
Telangana Assembly Session Updates..
తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్
- శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..
- కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాం
- తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాం
- పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు
- ఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.
- అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.
- తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.
- రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.
- బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.
- తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం.
ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- బిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబు
- అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లు
- ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
- బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం
👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.
👉మొదలైన జీరో అవర్..
👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..
- శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైంది
- శాసనసభ గాంధీ భవన్ కాదు.
- తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.
- ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.
- ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?
- నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.
- శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?
- తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.
- సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.
- మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.
- శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.
- శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.
- నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం
20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి
- 2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
- సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వం ఫోకస్
- పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ
- 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
- పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాం
- రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది
- ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాం
కాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..
- బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..
- ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..
- నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?
- గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.
- కొడంగల్కు 1000 కోట్లు తీసుకుపోయారు.
- శాసన సభకే అవమానం.
- శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.
అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్..
- తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది
- రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు
- 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు
- 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి
- పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?
- నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు
- మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు
- కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు
- సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు
- రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?
- కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు
- కేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు
- గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి
- కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?
- నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?
- ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా?
మంత్రి సీతక్క వర్సెస్ గంగుల..
👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్క
- గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం
- 8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాం
- ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాం
- విద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్క
- విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.
- విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.
- నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.
- నేను సమాజాన్ని చదివాను.
- గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..
- సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాది
- మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాము
- పిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయి
- విద్యార్థులకు స్కాలర్షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోంది
- మేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోంది
- కానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..
- విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము
👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్
- విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి
- 2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారు
- గతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారు
- ప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా
- జనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారు
- గతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారు
- గతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు.
Comments
Please login to add a commentAdd a comment