![TG Minister Harish Rao Appointed As Chairman For Dharani Portal Sub Committee - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/24/harish-rao.jpg.webp?itok=9iiJY7Nf)
మంత్రి హరిష్ రావు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చైర్మన్గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు.
ఈ ఉప సంఘం కన్వీనర్గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment