అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి | Telangana People Dead In USA Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

Published Mon, Mar 17 2025 10:25 AM | Last Updated on Mon, Mar 17 2025 1:05 PM

Telangana People Dead In USA Road Accident

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటకు(భారత కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మృతులను ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కుమార్తె కుటుంబీకులని సమాచారం. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 

అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement