
Telangana Assembly Session Updates
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
బీఆర్ఎస్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- తెలంగాణవ్యాప్తంగా 29వేల కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి.
- మాజీ ఆర్ అండ్ బీ మంత్రి చేసిన ఘనకార్యం మాకు తెలుసు
- పదేళ్లలో 6వేల కిలో మీటర్లు రోడ్లు వేశారు.
- పదేళ్లలో 3900 కోట్లు ఆర్ అండ్ బీకి కేటాయించిగా 4వేల కోట్లు లోన్స్ తీసుకున్నారు
- హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వస్తారా చూపిస్తాం.
- హరీష్ రావు మాట్లాడితే బాధ వేస్తోంది.
- మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుంది.
- వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అవుతాయి.
- రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది.
- మేము పనిచేస్తాం.. బీఆర్ఎస్ నేతల్లాగా మాట్లాడలేం.
- పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీనే.
- ఉద్యోగాలు ఇచ్చాం అంటే మేము రెడీ చేసాం అంటున్నారు..
- మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదు.
- బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారు.
మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి
- రోడ్లు వేయలేదని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.
- మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే 200 కోట్లకు పైచిలుకు నిధులతో రోడ్లు వేశాను.
- ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం పరిధిలో ఉంది. పనులు అప్పుడు కాలేదు.
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది ఏమైనా పనులు జరిగాయా?
- నా క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండి.
మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..
- నా నియోజకవర్గంలో 200 కోట్లతో రోడ్లు వేసామని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.
- ఆ రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్ రెడ్డికి సన్మానం చేపిస్తా.
- బీఆర్ఎస్ నాయకుల అబద్దాలకు లెక్కలేదు.
- బీఆర్ఎస్ ప్రశ్నకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా వాకౌట్.
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..
- పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో డబల్ రోడ్లు 8000 కిలోమీటర్లు.
- నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశాం.
- 17వేల కిలో మీటర్లకు 23వేల కోట్లు ఖర్చు అవుతాయి.
- మొత్తం ఖర్చులో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
- ప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుంది.
- ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారు.
- ఇప్పటికీ ఏడాదిన్నర కాలం పూర్తయింది.
- మూడున్నర సంవత్సరాలలో 17వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు?
మాజీ మంత్రి హరీష్ కామెంట్స్..
- ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది.
- సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి.
- కొత్త ప్రతిపాదనలు లేవని మంత్రి అంటున్నారు.
- బడ్జెట్ పుస్తకంలో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది.
- 60 శాతం ప్రభుత్వమని భట్టి విక్రమార్క అంటే.. ప్రైవేట్ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.
- బీఆర్ఎస్ పాలనలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్డులు వేశాం.
- శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న..
- సరూర్నగర్ చెరువు, మూసీ అభివృద్ధిపై ప్రశ్న వాయిదా
- ఫీజు రియింబర్స్మెంట్పై చర్చ ప్రారంభం
మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..
- ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు.
- మేము టార్గెట్, ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం.. సాధిస్తాం
- కొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.
- మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం
- 119 సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్లను ఏర్పాటు చేస్తాం.
- భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు.
- సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్
- అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయమై ముఖ్యమంత్రిని కలిశాం
- 72ఏళ్ల వయసులో నేను ఎందుకు పార్టీ మారతాను?
- కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్ లో ఉన్నారు
- ఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- బీఆర్ఎస్ లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్దంగా ఉన్నాం
- జమిలి ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
- ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు దాదాపు 7000 కోట్లు ఉన్నాయి.
- పెండింగ్ వల్ల కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.
- కాలేజీలు మూతపడితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.
మంత్రి సీతక్క కామెంట్స్..
- ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్సార్ తీసుకొచ్చిన గొప్ప పథకం
- ఫీజు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తాం
- గత ప్రభుత్వంలోనే 4వేల కోట్లకు పైగా బకాయిలు ఉండేవి.
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11 వందల కోట్లకు పైగా బకాయిలు అయ్యాయి.
- 12 వందల టోకెన్లు ఇప్పటికే రైజ్ అయ్యాయి.
హరీష్ రావు కామెంట్స్..
- సీతక్క గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
- బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ రెండు వేల కోట్లు బకాయిలు ఉండేవి.
- బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు అనేది సత్యదూరం
- 20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం.
- 800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీతక్క అన్నారు.
- కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.
- వెంటనే 2వేల కోట్లు విడుదల చేస్తే కాలేజీలు బతుకుతాయి
సచివాలయంలో ఎర్త్ అవర్..
- తెలంగాణ సచివాలయంలో శనివారం ఎర్త్ అవర్ పాటింపు.
- శనివారం 23/03/2025 రోజున ఎర్త్ అవర్లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్
- ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు సచివాలయంలో ఎర్త్ అవర్ పాటింపు.
- సచివాలయంలో గంటసేపు లైట్లు ఆఫ్ చేయాలని నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment