరినీ ఓడించాము. సునీల్,టీమ్ ప్రచారానికి మీరు దూరంగా ఉండటానికి జాగ్రత్తగా,సిద్ధంగా ఉండటం మంచిది నేడు, రేపు శాసనసభ సమావేశాలు నేడు, రేపు శాసన సభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ రేపు విద్యుత్ రంగంపై చర్చ పవర్ పాయింట్ ప్రజంటేషన్కు రెడీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్కు సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ గత సమావేశంలో విమర్శలు-ప్రతివిమర్శలతో హీటెక్కిన సభ ఇవాళ మళ్లీ అదీ రిపీట్ అయ్యే ఛాన్స్! ట్విటర్ వేదికగా తెలంగాణ సర్కార్కు కేటీఆర్ చురకలు గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?.. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..? తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..! దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం ఆడిట్ రిపోర్ట్ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా..! ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచాం..! మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..! కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..! మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తారా...? అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..! చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..! అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..! అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా..? వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు..! మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..! ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..? కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం.. హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!! జై తెలంగాణ స్పీకర్కు మాజీ మంత్రి హరీష్ లేఖ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు లేఖ శాసన సభ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్కు అనుమతి ఇవ్వాలని కోరిన హరీష్ ఆర్థిక, సాగునీటి , విద్యుత్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనా వినిపించేందుకు అనుమతించాలని కోరిన హరీష్ తాము కూడా ఎక్కడెక్కడ ఖర్చు చేశామనేది కూడా చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్న మాజీ మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభలో నేడు.. శాసన సభ సమావేశాల్లో నేటి కార్యక్రమాలు దివంగత మాజీ శాసన సభ్యులు రామన్న గారి శ్రీనివాస్ రెడ్డి ,కొప్పుల హరీశ్వర్ రెడ్డి ,కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై లఘు చర్చ చేపట్టనున్న సభ్యులు తెలంగాణ ఆర్దిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు తెలంగాణ శాసన సభ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభకు ఇది తొలి సెషన్ ఇప్పటికే నాలుగురోజులపాటు సమావేశాల నిర్వహణ.. నేడు ఐదవ రోజు నేడు, రేపు సమావేశాలు నిర్వహణ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ మరోవైపు నిరవధికంగా వాయిదా పడ్డ శాసన మండలి -
Live: 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్కు కేబినెట్ ఆమోదం
Live Updates.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా రేపు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ముగిసిన కేబినెట్ సమావేశం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం గవర్నర్ స్పీచ్కు కేబినెట్ ఆమోదం రేపు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్.. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని సమస్యలు గడ్డం ప్రసాద్కు తెలుసు. స్పీకర్గా ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం సహాకరించిన ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు గడ్డం ప్రసాద్ సభను ఉన్నతంగా నడుపంతారనే నమ్మకం ఉంది సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. శాసనసభ దేవాలయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో అందరు భాగస్వాములు కావాలి ప్రజలు కేంద్రీకృతంగా ప్రజా సమస్యలపై శాసనసభ పని చేయాలి. గత స్పీకర్లు శాసనసభ పాటించిన విలువలు కాపాడుతూ మీరు మరింత వన్నె తేవాలి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక్క ఎమ్మెల్యే ఉండటం విచారకరం. ప్రజా సమస్యల పరిష్కారానికి మాకు కూడా సమయం కేటాయించాలి. మీ కనుసైగల ద్వారానే ఆవేశాలు తగ్గుతాయని, సమస్యల పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారు. స్పీకర్గా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలాగే సభ హక్కులను కాపాడాలని కోరుతున్నా. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలి. గతంలో చేనేత మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కి అభినందనలు శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తాడని స్పీకర్పై పూర్తి నమ్మకం ఉంది విపక్షాలు స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు స్పీకర్ నిర్ణయాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మా తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఎంతో ఔన్నత్యం తీసుకొచ్చాడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్ ఎన్నిక స్పీకర్ పదవికి వన్నె తెచ్చింది. గడ్డం ప్రసాద్ చేనేత మంత్రిగా చేనేతల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజా సమస్యలపై, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నాను. స్పీకర్ ఎన్నికకు సంబంధించి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక విషయంలో సానుకూలంగా సహకరించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ది, నాది సొంత జిల్లా వికారాబాద్. సభలో చర్చ జరిగి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. గడ్డం ప్రసాద్ అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ సేవలందించారు. వికారాబాద్కు ఎంతో విశిష్టత ఉంది. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు. కింది స్థాయి నుండి స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎదిగారు. వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్ది చెరగని ముద్ర. ►తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ►గడ్డం ప్రసాద్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ►స్పీకర్గా ప్రసాద్ను అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ►స్పీకర్గా ఎన్నికైన అనంతరం.. గడ్డం ప్రసాద్కు సభలో సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ►అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్. ►బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్, పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ ప్రమాణం ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. ►తెలంగాణ సచివాలయానికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వచ్చారు. మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆమె అక్కడే ఉన్నారు. ►తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారు. ►కాగా, అసెంబ్లీలో స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్ను సీఎం, మంత్రులు అధికార ప్రతిపక్ష సభ్యులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం స్పీకర్కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం.. స్పీకర్ గుణగణాలు.. ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావిస్తారు. మరోవైపు.. 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మద్దతు తెలిపారు. ►వీరిలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ మిత్రపక్షం మద్దతు ఉండగా.. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు. ఇక, స్పీకర్ ఎన్నికకు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ►అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ►ఇదిలా ఉండగా.. ఈరోజు మంచి రోజు కావడంతో ఛార్జ్ తీసుకోనున్న పలువురు మంత్రులు. ►ఉదయం ఏడున్నరకు మంత్రి శ్రీధర్ బాబు, ఎనిమిదిన్నరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకోనున్నారు. ►ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాద్యతలు తీసుకోనున్నారు. ►నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. ►ఉదయం 11.30 గంటలకి అసెంబ్లీలో కేబినెట్ భేటీ. ►గవర్నర్ ప్రసంగంపై కేబినెట్లో చర్చించనున్న మంత్రులు -
నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..తొలిసారి సభలోకి 51 మంది ఎమ్మెల్యేలు
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
టీడీపీకి కొత్త భయం.. అందుకే ఈ రచ్చ
చంద్రబాబు నాయుడి అరెస్ట్ గురించి నానా యాగీ చేయాలి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడానికి కారణమైన 371 కోట్ల రూపాయల లూటీ గురించి ఎవరికీ తెలియకూడదు. ఇదీ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆలోచన. దీన్నే అసెంబ్లీలోనూ వారు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ. ప్రభుత్వం చర్చకు సిద్ధమనగానే కంగారు పడ్డారు. చర్చ జరగకుండా నినాదాలతో.. బల్లలు బాదుతూ వికృత చేష్ఠలు చేస్తూ కాలక్షేపం చేశారు. ఒక వేళ చర్చకు సిద్ధమై ఉంటే చంద్రబాబు నాయుడి దోపిడీ మొత్తం కోట్లాది మందికి మరింత స్పష్టంగా అర్ధమవుతుందనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏదైనా చర్చ జరగాలని కోరినపుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వం ముందుకు రాదు. చర్చ జరిగి తీరాల్సిందేనని విపక్షాలు అప్పుడు అసెంబ్లీలో నిరసనలు వ్యక్తం చేసి హడావిడి చేస్తాయి. కానీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల ఆరంభం రోజునే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తమ నాయకుడు చంద్రబాబు నాయుణ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసిన వైనంపై చర్చ జరగాలని వాయిదా తీర్మానంలో కోరారు. ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు ఒప్పుకోదని టీడీపీ నేతలు అనుకున్నారు. ప్రభుత్వం చర్చకు వీలు లేదంటే ఆ వెంటనే అసెంబ్లీలో హంగామా చేసేయాలని అనుకున్నారు. అయితే.. టీడీపీ నేతలకు షాకిచ్చింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడి అరెస్ట్ మీద.. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు లూటీ చేసిన తీరుపైనా చర్చించడానికి తాము సిద్దమేనని స్పష్టం చేసింది. అంతే కాదు టీడీపీ సభ్యులు ఈ అంశంపై ఎంత సేపు కావాలంటే అంత సేపు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్ ను కోరారు శాసన సభావ్యవహారాల మంత్రి. అవసరమైతే.. టీడీపీ సభ్యులు తమ వాదన వినిపించుకోవచ్చునని అన్నారు. ఆ తర్వాత వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని కూడా అన్నారు. ఈ పరిణామాన్ని ఊహించని టీడీపీ సభ్యుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. చంద్రబాబు అరెస్ట్ పైనా.. స్కిల్ కుంభకోణంపైనా నిజంగానే చర్చ జరిగితే తాము తలెత్తుకునే పరిస్థితి ఉండదని భావించినట్లున్నారు. చంద్రబాబు నాయుణ్ని రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసిన సంగతి టీడీపీ నేతలకు కూడా తెలుసు. కాబట్టే.. దాన్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం వివరంగా ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించారు. తద్వారా టీడీపీ ప్రతిష్ఠ మరింతగా దిగజారుతుందని భయపడ్డారు. అందుకే చర్చ మొదలుకానీయకుండా కావాలనే బాబు అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గడిపారు. నందమూరి బాలయ్య అయితే కొన్ని వికృత చేష్ఠలు.. మరి కొన్ని రౌడీ వేషాలతో తమ సభ్యులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పు చేశారని ప్రజలకు మరోసారి టీడీపీ సభ్యులే చాటి చెప్పినట్లయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు ఇదీ చదవండి: బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య అలా.. -
ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
పక్కా ప్లాన్తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ. ఆయన చెబుతున్నవి వింటుంటే చరిత్రలోకి మనం వెళ్లిపోతున్నాం అనిపిస్తుంది. తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు తనదైన భాషలో చెబుతూ , దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేక మంది కాంగ్రెస్ వారిని ఆయన ఏకిపారేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా విమర్శలు చేసినా, ఈసారి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అది దర్పణం పడుతుందనిపిస్తుంది. మరో మూడు , నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. శాసనసభ సమావేశాలలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం ఎప్పుడూ జరిగేదే కాని, ఈసారి చేసిన ప్రసంగానికి నేపధ్యం వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పనవసరం లేదు. ఈ టరమ్ కు అసెంబ్లీలో ఇదే చివరి స్పీచ్ కావచ్చు. అందుకే ఆయన కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శలతో ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రెండు ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం, ఒక ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సిరావడం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుందని చాలామంది భావించారు. కాని కర్నాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆశించిన రీతిలో క్యాడర్ ను తయారు చేసుకోలేకపోవడం, పార్టీలో చోటు చేసుకున్న విబేధాలు తదితర కారణాలతో బిజెపి వెనుకబడిపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే టైమ్ లో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు జోష్ పెరిగింది. అంతవరకు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని గమనించిన కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతి పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి పురోగతి సాధించింది వివరించడంతో పాటు అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని ఆయన సూత్రీకరించారు. ఇందుకోసం 1956లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పాటుకు ముందునుంచి జరిగిన ఆయా రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో తెలియచేశారు. చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసినవారిలో కెసిఆర్ ఒకరు. తెలంగాణను తెచ్చిందెవరు అన్నది పక్కనబెడితే, తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, దానికి నెహ్రూ నిర్ణయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. అంటే తెలంగాణ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో రాష్ట్రం ఉండేది. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశం దేశవ్యాప్తంగా బలీయంగా వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలోకాని, తెలంగాణలో కాని తెలుగువారంతా ఒకటికావాలన్న ఆకాంక్ష ఉండేది. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన మాట నిజం. జవహర్ లాల్ నెహ్రూ ఆశ్చర్యంగా ఒకసారి తెలంగాణకు అనుకూలంగా, మరోసారి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగాలు చేశారు. హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఓకే చేశారు. ఆంధ్ర శాసనసభతో పాటు, తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాల ఆధారంగా ఉమ్మడి ఎపి ఏర్పడింది. తదుపరి ఎన్నో పరిణామాలు, 1969 లో ఉద్యమం రావడం, కాని 1972 నాటికి అది పూర్తిగా తగ్గిపోవడం, టిపిఎస్ పక్షాన గెలిచిన ఎంపీలంతా కాంగ్రెస్లో కలిసిపోవడం వంటివి జరిగాయి. అయినా కొందరిలో తెలంగాణ ఆకాంక్ష పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారు దానిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. కాందరు నేతలు ఆ నినాదాన్ని తమ పదవీ రాజకీయాలకు వాడుకున్నది కూడా వాస్తవం. కెసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీలో తెలంగాణ డిమాండ్ చేయలేదు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మంత్రి పదవి ఇచ్చి , 1999 ఎన్నికలలో తిరిగి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఉప సభాపతి పదవి ఇచ్చి అవమానించారన్న భావన ఆయనలో ఏర్పడి, తెలంగాణ మేధావులతో, ప్రత్యేక రాష్ట్ర వాదులతో ఆయన సమావేశాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ నినాదాన్ని వదులుకోని మాట నిజం. అప్పడప్పుడు ఆశ, నిరాశలు ఎదురైనా , అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలంగాణ తెచ్చిన సారధిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి కూడా అయి తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఉంది. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించి ఆమె తెలంగాణను వ్యతిరేకించారని చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. కాని అదే సమయంలో ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి మాట్లాడకపోవడం వ్యూహాత్మకం అనుకోవాలి. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ఇదే శాసనసభలో సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పాలన, చంద్రబాబు టైమ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం తదితర అంశాలను ఆయన చెబుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనించవలసిన అంశమే. వైఎస్ అభిమానులను ఆయన దూరం చేసుకోదలచుకోలేదని అర్ధం అవుతుంది. వైఎస్ కుమారుడు జగన్ ను కాంగ్రెస్ వేదించిన సన్నివేశాన్ని వివరించి, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణలో అయినా పార్టీని నిలబెట్టుకోవాలని మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ది లేదని కెసిఆర్ వాదించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అంటే పొక్లెయినర్తో గోకుడు, అవుతలపడుడు. ఇక కాంగ్రెసోళ్లు కాల్వంటూ గెల్కుడు, ఇడ్సిపెట్టుడు అంటూ నాటి నీటిపారుదల ప్రాజెక్టులపై ఎద్దేవ చేశారు. అయితే ఎనభై వేల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తన ప్రసంగంలో అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షల రూపాయలుగా ఉన్న విషయం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రానికి హైదరాబాద్ వంటి నగరం లేదన్న సంగతి మర్చిపోకూడదు. తన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించి మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలిచేది తామేనని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోను, పార్టీ క్యాడర్ లోను ఒక ధీమా కల్పించే యత్నం చేశారు. ఇంతవరకు ఆయన సఫలీకతృతమైనట్లే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తాత కేసీఆర్ స్పీచ్ను దగ్గరనుంచి చూసిన హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు. కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. -
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఎన్నికల ప్రచారం కోసమే అసెంబ్లీ సమావేశాలు: సీతక్క
-
శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు
-
ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం!...ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్
-
పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం: సీఎం జగన్
Updates: 03:45PM అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు పూర్తి చేస్తాం గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా స్పిల్ వే ద్వారా వరదను నియంత్రిచగలిగాం పోలవరం పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి స్పిల్ వే పూర్తి చేసి 48 గేట్లు ఏర్పాటు చేశాం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేశాం ఎల్లో మీడియా తప్పుడు కథనాలు నమ్మొద్దు 45. 7 మీటర్ల ఎత్తు వరకూ డ్యాం నిర్మాణం జరుగుతుంది సీడబ్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలోనే 41.15 మీ వరకూ కడతాం పోలవరం ప్రాజెక్ట్ కోసమే ప్రధానిని కలిశా తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం పోలవరం ప్రారంభించింది మా నాన్నే.. పూర్తి చేసేది ఆయన కుమారుడే 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైనా రాలేదు టీడీపీ హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు వెళ్లలేదు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదు పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను గోబెల్స్ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు పోలవరంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ ఎల్లో మీడియా అభూత కల్పనలతో వార్తలు రాసింది పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? టీడీపీ ద్యాస అంతా డబ్బు స్వాహాపైనే పెట్టింది టీడీపీ హయాంలో పోలవరం నిధులు యధేచ్చగా దోచేశారు పోలవరం కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారు చంద్రబాబుకు పోలవరం ఏటీఏం అని ప్రధానే అన్నారు టీడీపీ హయాంలో ఎక్కువ డబ్బు వచ్చే పనులు ముందు చేశారు తక్కువ డబ్బు వచ్చే పనులు తర్వాత చేపట్టారు ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ విధానం టీడీపీ హయాంలో స్పిల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు స్పిల్ వే పనులు అసంపూర్ణంగా వదిలేశారు అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదు స్పిల్ వే పూర్తి కాకండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతింది బుద్ధి ఉన్న వారెవరైనా ఇలా చేస్తారా తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేసింది ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది మంత్రి అంబటి రాంబాబు ప్రసంగం ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు జాతీయ ప్రాజెక్టు అయినా మేము కడతా అని చంద్రబాబు అన్నారు 2013-14 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే అన్నారు విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు పోలవరానికి అయ్యే ప్రతిపైసాను కేంద్రమే భరిస్తుంది అన్నారు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు తామే కడతామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది పోలవరం పూర్తి చేసేది మేమే ►ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు(గురువారం) పోలవరం ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. దీపిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేసిందని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయము జయము చంద్రన్న పాటను ధనలక్ష్మీ ప్రస్తావించారు. ఆ పాటకు ఆస్కార్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ధనలక్ష్మీ. శాసనమండలి: సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలనేదే ప్రభుత్వ పాలసీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వెల్ఫేర్ వద్దు అని ప్రతిపక్షాలు చెప్పగలవా? గ్రోత్లో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఉంది. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చాం. 13 వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ క్లినిక్లు ఏర్పాటు చేశాం’’ అని మంత్రి అన్నారు. ►మన ప్రభుత్వ విధానాలపై పొరుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ►విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఆర్మీకేలు ఉన్నాయని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నాం: మంత్రి కాకాణి ►రైతులకు అండగా నిలిచేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. పంటనష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పరిహారం అందజేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ధికి పునాది వేస్తున్నారు: కిలారి రోశయ్య ►సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రైతులకు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు ఆ ఘనత సీఎం జగన్దే: మంత్రి మేరుగ నాగార్జున ►పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్న ఘనత సీఎం జగన్దేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న మనస్సున సీఎం వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. ►భావితరాల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. -
వైఎస్ఆర్ హయాంలో రైతులకు స్వర్ణయుగం ప్రారంభమైంది : ఎలీజా
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మూడోరోజు హైలైట్స్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మూడవరోజు అప్డేట్స్ 4:13 PM ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి(మంగళవారం) వాయిదా పడ్డాయి. 4:01 PM ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అందజేశారు. 3:44 PM అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని, విద్యా రంగంలో సంస్కరణలతో పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగంలో నాడు-నేడుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 2:25PM అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ గడిచిన మూడేళ్లో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి. బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్డ్రగ్స్ పార్క్ సాధించాం. బల్క్డ్రగ్ పార్క్ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. గతంలో దివీస్ ఫార్మా వచ్చినపుడు చంద్రబాబుకు పొల్యూషన్ గుర్తురాలేదా?. 2:18PM సభను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు: సీఎం 2:15PM అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రగడ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నం సభను అడ్డుకోవడం సరికాదు: స్పీకర్ తమ్మినేని సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు: స్పీకర్ 2:00PM ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రగడ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ 12:31PM డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. నాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు: కోలగట్ల 12:28PM కోలగట్ల రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్గా కూర్చోబెట్టడం సంతోషంగా ఉంది. పదవుల ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం: సీఎం జగన్ 12:10PM నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి కోలగట్ల వీరభద్రస్వామి: పుష్ప శ్రీవాణి డిప్యూటీ స్నీకర్గా ఎన్నికైన కోలగట్లకు అభినందనలు: మంత్రి ధర్మాన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తరాంధ్రకు చెందిన వారే: మంత్రి ధర్మాన 12:00PM ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి కోలగట్లకు సీఎం జగన్, సభ్యుల అభినందనలు సభాస్థానం వద్దకు తోడ్కొనివెళ్లిన సీఎం జగన్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన స్పీకర్ తమ్మినేని, సీఎం జగన్ 11: 28AM శాసన మండలిలోనూ టీడీపీ సభ్యుల రగడ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నం పెద్దల సభకు టీడీపీ సభ్యులు గౌరవమివ్వాలన్న మంత్రి అంబటి 9:59AM పోలవరంపై చెప్పిన దానికి జీవో కూడా ఇచ్చాం. ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే, అధికారంలోకి వచ్చాక రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పాం. దీనిపై జీవో కూడా జారీ చేశాం.. పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 14,110 మంది నిర్వాసితులుకు రూ. 19, 060 కోట్లతో పునరావాసం. మేం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే. మొదట స్పిల్వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉంది. చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అన్ఫిట్ : సీఎం జగన్ 9:43AM పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేశాం. టీడీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారు: అంబటి రాంబాబు 9:10AM ►రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరం.రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం కల్పించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు. పంట నష్టం జరిగితే రైతులకు ఆ సీజన్లోనే పరిహారం. ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది: కిలారి రోశయ్య ►రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అద్భుతం. విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకూ రైతులకు అండగా ఉంటుంది. రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి: గొల్ల బాబూరావు 09:05AM ►ఏపీ అసెంబ్లీలో మూడవ రోజు సమావేశాలు ప్రారంభం.. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది. అంతేకాదు.. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చతో పాటు సభలో నేడు 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. -
మోసం చేసిన ఘనత చంద్రబాబుదే: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని నిలదీశారు ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ప్రజా సమస్యలపై టీడీపీకి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై టీడీపీ చర్చించడం లేదు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. వాళ్లకు రాజకీయాలే ముఖ్యం.. ప్రజలు కాదనే విషయం స్పష్టమవుతోందని ఆమె అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ పెద్ద మోసం చేసిందని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. సభ ప్రారంభమైన మరు నిమిషం నుంచే టీడీపీ సభ్యులు సభ కార్యకలాపాలను అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’ -
తెలంగాణ అసెంబ్లీ: సెషన్ మొత్తం ఈటల సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య జరుగుతున్న వాడీవేడి వాగ్వాదాలు.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా మూడో రోజు సమావేశాల్లో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఆ సమయంలో ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే స్పీకర్ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ఇదిలా ఉంటే.. ‘స్పీకర్పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్భాస్కర్ కోరారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్రెడ్డి -
కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి ముమ్మాటికీ కక్ష సాధింపే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఈ తంతు అర్ధమవుతుందన్నారు. సోమవారం శాసనమండలిలో ‘కేంద్ర విత్యుత్ బిల్లు–పర్యవసానాలు’పై జరిగిన లఘు చర్చలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేపట్టిన సంక్షేమ పథకాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్ ప్రజలు సైతం కితాబిస్తున్నారని జగదీశ్రెడ్డి తెలిపారు. కేసీఆర్కు ఉత్తర భారత ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓర్వలేక రాష్ట్రంపై విషం కక్కే చర్యలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండా స్వదేశీ బొగ్గును కాదని, విదేశీ బొగ్గు వినియోగించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ బొగ్గు మెట్రిక్ టన్ను రూ.3,800కు దొరుకుతుంటే, విదేశీ బొగ్గును రూ.35 వేలు వెచ్చించి కొనుగోలు చేయాలనడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్ నిర్వహణలో ఉత్పత్తి, విక్రయ కంపెనీలను కాకుండా కేంద్రం, రాష్ట్రం, ఆర్బీఐని భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేయడం కూడా అర్థరహితమని అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అన్ని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండాగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇదీ చదవండి: 20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్! -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
-
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని, దాన్ని కాపాడుకోవాలని పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. సమాచారా న్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే.. బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. చదవండి: కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని ప్లాన్! -
కాంగ్రెస్లో కలవరం.. బీజేపీతో టచ్లో కీలక నేతలు!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్తో పొత్తులో భాగంగా మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో, శివసేనకు ఊహించని షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. గోవా కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీలో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, శనివారం జరిగిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో వారు అధికార బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఒక్కసారిగా గోవా పాలిటిక్స్ హీటెక్కాయి. మరోవైపు.. గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ కాంగ్రెస్.. హస్తం నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరు అవడం హస్తం నేతలకు కలవరపాటుకు గురిచేసింది. అయితే, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు. వారిలో కాగా, మైఖేల్ లోబోను కాంగ్రెస్ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. దీంతో, వీరు కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నరనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక, గోవా అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఈ వదంతులను ఖండించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. కాగా, 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 25 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలున్నారు. Goa Congress MLAs to Jump Ship to BJP? Possible, Say Sources as Party Says No https://t.co/UIh99Ndork — Jolly Mampilly (@jollymampilly) July 10, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ -
అసెంబ్లీలో మారని టీడీపీ సభ్యుల తీరు
-
జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న సీఎం వైఎస్ జగన్
-
తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సెషన్ 2022-23లో భాగంగా.. శనివారం ఉదయం ఐదవ రోజు సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుపల ఆవాసాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు 6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది. సభలో ప్రశ్నలే అడగాలని, ప్రసంగాలు వద్దంటూ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించడం విశేషం. -
చంద్రబాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వెన్ను పోట్లే
-
నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
-
నిరుద్యోగులకోసం కీలక ప్రకటన చేస్తానని సీఎం చెప్పటం సంతోషం
-
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు
-
రాష్ట్రం బంగారంలాంటి మనిషిని కోల్పోయింది
-
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
-
అసెంబ్లీలో గందరగోళానికి తెరలేపిన పచ్చ నేతలు
-
టీడీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి
-
ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించిన వేళ.. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గవర్నర్ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ నుంచి మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ‘‘గవర్నర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా!. ఆయన వయసును కూడా చూడకుండా వ్యవహరించారు. అసలు బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండా చించేశారు. గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడి చేసినట్టే!. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు ఎంతోహుందాగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేయట్లేదు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారాయన. టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. బీఏసీ లో అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చూశాం. వారు సభని కొనసాగించ కూడదన్నట్టే ఉన్నారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ వారికి చెప్తున్నాం’ అని విజ్ఞప్తి చేశారు గడికోట శ్రీకాంత్రెడ్డి. -
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే 2022–23 బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నెల 7న ఉదయం 11.30కు శాసనసభ, మండలి వేర్వేరుగా ప్రారంభమవుతాయని పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ, మండలి సమావేశాల ప్రారంభం తేదీని సూచిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉభయ సభల సభ్యులకు లేఖలు రాశారు. ఏడో తేదీనే బడ్జెట్..: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో సమావేశమై రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఇక బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై.. 7న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాల తొలిరోజునే శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రోరోగ్ కాకపోవడంతోనే.. అసెంబ్లీ, మండలి సమావేశాల నిర్వహణ నిరంతరం జరిగే రాజ్యాంగ ప్రక్రియ. కనీసం ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి ముగిసిన ప్రతిసారి ప్రోరోగ్ (ముగిసినట్టుగా అధికారిక ప్రకటన) చేస్తుంటారు. ఒకవేళ ప్రోరోగ్ చేయకుంటే.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం వాయిదా పడినట్టు మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదైనా ఆర్డినెన్సులు జారీ చేయడానికిగానీ, చట్టాల్లో సవరణలు చేయడానికిగానీ వీలుండదు. వాటికి అసెంబ్లీ, మండలి ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. అదే ప్రోరోగ్ చేస్తే.. ప్రభుత్వమే నేరుగా చట్ట సవరణలు, ఇతర అంశాలపై ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. ఈ కారణంతోనే దాదాపు అన్ని సందర్భాల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తుంటారు. ప్రోరోగ్ చేసిన తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలంటే.. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోరోగ్ చేయకుంటే.. నేరుగా సమావేశాలను ప్రారంభించే అధికారం అసెంబ్లీ స్పీకర్కు ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. స్పీకర్ అధికారంతో.. గత ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లో జరిగిన శాసనసభ 8వ విడత సమావేశాలు అక్టోబర్ 8న ప్రోరోగ్ కాకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను శాసనసభ స్పీకర్ ప్రారంభించనున్నారు. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం లేనందున.. గవర్నర్ ప్రసంగం కూడా ఉండే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇలా జరగడం అరుదే.. రాష్ట్ర గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడం చాలా అరుదైన విషయం. 1970, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహాలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ 2020–21 వార్షిక బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే నడవగా.. పుదుచ్చేరి గవర్నర్గా పనిచేసిన కిరణ్బేడీ కూడా గతంలో ప్రసంగాన్ని స్వయంగా బహిష్కరించారని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహిస్తున్నట్టు చెప్తున్నాయి. కాగా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై జరిగిన భేటీలో వైద్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతోపాటు ఆర్థికశాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. బంఫర్ ఆఫర్ 30 రోజులే! -
వికేంద్రీకరణపై ప్రజల్లో అపోహ ఉంది: మంత్రి పేర్నినాని
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్రశాసన సభ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. రాజధాని వికేంద్రీకరణపై ప్రజల్లో కొంత అపోహ ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ క్రమంలో.. మరోసారి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. ఈ వికేంద్రీకరణ బిల్లు ఎందుకు పెట్టాం.. మూడు రాజధానుల అంశంపై మరోసారి ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోని.. త్వరలోనే పూర్తిస్థాయి బిల్లుతో ముందుకు వస్తామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. అదే విధంగా.. వరదలు, వర్షాలపై మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందిస్తామని పేర్కొన్నారు. పునరావాసం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికోసం ప్రజలు.. 104 సేవలను.. నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్న104 సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విధినిర్వహణలో ముగ్గురు ఉద్యోగులు చనిపోయారని.. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భారీ వరదలకు.. 10 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. అదే విధంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామని .. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొవడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. -
చంద్రబాబు, కరువు కవల పిల్లలు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమ చేయించామని తెలిపారు. రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ ప్రక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు రైతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేస్తూ, రైతుల కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు రైతులు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు.. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది, కుప్పంలోనూ ఓటమి ఆయనకు లెక్కకాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. చదవండి: Andhra Pradesh: అధికార పార్టీ అరుదైన రికార్డు -
మైనార్టీల శ్రేయోభిలాషి వైఎస్సార్: అక్బరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సోమవారం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. వైఎస్సార్ లాంటి నేతను తన జీవితంలో చూడలేదని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. వైఎస్సార్ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే తక్షణం పరిష్కరించిన గొప్ప మనసున్న నాయకుడిగా.. దివంగత నేత చేసిన సేవలను అక్బరుద్దీన్ గుర్తుచేసుకున్నారు. గతంలో.. కబ్జాలకు గురైన 85 ఎకరాల బాబా షర్ఫోద్దిన్ దర్గా స్థలాలను .. ఒక జీవోతో తిరిగి వక్ఫ్బోర్డుకు వైఎస్సార్ అప్పగించారని అక్బరుద్దీన్ అన్నారు. చదవండి: రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్ -
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
-
తెలంగాణ అసెంబ్లీ: అక్టోబర్ 5వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన శాసనసభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీర్ చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారుపై చర్చిస్తున్నారు. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు