Dharani website
-
స్వతంత్రంగా ధరణి ఫోరెన్సిక్!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో జరిగిన భూముల క్రయ, విక్రయాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఆడిటింగ్ చేసే ఫోరెన్సిక్ బృందాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూ లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించే ప్రక్రియలో నిపుణులను మాత్రమే భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా భూములను ఆడిటింగ్ చేసేందుకు రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండా ఈ నిపుణుల బృందాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో అటాచ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్కు చెందిన రెండు, ముంబైకి చెందిన ఒక కంపెనీ సామర్థ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ అంశాల్లో ఆ కంపెనీల బలమే ప్రాతిపదికగా ఈ మూడింటిలో ఒక దానిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ వివరాల రీవ్యాంప్ ప్రక్రియ జరుగుతోంది. రానున్న 10–15 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించే కంపెనీని ఎంపిక చేయాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. భూముల స్వాదీనమే! ఫోరెన్సిక్ ఆడిటింగ్లో భాగంగా తొలుత హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల లావాదేవీలను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని ఫోరెన్సిక్ ఆడిటింగ్లో పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకో నుంది. ఈ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి? కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి? మాజీ సైనికులకు ఆవార్డు చేసినట్టు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? అనే అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకొని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
నిషేధిత జాబితాలోని భూములే టార్గెట్ గా అక్రమాలు..
-
రైతుల సమాచారం దేశం దాటించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ అద్భుతమని, అమృతమని చెప్పారు. కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు, దుర్మార్గం, దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్ను ఉల్లంఘించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు. యజమానులు మారినప్పుడు ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు. బెంగళూరు, విజయవాడ, గుర్గావ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి తెలంగాణ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు. రైతుల భూమి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఇది తీవ్రమైన నేరం. దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నింటినీ చదవాల్సిన పరిస్థితి..’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘విదేశాల నుంచి కూడా లావాదేవీలు నిర్వహించారేమో ఇప్పుడు పరిశీలించాలి. భూముల రిజి్రస్టేషన్లు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు కూడా చేశారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖూనీ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని పోరాటాలూ భూమి చుట్టూనే.. ‘తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. అన్ని పోరాటాలు భూమి చుట్టూనే పరిభ్రమించాయి. పటేల్–పటా్వరీ వ్యవస్థ రద్దుకు కూడా భూసంబంధిత ఫిర్యాదులే కారణం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగేలా పాలకులు భూమి చట్టాలను రూపొందించారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ధరణి పేరుతో తానో అద్భుత సాంకేతిక నైపుణ్య ఆవిష్కరణ చేశానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని రంగరించి తయారు చేశానని చెప్పడంతో నిజంగానే భూమి సమస్యలు పరిష్కారమవుతాయేమోనని నేను కూడా ఓ సందర్భంలో భ్రమకు లోనయ్యా. కానీ ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశా రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో భూ లావాదేవీలను నిర్వహించారు. ఆ పోర్టల్ నిర్వహించింది కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీనే. తెలంగాణలోనూ ధరణి పోర్టల్ ఆ సంస్థకే ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కాగ్ ఈ కంపెనీ నిర్వాకం బయటపెట్టింది. ఎన్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి, ఆ కంపెనీని తెచ్చి అద్భుతాన్ని, అమృతాన్ని సృష్టించామని కేసీఆర్ చెప్పారు. ఈ లోపభూయిష్ట సాంకేతిక నైపుణాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారో తెలియాలి’అని రేవంత్ అన్నారు. యువరాజు సన్నిహితుడి సంస్థకు భాగస్వామ్యం ‘ఐఎల్ అండ్ ఎఫ్ఎస్తోపాటు అప్పటి యువరాజుకు సన్నిహితుడైన గాదె శ్రీధర్రాజుకు చెందిన మరో సంస్థ ఈసెంట్రిక్, విజన్ ఇన్ఫోటెక్లకు సంయుక్తంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దివాళా తీసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కంపెనీ ప్రతినిధులు జైలుకెళ్లారు. ఆ తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీ పేరుతో మరో అనుబంధ కంపెనీని తెచ్చారు. ఆ తర్వాత ఫాల్కన్ ఎస్జీ అనే ఫిలిప్పీన్స్ కంపెనీ, ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సింగపూర్ కంపెనీ తెచ్చారు. ఆ కంపెనీకి గాదె శ్రీధర్రాజు సీఈవో అయ్యాడు. ఆ తర్వాత స్పారో ఇన్వెస్టర్స్, గేటెవే స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సింగపూర్ కంపెనీలు, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కంపెనీ, గేట్వే ఫండ్ 2ఎల్ఎల్పీ అనే కెమెన్ ఐల్యాండ్స్ కంపెనీలను సృష్టించారు. అక్కడి నుంచి పెరడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీ, క్వాంటెల్లా ఐఎన్సీ అనే అమెరికా కంపెనీలను తెచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆర్థిక నేరానికి మూలం కెమెన్, బ్రిటిష్ ఐల్యాండ్స్ దేశాల్లో ఉంటుంది. పై కంపెనీలు నిర్వహిస్తున్న వారెవరూ ఈ రాష్ట్రం కాదు కదా దేశ పౌరులు కూడా కాదు. ఈ విధంగా తెలంగాణ రైతుకు, రెవెన్యూ శాఖకు మధ్య జరిగే లావాదేవీలు, డిజిటల్ వెబ్సైట్ నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని వంచన చేసి, వారి భూముల వివరాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వారిని ఏమనాలి?’అని సీఎం ప్రశ్నించారు. మేం తొందరపడితే రికార్డులన్నీ ట్రాష్ అయ్యేవి.. ‘మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది కదా.. ధరణిని ఏం చేశారని మమ్మల్ని అడిగారు. మేం విచారణకు ఆదేశించకుండా మౌనంగా ఉండడానికి కారణాలున్నాయి. మేము టెరాసిస్ నుంచి భూముల నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి ఇచ్చాం. కానీ ఈ డేటా బదలాయింపునకు గాదె శ్రీధర్రాజు సహకరించడం లేదు. మేము తొందరపడి ఆదేశాలిస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే తెలంగాణ భూ రికార్డులన్నీ క్రాష్ అయిపోయేవి. సర్వర్లు డౌన్ చేస్తే మళ్లీ రిపేర్, రీస్టోర్ చేయడానికి నెలలు పట్టొచ్చు. అందుకే ఆచితూచి వ్యవహరించాం. ధరణి నిజంగా అద్భుతమైతే కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అడిగి, కడిగి నిలదీయాలి కదా?’అని ముఖ్యమంత్రి అన్నారు. ధరణి విషయంలో నిద్రలేని రాత్రులు.. ‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే, మమ్మల్ని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభల్లో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరమంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాం. వందల సమావేశాలు పెట్టుకున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. అన్నీ ఆలోచించి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులందరూ ఆమోదించాలి.’అని సీఎం కోరారు. -
ధరణి పేరుతో లక్షల ఎకరాల స్కామ్
నల్లగొండ: ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షల ఎకరాల స్కామ్ చేసిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు తగ్గకుండా సంపాదించుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్కామ్లు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో భూభారతిని తీసుకొచ్చామన్నారు. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచి్చన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, రూ.500కు గ్యాస్, ఉచిత కరెంట్తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసాను అందిస్తామని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. సంక్రాంతికే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేస్తే ప్రస్తుత సీఎం మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి రక్తదానం తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రక్తదానం చేశారు. శిబిరంలో 200 మంది రక్తదానం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిట్టల్ ఈ నెల 26న సర్క్యులర్ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్వేర్లోని నాలుగు మాడ్యూల్స్కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ–కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్ జారీ(టీఎం31), పాస్బుక్లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి. ఆర్డీఓలు దరఖాస్తు లను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్ చేయాలి. తహసీల్దార్/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి. ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు..ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(టీఎం 33), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(జీఎల్ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది. గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
బీఆర్ఎస్ నేతల చేతుల్లోఅసైన్డ్ భూములు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు 26 లక్షల ఎకరాల భూములు పంచాయని, ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన తర్వాత.. వాటి పరిస్థితి ఏమిటో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలితే, వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని వెల్లడించారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కులాల లెక్కలు కొందరికి ఇష్టం లేదు రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉందన్న లెక్కలు తీయటం కొందరికి ఇష్టంలేదని, అందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక సర్వేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘కులాలను విడగొడుతున్నామని విపక్షాలు మా ప్రభుత్వంపై నిందలేస్తున్నాయి. మేం కులాలను కొత్తగా సృష్టించడం లేదు. అవి శతాబ్దాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏయే కులం జనాభా ఎంత ఉన్నది? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? అనేది సర్వే ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్ మళ్లీ దోపిడీ చేయాలని చూస్తోంది. అందరి లెక్కలు బయటకు వస్తే వాళ్లకు ఇబ్బంది’అని విమర్శించారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచి్చన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి, వారి పక్షాన ప్రభుత్వం ప్రతినెలా రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నాం. 15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. రేషన్కార్డు ఉన్న అన్ని రైతుకుటుంబాలకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా తప్పకుండా ఇస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం’అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా జిల్లా కలెక్టర్ను సన్యాసి అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకనే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో బీజేపీ పతనం మొదలైందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. చిట్చాట్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు పాల్గొన్నారు. -
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే..
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.సర్వే జరిగేది ఇలా.. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్బుక్ నంబర్తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.చివరగా ఎన్యుమరేటర్కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ధరణితో భూముల్ని దర్జాగా దోచేశారు : పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్: ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి పోర్టల్పై ఆయన మాట్లాడుతూ.. ఊరు పేరు లేని సంస్థలకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్,హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఎన్ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు చెప్పారు. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పొందంలో పేర్కొందని తెలిపారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం. వామపక్ష భావజాలంతో ఉండి..బీజేపీకి వెళ్ళింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కదా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటల ప్రధాని మోదీని అడగాలని సూచించారు. -
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎన్ఐసీ చేతికి ధరణి
-
ఎన్ఐసీ చేతికి ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రికార్డులను నిర్వహిస్తున్న ధరణి పోర్ట ల్ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మే టిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్ను నిర్వహిస్తున్న టెరాసస్ కంపెనీ గడువు ఈనెల 29తో ముగియనున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లపాటు ఈ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగిస్తు న్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. టెరాసస్ నుంచి పోర్టల్ నిర్వహణ చేపట్టేందుకు నెల రోజుల సమ యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి మూడేళ్లపాటు ధరణి పోర్టల్ను ఎన్ఐసీ అధికారికంగా నిర్వహించనుంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 నుంచి ఐఎల్ఎఫ్ఎస్ (ఆ తర్వాత టెరాసస్గా మారింది)కు రికార్డుల నిర్వహణ బాధ్యత అప్పగించగా నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిధిలో పనిచేసే ఎన్ఐసీకి తెలంగాణలోని భూముల రికార్డుల బాధ్యత అప్పగించడం గమనార్హం. ఈ మార్పుపై ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలోనూ చర్చించనున్నట్లు రెవెన్యూ వర్గాలంటున్నాయి. దీంతోపాటు కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం ముసాయిదాపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామా నికి రెవెన్యూ సిబ్బంది ఉండేలా మొత్తం 10,954 భూరక్షక్ (పేరు అధికారికంగా నిర్ణయించాల్సి ఉంది) పోస్టులకు కూడా మంత్రివర్గం అనుమతివ్వను ందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి.స్వదేశీ సంస్థ చేతుల్లోకి ‘ధరణి’: పొంగులేటిఇప్పటివరకు విదేశీ çకంపెనీ అయిన టెరాసస్ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ అయిన ఎన్ఐసీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని... తెలంగాణలోని 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు భూరికా ర్డుల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతుల ఖాతాల్లోని భూములకు రక్షణ ఏర్పడిందన్నారు. త్వరలోనే ధరణి సమస్యల నుంచి తెలంగాణ రైతాంగానికి విముక్తి కల్పిస్తామన్నారు. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘పార్ట్–బీ’పై ప్రత్యేక సదస్సులు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చిన్నచిన్న కారణాలు, కోర్టు కేసులు, ఆధార్కార్డు రికార్డుల ఆధారంగా పార్ట్–బీలో పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బీలో చేరిన ఈ భూములకు ఇప్పటివరకు మోక్షం కలగలేదు. తమ పట్టా భూములను అకారణంగా పార్ట్–బీలో చేర్చారని, ఆ కేటగిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సదరు భూముల యజమానులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అసలు ధరణి పోర్టల్లోని ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో చాలామందికి తెలియదు, తెలిసి కొందరు దరఖాస్తు చేసుకున్నా, సమస్య పరిష్కారం కాక, కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూములు రెవెన్యూ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఎకరాలు పార్ట్–బీలో ఉన్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసు చేసింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ ఇచ్చిన ఈ నివేదికలో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్–బీ భూముల గురించి గణాంకాలతో సహా వివరించింది. ఏ కారణంతో ఎన్ని ఎకరాల భూమిని పార్ట్–బీలో చేర్చారో లెక్కలు వెల్లడించిన ధరణి కమిటీ ఎలాంటి కారణాలు లేకుండానే 5,07,091 ఎకరాల భూములను పార్ట్–బీలో పెట్టారని, ఈ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. కమిటీ చేసిన సిఫారసులివే » పార్ట్–బీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలానికి 2–3 బృందాలు ఏర్పాటు చేయాలి. ళీ ఈ బృందాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు డీఆర్డీఏల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్ కార్యకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శిక్షణ ఇవ్వాలి. » అవసరమైనప్పుడు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల అధికారులను కూడా చేర్చాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలి. ళీ ఈ నివేదికల ప్రకారం సర్వే నంబర్ లేదా ఖాతానంబర్ వారీగా రైతులకు నోటీసులివ్వాలి. సేత్వార్, ఖాస్రా పహాణీ, సెస్లా పహాణీ, పాత పహాణీలు, 1బీ రిజిస్టర్, ధరణి పోర్టల్లోని వివరాలను పరిశీలించాలి. ఆ భూములు అసైన్డ్, ఇనాం, భూ బదలాయింపు నిషేధ పట్టిక, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూముల జాబితాలో ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ళీ గ్రామాల వారీగా పార్ట్–బీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలి. -
‘ధరణి’ని ప్రక్షాళన చేస్తాం
నేలకొండపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, పల్లె దవాఖానా ప్రారంభించి బీపీ పరీక్ష చేయించుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా మారిందన్నారు. త్వరలో రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల సంçస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్బాబు, డీఎంహెచ్ఓ మాలతి, ఆర్డీఓ గణేష్ తదితరులు ఉన్నారు. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించారు.ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న సీఎం.. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని సీఎం రేవంత్ చెప్పారు. -
ధరణికి ‘యాచారం’ దారి!
మేకల కల్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు మూడెకరాల 26 గుంటల భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్బుక్లో రెండెకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాలి అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే.. కొత్త పాస్బుక్లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన రెండెకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్–బీలో పెట్టారు. కొత్త పాస్బుక్ ఇవ్వలేదు. ఇక గనమోని మల్లయ్యకు ఉన్న రెండెకరాల 14 గుంటల పట్టా భూమికి ఎమ్మార్వో ప్రొసీడింగ్స్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ కొత్త పాస్బుక్ రాలేదు...‘లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్స్)’ స్వచ్ఛంద సంస్థ మంథన్ గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన భూన్యాయ శిబిరానికి వచ్చిన రైతుల్లో ఓ నలుగురి సమస్యలివి. వారు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సహా వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నలుగురనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులు ధరణి పోర్టల్తో తిప్పలు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఎప్పుడూ లక్షన్నర నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు ధరణి పోర్టల్లో పెండింగ్లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డ్రైవ్లు చేపట్టినా, అధికార వికేంద్రీకరణ జరిగినా ఈ దరఖాస్తులకు సంతృప్తస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ‘లీఫ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూన్యాయ శిబిరాలు.. ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి. సమస్యలెలా తెలుసుకున్నారంటే..? ఆయా గ్రామాల్లో భూన్యాయ శిబిరం ఏర్పాటుకు ముందే ప్రజలకు చాటింపు వేయించారు. శిబిరానికి వచ్చి భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులు ఇవ్వా లని సూచించారు. శిబిరం జరిగిన రోజు న ‘భూమి సమస్యల వివరాలు’ పేరిట ప్రత్యేక ఫార్మాట్లో రూపొందించిన దరఖాస్తుల ద్వారా వివరాలు తీసుకున్నారు. భూయజమాని వ్యక్తిగత వివరాలు, భూమి ఖాతా నంబర్, పాసుపుస్తకం ఉందా లేదా? సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన భూసమస్య ఉందనే వివరాలు అందులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేయించి.. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్లు తీసుకుని ఫైల్ చేశారు. రెండో దశలో.. ఆ దరఖాస్తులను పరిశీలించి, ఏ సమస్యలు ఎన్ని వచ్చాయి? పరిష్కారానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవి అనే స్పష్టతకు వచ్చారు. ఈ వివరాలను రైతులకు చెప్పి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 14న యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామంలో ప్రారంభమైన భూన్యాయ శిబిరాలు.. ఈ నెల 8న అదే గ్రామంలో ముగిశాయి. మొత్తం 10 గ్రామాల్లో కలిపి 2,200 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా ఏ సమస్యలు వచ్చాయంటే! భూన్యాయ శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే.. యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ఎక్కువగా అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయి. అసైన్డ్ భూములు మ్యుటేషన్ కావడం లేదని, కొత్త పాస్పుస్తకాలు రాలేదని, వచ్చిన పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిందని దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చిన సమస్య కనిపించింది. ఇక సర్వే నంబర్లు మిస్సింగ్, సేత్వార్ సరిపోలకపోవడం వంటివాటితోపాటు పార్ట్–బీ కింద (కొత్త పాస్పుస్తకాలు రాని పట్టా భూములు) సమస్యల దరఖాస్తులు వచ్చాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూముల్లో.. సుమారు 5 లక్షల ఎకరాలను ఎందుకు చేర్చారో కూడా తెలియదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ నంబర్ ఇవ్వలేదని 4 లక్షల ఎకరాలను ఈ జాబితాలో చర్చగా.. మొత్తంగా ఆధార్ సంబంధిత అంశాల ప్రాతిపదికన 6 లక్షల ఎకరాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. తర్వాతి దశలో ఏం చేస్తారు? ‘లీఫ్స్’ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో.. మిగతా పని అంతా రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గ్రామాల వారీగా భూరికార్డులను (సేత్వార్, పహాణీ, 1–బీ, ఇతర రికార్డులు) పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ స్థాయిలో జరిగే ఈ మూడో దశ పూర్తయ్యాక.. చివరిగా నాలుగో దశలో సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని లీఫ్స్ ప్రతినిధి ఎం.సునీల్కుమార్ వెల్లడించారు. ఈ పద్ధతిని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రికి నివేదిక! ఈ యాచారం పైలట్ ప్రాజెక్టు అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా యాచారం మండలంలో జరిగిన భూన్యాయ శిబిరాల వివరాలను తెలుసుకున్నారని తెలిసింది. లీఫ్స్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలోనే రెవెన్యూ మంత్రికి అందజేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి, రాష్ట్రంలోని వ్యవసాయ భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్కు గత నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 16 లక్షలు. అందులో 8లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ వర్గాలు తిరస్కరించి ఉంటాయని అంచనా. ఇప్పుడు యాచారం మండలంలోని 10 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 200 భూసమస్యలు ఉన్నాయని.. 11 వేల రెవెన్యూ గ్రామాల్లో కలిపి 22 లక్షల సమస్యలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడీ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. పరిష్కరించడమంటే దరఖాస్తులను తిరస్కరించడం కాదని.. కచ్చితమైన రికార్డు, వివరణలతో తగిన పరిష్కారం చూపాలని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించినప్పుడు భూసమస్యలపై 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందులో 8లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లినప్పుడే భూసమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని.. ఇందుకు యాచారం మండలంలో చేపట్టిన అధ్యయనం దోహదపడుతుందని అంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమిటి? భూసమస్యల పరిష్కారం కోసం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ భూముల పాస్బుక్లకు యూనిక్ కోడ్ ఇచ్చారు. ఇందుకోసం ఏడాది వరకు సమయం పట్టింది. 2007–2011 మధ్య మండలానికి మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని... పారాలీగల్ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు భూసమస్యల గుర్తింపు, పరిష్కరం ప్రక్రియ చేపట్టారు. 2009–10లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భూముల పరిశీలన జరిగింది. అప్పుడే 5 లక్షల వరకు భూసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 2011–12 మధ్య రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో మొత్తం 21 లక్షల దరఖాస్తులురాగా.. 8 లక్షల సమస్యలను పరిష్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక 2017 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త పాస్పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పోర్టల్ ద్వారానే భూసమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం జరుగుతోంది. -
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్కర్నూల్లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
3 నెలల్లో లక్ష దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తమ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. గత మూడు నెలల్లోనే లక్ష దరఖాస్తులు అందాయి. గతంలో పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్షల సంఖ్యలో దరఖాస్తులు పరిష్కరించినా, మళ్లీ ధరణి పోర్టల్లో దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఎన్నికల కోడ్ అడ్డంకితో డ్రైవ్ ఆగిపోయినప్పటి నుంచి ఇటీవలి వరకు కొత్తగా లక్ష దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పురోగతిని పరిశీలించడంతో పాటు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. ధరణి కమిటీ చొరవతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ల పని ఒత్తిడికి తోడు పోర్టల్లోని సాంకేతిక కారణాలతో చాలా దరఖాస్తులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీంతో ధరణి పోర్టల్ను సంస్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చొరవతో ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది మార్చినెల మొదటి వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అదే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్ను ప్రభుత్వం నిలిపివేసింది. సాధారణ ప్రక్రియలో భాగంగా అడపాదడపా పరిష్కరించిన కొన్ని దరఖాస్తులు కలిపి మొత్తం 1.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా మిగిలిన దాదాపు లక్ష దరఖాస్తులకు తోడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ధరణి పోర్టల్కు వచ్చిన మరో లక్ష కలిపి ఇప్పుడు పెండింగ్ దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ మిత్తల్ శుక్రవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విడతల వారీగా ఒక్కోసారి ఐదారు జిల్లాల కలెక్టర్లతో గంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్తో పాటు ప్రజావాణి, గ్రీవెన్స్ కార్యక్రమాల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయానికి నేరుగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయమై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. -
ధరణి.. ఫుల్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో కీలకమైన ‘ధరణి’పోర్టల్ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం–2020ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా దాదాపు అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మార్పులను ప్రస్తుత చట్టంలోనే చేస్తారా? లేక చట్టాన్నే మారుస్తారా? అనే దానిపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్ల నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమైంది. వాస్తవానికి క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసుకుని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ముగిసేలోపే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మధ్యంతర నివేదికను ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం తాత్కాలిక చర్యలకు పూనుకుంటుందని, అనంతరం ధరణి కమిటీ ఇచ్చే పూర్తి స్థాయి నివేదికలోని సిఫారసుల మేరకు ధరణి పునర్నిర్మాణానికి అడుగులు పడతాయనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. సవరణ లేదా కొత్త చట్టం అనివార్యం!ధరణి పోర్టల్ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తేవడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుంది. అదే విధంగా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టినా వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ ఎవరు చేపట్టాలి? రిజిస్ట్రేషన్లను ధరణి చట్టం ప్రకారం చేయాలా? స్టాంపుల చట్టం ప్రకారం చేయాలా? ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారం ఎమ్మార్వోలకే ఉంచాలా? మళ్లీ సబ్ రిజి్రస్టార్లకు అప్పగించాలా? లేదా డిప్యూటీ తహసీల్దార్లకు కట్టబెట్టాలా? అన్న దానిపై కమిటీ నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భూ రికార్డుల నిర్వహణ (ధరణి పోర్టల్) బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి కాకుండా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లకు అప్పగించాలని కూడా కమిటీ సిఫారసు చేయనున్నట్టు సమాచారం. పార్ట్–బీపై ప్రత్యేకంగా.. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను పార్ట్–బీ (నిషేధిత జాబితా)లో చేర్చారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పాసు పుస్తకాల కోసం రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఇందులో 5 లక్షల ఎకరాలకు కనీసం ఎటువంటి కారణాలు చూపెట్టకుండానే పార్ట్–బీ ఆపాదించినట్టు తెలుస్తోంది. మిగిలిన వాటిలో కొన్నిటికి కోర్టు కేసులుండగా, కొన్నింటిని చిన్నచిన్న ఫిర్యాదుల ఆధారంగా పార్ట్–బీలో చేర్చారు. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూముల పరిష్కారానికి సంబంధించి కూడా మధ్యంతర నివేదికలో పలు సిఫారసులు పొందుపర్చనున్నారు. దరఖాస్తుల పరిష్కారం ఆగిందా?ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఓ నిరంతర ప్రక్రియ. అయితే అధికార వికేంద్రీకరణ లేని కారణంగా రాష్ట్రంలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పడిపోయాయి. వీటిని పరిష్కరించేందుకు పునరి్నర్మాణ కమిటీ చొరవతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గడువు ముగిసినా మరోమారు పొడిగించింది. కానీ ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సాకుతో ధరణి సాధారణ కార్యకలాపాలను కూడా నిలిపివేశారని, తహసీల్దార్ల స్థాయిలో తప్ప మిగిలిన ఏ స్థాయిలోనూ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా టీఎం–33 కింద పెండింగ్లో ఉన్న లక్షకు పైగా దరఖాస్తుల్లో స్పెషల్ డ్రైవ్లో 20 వేల వరకు పరిష్కరించినా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇక జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయిలో ఏ దరఖాస్తును పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని, వాస్తవానికి ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తులు పరిష్కరించడానికి కోడ్ అడ్డంకి కాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు మాత్రమే కోడ్ అడ్డంకి అని చెపుతున్నా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని్పస్తున్నాయి. మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టే నాటికి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులతో పాటు కొత్తగా వచి్చన మరో 50 వేలకు పైగా దరఖాస్తులు కలిపి మొత్తం 3 లక్షల దరఖాస్తులకు గాను ఇప్పటివరకు లక్షకు పైగా దరఖాస్తులు మాత్రమే పరిష్కారమైనట్లు సమాచారం. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్లో 41 ఎకరాలు, ఉత్తర్పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి నిర్వహణ
శామీర్పేట్: కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి పోర్టల్ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ ధరణి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలోని బొమ్మరాశిపేట గ్రామంలో ధరణి కమిటీ సభ్యులు పర్యటించారు. అనంతరం బొమ్మరాశిపేట రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కోదండరెడ్డి, ధరణి కమిటీ న్యాయ సలహాదారు సునీల్లు మాట్లాడుతూ.. బొమ్మరాశిపేట గ్రామంలో ధరణిలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, బడా బాబులు కుమ్మక్కై భూ సమస్యలను సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు. ధరణిలో ఉన్న లోపాలను గుర్తించేందుకు బొమ్మరాశిపేట గ్రామంలో నెలకొన్న భూ సమస్యను ఓ కేస్ స్టడీగా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. ధరణి వెబ్సైట్లో మార్పులు చేపట్టి, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తామని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, త్వరలోనే ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భరోసా ఇచ్చారు. లొసుగులను వాడుకొని.. ధరణిలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు బడాబాబులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొమ్మరాశిపేట రైతులు ధరణి కమిటీ సభ్యుల ముందు వాపోయారు. 50 ఏళ్ల క్రితం 1,050 ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగుచేస్తున్నామని, ఇటీవల కొందరు వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదంటూ.. అధికారులతో కుమ్మక్కై భూములను బ్లాక్ లిస్ట్లో చేర్పించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తమ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని, కొంత స్థలం అమ్మి కూతుళ్ల పెళ్లిచేయాలని ప్రయత్నించినా ధరణి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
‘ధరణి’ పరిష్కారం 'పేపర్పైనే'!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్లో అప్డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గందరగోళం రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే డిజిటల్తోపాటు అధీకృత లాగిన్లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్డేట్ చేసే అదీకృత లాగిన్లు లేవు. అ«దీకృత లాగిన్లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది. గడువు ముగిసిపోయినా.. స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది. దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్లో ఉండటంతో డ్రైవ్ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్లకు పంపి అక్కడి నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్కు అభ్యంతరం చెప్పినా..? వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం. ఎన్నికల కోడ్కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది. రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ధరణి పోర్టల్ సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
‘ధరణి’ అధికారాల బదలాయింపు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. ♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. ♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతేనే సీసీఎల్ఏకు ♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్తో పాటు సీసీఎల్ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది. ♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు. ♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
‘పట్టా’లు తప్పారు!
హుస్నాబాద్ రూరల్: తాతలు, తండ్రులు కట్టిన ఇళ్లు 12...చనిపోయిన వారి సమాధులు 18... ఒక వ్యవసాయ బావి, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే పైప్లైన్. ఇవన్నీ కాకుండా 1984 నుంచి ఆ భూముల్లో కబ్జాలోనే ఉంటూ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు ఇవేమీ కనిపించలేదు. మోక (పొజిషన్) విచారణ జరపలేదు. కబ్జాలో ఎవరు ఉన్నారో తెలుసుకోలేదు. ధరణిలో కబ్జా కాలమ్ తొలగించడంతో పాత పట్దాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. దీనిని పసిగట్టిన కొందరు స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, సాదాబైనామాలు సృష్టించి 2021లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో సర్వే నంబర్ 250లో 2.00 ఎకరాలు, 263లో 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది పట్టా చేయించుకున్నారు. మోక మీద రాజయ్య కుటుంబ సభ్యులే ఉన్న విషయమూ రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బోగస్ సాదాబైనామాలు సృష్టించి నలుగురు పేరున పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్కు బాధితులు ఫిర్యాదు చేశారు. మోక చూడకుండానే పట్టా మార్పిడి.. భూ రికార్డుల మార్పు సమయంలో రెవెన్యూ అధికారులు మోక(పొజిషన్) విచారణ జరిపాక పట్టా చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు. ఒకరు మోక మీద ఉంటే మరొకరి పేరున పట్టా చేశారు. దీనివల్ల 250లో సర్వే నంబర్లో రక్బా తక్కువ వస్తుంది. మోక మీద ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు లేవు, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు పొందినవారికి మోక మీద భూమి లేదు. మా తాత ఇల్లు కట్టిన భూమి మాది కాదంటున్నారు యాబై ఏళ్ల క్రితమే మా తాత ఇల్లు కట్టాడు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది కాదని ఎవరో అమ్మారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సర్వేనంబర్ 250లో రెండు ఎకరాలు, 263 సర్వేనంబరులో 1.30 ఎకరాల్లో మా తాత కాలేష్ రాజయ్యనే పహాణీలో, కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మా వారికి పట్టా మారిన సంగతి తెలియదు. మేమంతా మా అయ్యలు చూపించిన భూములనే దున్నుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములు మావి కావంటే ఎలా? మోక విచారణ జరిపించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పాస్పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. – కాలేష్ రాజేశ్, పోతారం(ఎస్) మా తాతల సమాధులను పట్టా చేశారు 1980లోనే 250 సర్వే నంబరులో మా తాతల సమాధులు కట్టాం. ఒకటి కాదు రెండు కాదు 18 సమాధులు ఉన్నాయి. వ్యవసాయ బావి, మా ఇళ్లకు కరెంట్ మీటర్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నుంచి తాగునీరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూములు కావాలంటే ఎలా? 50 ఏళ్ల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతికినోళ్లం...ఇప్పుడు భూమి లేదంటే ఎక్కడకు పోవాలి. మా పాత రికార్డులను పరిశీలించి మోక విచారణ జరిపి మా భూములకు పట్టాలు ఇవ్వాలి. – కాలేష్ శివకుమార్, పోతారం(ఎస్) విచారణ జరిపిస్తాం పోతారం(ఎస్) దళిత కాలనీ పేదల భూముల విషయమై మోక విచారణ జరిపిస్తాం. అదే సర్వే నంబర్లో పేదల ఇళ్లు ఉంటే పట్టాదారుల పాసు పుస్తకాలు రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్కు నివేదిస్తాం. – రవీందర్రెడ్డి, తహసీల్దార్,హుస్నాబాద్ -
‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు
శామీర్పేట్: ధరణి పోర్టల్లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్పేట మండల పరిధిలోని లాల్గడీ మలక్పేట్లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్భట్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోనూ సోదాలు కరీంనగర్క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఏడాది నుంచి తిరుగుతున్నా... ధరణి పోర్టల్లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్గడీ మలక్పేట్లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. -
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది. మీ శాఖల్లో ఏం జరుగుతోంది? సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక దేవాదాయశాఖ గెజిట్లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్ ప్లానేంటి?
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భూ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది?. ఫార్మా సిటీ వస్తుందని తెలిసి ముందుగానే భూములు కొనుగోలు చేశారా?. ఆయనతో పాటు భూములు కొనుగోలు చేసిన ఇతర అధికారుల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోందా? అక్కడ భూములు అమ్ముకున్న రైతులు ఏమనుకుంటున్నారు? ఫార్మా సిటీ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందా?. రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా సిటీపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు.. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టారు. యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమనగల్లు మండలాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12వేల ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తి చేశారు. దాదాపుగా 500కు పైగా విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్రొడక్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. అయితే, దీనికి దగ్గరలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 25ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25ఎకరాల 19గుంటల భూమి తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు మూడు కోట్లకు పైగానే ఉంది. ధరణి పోర్టల్లో ఖాతా నెంబర్ 5237 ద్వారా సర్వే నెంబర్ 249/అ1లో 8 ఎకరాల భూమి, 249/ఆ2లో 10 ఎకరాల భూమి, 260/అ/1/1లో 7.19 ఎకరాల భూమి మొత్తం 25ఎకరాల 19 గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి నుంచి సెల్ డీడ్ ద్వారా భూమిని జ్ఞానముద్ర కొన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2018లో తన సతీమణి జ్ఞానముద్ర పేరుతో నిబంధనల మేరకే కొనుగోలు చేసినట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి టీవీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్లో కేటాయించిన నివాసస్థలంలోని ఇంటిని విక్రయించి.. కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భూమి కొనుగోలుపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఫార్మా సిటీ సమాచారం ముందుగానే తెలుసుకుని ఈ భూములు తక్కువ ధరకే కొనుగోలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాగుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలకు పైగా సోమేశ్ కుమార్ లబ్ధిపొందారు. ఈ భూమి కొనుగోలు చేసిన విధానంపై ఈడీ, విజిలెన్స్ విభాగాలకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అక్రమాస్తులు కూడకట్టుకున్నారని, ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సోమేశ్ కుమార్పై వస్తున్న భూ ఆరోపణలు.. ఎటువైపు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ భూములు కొన్న అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ చుట్టూ భూ కొనుగోళ్లపై విచారణ చేయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఐపీఎస్ అధికారి ఫార్మా సిటీ దగ్గర్లో మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి, నక్కర్తిమేడిపల్లి గ్రామాల రైతులను భయాందోళనకు గురి చేశారట. అడ్డగోలు ధరకే రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. ►సదరు ఐపీఎస్ అధికారి తమపై అక్రమంగా కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కంటతడి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ►ఫార్మా సిటీ భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు తాడిపర్తి గ్రామస్తులు, భూదాన్ ట్రస్టులో ఉన్న భూమిని కొందరు రియాల్టర్లు ఫార్మా సిటీకి అమ్ముకుని వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే భూమి కోసం చాలా ఏళ్లుగా ఆ ఊరి ప్రజలంతా న్యాయపోరాటం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ►ఫార్మాసిటీలో భూ సేకరణ వ్యవహారంలో ఓ వైపు గందరగోళం నెలకొనగా.. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులు ముందుగానే సమాచారం తెలుసుకుని రైతుల నుంచి అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారు. మొత్తంగా ఫార్మాసిటీ చుట్టూ భూములు కొన్నవాళ్ల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్న ధరణి పోర్టల్ కమిటీ
-
ధరణి రోడ్మ్యాప్ కోసం కలెక్టర్లతో భేటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్మ్యాప్ రూపొందించేందుకు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని ధరణి కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోగానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోగానీ ఐదు జిల్లాల కలెక్టర్లతో ఈ భేటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఐదుగురు జిల్లా కలెక్టర్లను హైదరాబాద్కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాసింది. సోమవారం ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్లతోపాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి తదితరులు సీసీఎల్ఏ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ధరణి వర్క్ఫ్లో గురించి చర్చించారు. పోర్టల్కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యల గురించి సీసీఎల్ఏ యంత్రాంగం కమిటీ సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ల అనుభవాలను, దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరు, నిజామాబాద్ భూభారతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లతో సమావేశం కావాలని, ఆ తర్వాత రోడ్మ్యాప్కు ఓ రూపం ఇవ్వాలని తీర్మానించింది. త్వరలో మధ్యంతర నివేదికలు ధరణిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సమయం పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ప్రజలకు అవసరమైన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మధ్యంతర నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక భూములకు సంబంధించిన డేటా కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ శాఖల వద్ద ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించి.. ఈ మూడింటి డేటాను క్రోడీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా సీపీఐతోపాటు పలు పౌరసంఘాల ప్రతినిధులతో కూడా చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశీ కంపెనీని మారుస్తాం: కోదండరెడ్డి సీసీఎల్ఏ కార్యాలయంలో కమిటీ భేటీ అనంతరం కోదండరెడ్డి, సునీల్కుమార్, రేమండ్ పీటర్ మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే తమకు వేలాది ఫిర్యాదులు అందాయని కోదండరెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఓ విదేశీ కంపెనీకి ఇవ్వడం పొరపాటని సీఎం రేవంత్రెడ్డి గుర్తించారని.. అయితే ఈ పోర్టల్ నిర్వహణను వేరే కంపెనీకి అప్పగించాలా? కేంద్ర పరిధిలోని సంస్థకు అప్పగించాలా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ కమిటీ ప్రతి అంశాన్ని పరిశీలిస్తుందని, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ భూములన్నింటిపై అధ్యయనం చేస్తుందని వివరించారు. కాగా.. వ్యవసాయ, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా మెరుగైన భూపరిపాలన అందించేందుకు అవసరమైన మార్పులను మాత్రమే తమ కమిటీ సూచిస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి మార్పులు సూచిస్తాం: సునీల్ ధరణి కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదని, సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్పులు, చేర్పులు, సలహాలు అందిస్తుందని కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ చెప్పారు. ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల మూలాలను పరిశీలిస్తున్నామని, ఆర్వోఆర్ చట్టం–2020లో మార్పులు అవసరమా కాదా అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. -
పక్కాగా ధరణి అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది. నిషేధిత భూములు పెద్ద సవాల్! కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు. రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి. కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్వేర్ను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు. గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధిత జాబితాలో పట్టా భూములు రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్ -
రిజిస్ట్రేషన్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. ధరణిపై సమీక్షించినా... వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి పోర్టల్పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. ఇది బీఆర్ఎస్కు ఎంబరాస్మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే. కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్రెడ్డి, కె.గౌతమ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ మూడ్లోనే రెవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం. ధరణి పోర్టల్తో పాటు జీవో 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్రాగా, నవంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తదుపరి ఆదేశాల వరకు పెండింగ్లోనే? రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం. అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు. -
లోపం ఎక్కడుంది?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’పోర్టల్ కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తోంది. భూమి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి దరఖాస్తులకు ధరలు నిర్ణయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, అలాగే రైతుల ఇబ్బందులను అవకాశంగా తీసుకుని కొందరు ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పితే చాలు.. క్షేత్రస్థాయి నివేదికలు, సంబంధిత ఉన్నతాధికారుల సంతకాలతో సంబంధం లేకుండానే వివాదాస్పద భూములను సైతం మార్పిడి చేసేస్తున్నారు. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా క్లియర్ అవు తుండటాన్ని పరిశీలిస్తే.. ఖరీదైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, అర్బన్ సీలింగ్ భూములు ఏ విధంగా అన్యాక్రాంతమ వుతున్నాయో అర్థం చేసు కోవచ్చు. ఇటీవల రంగా రెడ్డి జిల్లా ధరణి పోర్టల్లో చోటు చేసుకున్న అక్రమాలే ఇందుకు నిదర్శనమని చెపుతున్నారు. జిల్లా కలెక్టర్ లాగిన్ చేస్తే కానీ ఓపెన్ కానీ ధరణి ఫోర్టల్ ఏవిధంగా తెరుచుకుంది? 98 వివాదా స్పద దరఖాస్తులు ఏ విధంగా క్లియర్ అయ్యా యనేది? అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. అనుమానం మొదలైంది అక్కడే.. రంగారెడ్డి జిల్లాలో ధరణి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ అక్టోబర్ 20 నుంచి 23 మధ్యలో 20 దరఖాస్తులను క్లియర్ చేసేందుకు పోర్టల్ లాగిన్ను ఓపెన్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ధరణి ఆపరేటర్లు వారికి ముడు పులిచ్చినవారికి సంబంధించిన వివాదాస్పద దరఖాస్తులను (అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో) క్లియర్ చేసుకున్నట్లు తేలింది. అయితే తాను కేవలం 20 దరఖాస్తులనే ఆమోదిస్తే.. వివిధ కేటగిరీలకు సంబంధించిన మరో 98 దరఖాస్తులు ఎలా క్లియర్ అయ్యాయనే అంశంపై ఇటీవల కలెక్టర్కు అనుమానం వచ్చినట్లు తెలిసింది. అన్నీ వివాదాస్పద భూములవే.. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏ అధికారులను సంప్రదించారని సమాచారం. అయితే అటు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. తన ప్రమేయం లే కుండానే వివాదాస్పదంగా ఉన్న 98 దరఖాస్తులు ఆమోదం పొందిన అంశాన్ని కలెక్టర్ భారతిహోళికేరి సీరియస్గా తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ పరిపాలనాధికారి ఈనెల 5న పోస్ట్ ద్వారా ఆదిభట్ల పోలీసు స్టేషన్కు ఫిర్యాదు పంపారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంలో ప్రమే యం ఉందని భావిస్తున్న ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాకు ఏ పాపం తెలియదు.. కలెక్టర్ ప్రమేయం లేకుండా దరఖాస్తులు ఎలా క్లియర్ అయ్యాయనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నా.. వాటిని నివృత్తి చేయాల్సిన అధికారులంతా గప్చిప్ అయ్యారని తెలుస్తోంది. ఎవరికి వారు తమకు సంబంధం లేదు అన్నట్లుగా మిన్నకుండిపోయారని చెపుతున్నా రు. ఇదిలా ఉంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు నరేశ్, మహేశ్లు సైతం తమకే పా పం తెలియదని చెపుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపితే కానీ అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం బయటకు రాదని స్థానికులు అంటున్నారు. -
ఎందుకంత దుఃఖం..
-
కోడ్ కూత ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (కోడ్) ఏయే పథకాలకు వర్తిస్తుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న పథకాలే అయినప్పటికీ ఆ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే వెసులుబాటు కోడ్ అమల్లో ఉంటే సాధ్యం కాదు. కానీ, ఈ కోడ్ సాకుగా కొన్ని పాత పథకాలు, ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను అమలు చేయడంలో కొందరు అధికారుల గందరగోళ వైఖరి చర్చకు దారితీస్తోంది. రెవెన్యూ కార్యకలాపాలు ‘యథాతథం’ ఇక, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతారే తప్ప దైనందిన రెవెన్యూ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ధ్రువీకరణ పత్రాల మంజూరు, ధరణి దరఖాస్తుల పరిష్కారం లాంటివి కోడ్ కారణంగా ఆగిపోవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో 58, 59ల ద్వారా భూముల క్రమబద్ధీకరణ కూడా ఆగదని అంటున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక విడత నిధులు మంజూరైన లబ్ధిదారునికి రెండో విడత నిధులు మంజూరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జిల్లాకో తీరుగా గొర్రెల పంపిణీ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం విషయంలో ఎన్నికల కోడ్ను జిల్లాకో రీతిలో అమలుపరుస్తున్న తీరు విస్మయపరుస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రెండో విడత రాష్ట్రంలో అమలవుతోంది. మొత్తం 3.5లక్షలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 1.25లక్షల మందికి పైగా లబ్ధిదారులు వారి వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు. ఇందులో కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కేవలం 28వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోకుండా చేతులెత్తేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయాధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు వదిలేశారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు గొర్రెలను పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఆయా జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు వచ్చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా కొనుగోళ్లు చేస్తుండడం గమనార్హం. కొసమెరుపేమిటంటే... 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత గొర్రెల పథకం అమలు కావడం గమనార్హం. ఆ బాధ్యత అధికారులదే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజలపై ఉంది. కోడ్ అడ్డురాని పథకాలను, కార్యక్రమాలను, జీవోలను, రోజువారీ కార్యకలాపాలను యథాతథంగా అమలు చేసే బాధ్యత అధికారులదే. ఈ విషయంలో అధికారులదే తుది నిర్ణయం’ అని స్పష్టం చేశారు. డబ్బుల్లేవని కోడ్ మాట చెపుతున్నారు ‘అసలు కోడ్కు గొర్రెల పథకానికి సంబంధం లేదు. 2018లో ఎన్నికలు జరిగే రోజున కూడా గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ సమస్య కాదు. సరిగా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసి గొల్లకుర్మలను మోసం చేసింది. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో కోడ్ అనే సాకు చూపెడుతున్నారు.’ – ఉడుత రవీందర్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కేసీఆర్కు ఏటీఎంగా ధరణి
సాక్షి, హైదరాబాద్: గతంలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్కు ఏటీఎంగా ఉండేవని, ఇప్పుడు ధరణి పోర్టల్ను ఆయన ఏటీఎంగా మార్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను కచ్చితంగా రద్దు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.పి. వెంకటేశ్తో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం మాట్లాడుతూ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు చెందిన 35 లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టారని, జిల్లా కలెక్టర్లను అడ్డుపెట్టుకుని భూములను అక్రమార్కులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్పై రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో సభలు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. ‘ధరణిని రద్దు చేస్తే రైతుబీమా, రైతుబంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది 2020లో అయితే, రైతుబంధు, బీమాలు 2018లోనే ప్రారంభమయ్యాయి. మరి అవి ఎలా వచ్చాయి’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి కంటే మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి రైతుల భూములకు రక్షణ కలి్పస్తామని, టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఉప్పు, నిప్పు అన్నారు ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య అగాధం ఉందన్నట్టుగా ఇన్నాళ్లూ కేసీఆర్ ప్రజలను నమ్మించారని, ఉప్పు, నిప్పు తరహాలో వ్యవహరించారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం, గవర్నర్లు రహస్యంగా మాట్లాడుకున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకుని ఉంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్లు.. ముగ్గురూ తోడు దొంగలని, వారి రూపం వేరు కానీ మనసులు మాత్రం ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని చెప్పారు. -
సేత్వార్ సమస్యలకు ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సేత్వార్ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు. వాస్తవానికి, ధరణి పోర్టల్లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సేత్వార్ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది. ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్ విలువ సర్టిఫికెట్ను ధరణి పోర్టల్ ద్వారా ఇచ్చే ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్గేజ్ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు. టీఎం 33 మాడ్యూల్లో.. ధరణి పోర్టల్లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్తోపాటు సీసీఎల్ఏ లాగిన్లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. -
ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది: భట్టి ఫైర్
సాక్షి, గాంధీ భవన్: తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ భట్టి విక్రమార్క్ సంచలన కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కాగా, భట్టి విక్రమార్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను మూయించాలని ప్రజలు మమ్మల్ని అడిగారు. చేనేత కార్మికుఉ జీఎస్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్కి పట్టం కట్టాలని చూస్తున్నారు. సింగరేణిని బొందపెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారు. ధరణి పోర్టల్ పేరుతో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..! -
ధరణిపై రేవంత్ సంచలన ఆరోపణలు.. ఆ మంత్రికి భూములివ్వలేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్లో జరుగుతున్న అక్రమాలను వివరించారు. కాగా, రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద మాఫియా దాగుంది.. దీనిపై ఆధారాలతో సహా సీరియల్గా బయటపెడతాం. ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం. గజ్వేల్లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుంది. అమూల్ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారు. గంగుల కమలాకర్కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు. పూర్వీకులంతా భూకంపం వచ్చినట్లు.. సర్వం కోల్పోయినట్లు.. కేటీఆర్, కేసీఆర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. పరోక్షంగా వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒప్పుకున్నారు. మీ చీకటి నేర సామ్రాజ్యంలో వ్యక్తుల ఒప్పందాలతో మీకు ఆర్థిక ప్రమాదం ఉందో.. ప్రాణ భయం ఉందో తెలియడంలేదు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. కిషన్రెడ్డి.. కేసీఆర్ ధరణి దోపిడీలపై స్పందించాలి. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ,బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపాం. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారు. ఈటల రాజేందర్ను బీజేపీ మోసం చేసింది. రాజేందర్కు భద్రత పెంచినా.. అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు?. నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ! -
బీజేపీ వస్తే 'ధరణి బంద్'!
సాక్షి, నాగర్కర్నూల్: ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో రైతులను వేధింపులకు గురిచేసేందుకే ఈ పోర్టల్ను తెచ్చారని..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్తో పాటు బీఆర్ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుందని చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్తరాగం ఎత్తుకున్నారని విమర్శించారు. పేరు మారినంత మాత్రాన వారి గుణం మారదని, ‘ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు.. భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇళ్లలోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజా, రైతు వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ‘నవ సంకల్ప బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు. విపక్షాల ప్రయాస ఫొటో సెషన్లకే పరిమితం దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని, వారి ప్రయాస అంతా ఫొటో సెషన్లకే పరిమితమవుతుందని నడ్డా విమర్శించారు. కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఠాక్రే పార్టీలన్నీ తమ కుటుంబాలను కాపాడుకునేందుకే తహతహలాడుతున్నాయని, ఒక్క బీజేపీ మాత్రమే దేశ ప్రజల హితం కోసం పనిచేస్తోందని చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయలేకనే, ఆయన కులం పేరుతో చాయ్వాలా అంటూ విపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం విషాన్ని మింగినట్టుగా విమర్శలను మింగుతూ నిరంతరం దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. మోదీ ముందుచూపుతో ఆర్థిక వ్యవస్థ పటిష్టం కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను సైతం తట్టుకుని మోదీ ముందు చూపుతో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చారని నడ్డా చెప్పారు. ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానంలో నిలిపారని అన్నారు. గతంలో దేశంలో 28 శాతం ఉన్న పేదరికం, మోదీ ప్రభుత్వ పథకాల ఫలితంగా 10 శాతానికి తగ్గిందని వివరించారు. గతంలో 97 శాతం మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు 97 శాతం ఫోన్లు దేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. ‘దునియా మే మోదీ ఈజ్ ది బాస్, యువర్ హీరో, గ్లోబల్ లీడర్’ అంటూ మోదీని ప్రపంచ నేతలు కొనియాడుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నడ్డా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో చేయలేని పనులను కేవలం తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. తెలంగాణలో 65 ఏళ్లలో మొత్తం 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులు వేస్తే, బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలోనే 2,500 కి.మీ రహదారులను నిర్మించామని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామంటూ గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునికీకరించడంతో పాటు కొత్తగా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖలకు రెండు వందే భారత్ రైళ్లను నడిపిస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్– నల్లగొండ, హైదరాబాద్– వరంగల్ ఇండ్రస్టియల్ కారిడార్లు, రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేశామని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ పాలన వస్తే ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో ఆలోచించాలని కోరారు. పోరాటవీరుడు నడ్డా: బండి సంజయ్ పదిహేనేళ్ల చిరుప్రాయంలోనే దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు జేపీ నడ్డా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో పోరాడుతూ బీజేపీని ప్రతి గడపకు చేర్చి ప్రపంచంలోనే శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దారని చెప్పారు. నాగర్కర్నూల్లో బీజేపీ ఎక్కడుందీ.. అని అంటున్న వాళ్లకు ఇక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూపించాలని అన్నారు. సభలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మహేంద్రనాథ్ పాండే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, నేతలు జితేందర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ధరణికి ఇక్కట్లు
-
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
ధరణి కొనసాగిస్తాం.. కేసీఆర్ పథకాలపై బండి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధరణి రద్దు చేయమని స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయం. ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీజేపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్పై బండి సంజయ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ను హైలైట్ చేయడానికే మోదీ మాకు మిత్రుడే అని కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్కు జిల్లా అధ్యక్షులు లేరు. బూత్ కమిటీలు లేవన్నారు. కాగా, బీజేపీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారు. మండట కమిటీలు ఉన్నాయి. బూత్ కమిటీలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు. మోదీ కేబినెట్పై ఒక్క అవినీతి మరక లేదు. ఇక, కేసీఆర్ కేబినెట్లో అవినీతి మరకలేని మంత్రి లేడు. కేసీఆర్ రోజు ఏం చేస్తున్నారు. రోజువారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరు. ప్రధాని వస్తే కలవరు. కాంగ్రెస్ పార్టీలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చిందే కేసీఆర్. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. తెలంగాణపై కీలక నిర్ణయం! -
ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆ గ్రామ పరిధిలో ఉన్న 146 ఎకరాల భూదాన్ భూములను ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని అన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ అనుచరులు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలది కీలకపాత్ర అని ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే వెంటనే దీనిపై విచారణకు ఆదేశించాలని, ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్, ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలాంటి లావాదేవీలు వద్దొన్న భూదాన్ బోర్డు ‘తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 146 ఎకరాల భూదాన్ భూములున్నాయని అప్పటి కందుకూరు ఎమ్మార్వో 2007లో కలెక్టర్కు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ భూములను కాపాడాలని అప్పడు ఎమ్మెల్యే హోదాలో ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. భూదాన్ బోర్డు కూడా ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని మహేశ్వరం సబ్ రిజి్రస్టార్కు లేఖ రాసింది. ఈ మేరకు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ సదరు గ్రామంలోని సర్వే నంబర్లన్నింటినీ నిషేధిత జాబితాలో చేర్చింది..’అని రేవంత్ తెలిపారు. ధరణి వచ్చిన తర్వాతే... ‘2020లో ధరణి పోర్టల్ను తీసుకువచ్చిన తర్వాత ఈ భూములను నిషేధిత కేటగిరీ నుంచి తొలగించారు. 2021లో ఎం.శివమూర్తి పేరిట బదిలీ చేశారు. వాటి విలువ రూ.1,000 కోట్లు ఉంటుంది. రిజి్రస్టేషన్ల శాఖ పరిధిలో ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ధరణిలో నిషేధిత జాబితాలో ఎందుకు లేవు? ఈ భూములను కొల్లగొట్టింది కేటీఆర్ అనుచరులే. ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తోంది అందుకే. తమ వ్యవహారాలు బయటకు వస్తాయనే ఆలోచనతోనే తమకు బంగారు బాతు లాంటి ధరణిని వెనకేసుకు వస్తున్నారు..’అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ధరణి బాధితులు 20 లక్షల మంది ‘రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ధరణి బాధితులయ్యారు. తండ్రి చనిపోతే కొడుకు పేరిట భూమి బదిలీకి కూడా అవకాశం లేకుండా పోయింది. ధరణి రద్దయితే రైతుబంధు, రైతుబీమా రాదంటూ సీఎం హోదాలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 2018లో ఈ ప్రభుత్వమే రైతుబంధు, రైతుబీమా మొదలుపెట్టింది. అప్పటి నుంచి 2020 వరకు ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ మూడేళ్ల పాటు వచి్చన రైతుబంధు, బీమా ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఎందుకు రావు? కాంగ్రెస్ పార్టీ ధరణి లేనప్పుడే 2009–10లో రూ.74 వేల కోట్ల రైతు రుణమాఫీని చేసింది. విదేశీ కంపెనీ చేతుల్లోకి రైతుల సమాచారం! కేసీఆర్ రైతులను బెదిరించేలా చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల సమాచారం అంతా విదేశీ కంపెనీకి వెళ్లింది. ఇలా చేయడం క్రిమినల్ చర్యల పరిధిలోనికి వస్తుంది. ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఈ బాగోతమంతా బయట పడుతుందనే కేసీఆర్ తదితరులు పెడ»ొబ్బలు పెడుతున్నారు..’అని రేవంత్ అన్నారు. కిషన్రెడ్డి సెంట్రల్ విజిలెన్స్కు లేఖ రాయాలి ‘స్వగ్రామంలో భూములు అన్యాక్రాంతమవుతుంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన వెంటనే సెంట్రల్ విజిలెన్స్ విచారణ కోరుతూ లేఖ రాయాలి. మేము అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపిస్తాం, తప్పులు చేసిన కలెక్టర్లు, సీసీఎల్ఏను ఊచలు లెక్కపెట్టిస్తాం. కేసీఆర్కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన సాంకేతిక విధానంతో మరో విధానాన్ని తీసుకువస్తాం. టైటిల్ గ్యారంటీ విధానాన్ని తెస్తాం. రిజి్రస్టేషన్ చేసి ఫీజు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఆ భూముల విషయంలో జవాబుదారీతనంగా ఉండాలనేది మా విధానం..’అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు వస్తాయని అంటున్న కేసీఆర్కు ఊచలు లెక్కపెట్టే కష్టాలు మాత్రం వస్తాయని, చర్లపల్లి జైల్లో ఆయనకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని, బిడ్డ, అల్లుడు, కొడుకు అందరూ అక్కడే ఉండవచ్చని ఎద్దేవా చేశారు. -
ధరణితో రాబందులు మాయం
సాక్షి, నాగర్కర్నూల్/గద్వాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో రైతులను దోచుకునే రాబందులు మాయమయ్యాయని.. అలాంటి ధరణిని తీసేస్తామంటూ మళ్లీ దళారులు మోపయ్యారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు కింద డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో పడేందుకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారా? అని మండిపడ్డారు. అప్పట్లో దళారుల దయతో వాళ్లు రాసిందే లెక్క, గీసిందే గీతగా సాగేదని.. ధరణితో దళారులు, పైరవీకారులు, పట్వారీలు లేకుండా పోయారని చెప్పారు. మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ధరణిని బంగాళాఖాతంలో వేయడమంటే ప్రజలను వేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో పంట డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు రోజుల్లోనే ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్లు సైతం పది నిమిషాల్లో పూర్తయి పట్టా చేతికందుతోందన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగించారు. పాలమూరు కళకళలాడుతోంది గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎందరో మంత్రులుగా పనిచేశారని.. వారు ఎన్నో మాటలు చెప్పినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని కేసీఆర్ విమర్శించారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఉన్నా తాగు, సాగు నీటికి కష్టాలు ఉండేవన్నారు. ఒకప్పుడు ఎండిపోయి ఎడారిని తలపించిన పాలమూరు.. ఇప్పుడు ధాన్యపు రాశు లు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో కళకళలాడుతోందన్నారు. గతంలో ఇక్కడ బతకలేక, బతుకులేక వలసపోయారని.. అలాంటిది ఈ రోజు రాయచూర్, బిహార్, జార్ఖండ్ నుంచి మిర్చి, పత్తి ఏరేందుకు మన దగ్గరికి వలస వస్తున్నారని చెప్పారు. మహబూబ్నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని.. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలో, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు. గద్వాల జిల్లాకు ప్రత్యేక నిధులు జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్ష ల చొప్పున, 12 మండల కేంద్రాలకు రూ.15 లక్షల చొప్పున, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జిల్లా సరిహద్దుల్లో మరో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రవీందర్రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 13 నిమిషాలే ప్రసంగం గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. సాయంత్రం 6.10 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన.. 6.13 గంటలకు మాట్లాడటం ప్రారంభించి 6.26 గంటలకు ముగించారు. కాసేపటికే హెలికాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరారు. సీఎం సభలో కూచుకుళ్ల గద్వాల బీఆర్ఎస్ సభలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత మల్లు రవి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీనితో కూచుకుళ్ల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సోమవారం ఆయన సీఎం కేసీఆర్తో కలసి వేదిక పంచుకోవడం గమనార్హం. ఉద్యోగులు పట్టు వదలొద్దు.. జట్టు చెదరొద్దు.. దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులంతా పట్టు వదలకుండా, జట్టు చెదరకుండా పనిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్లో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంతోపాటు విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో మానవీయ కోణంలో పాలన సాగుతోందని.. ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం పథకాలను రూపొందించలేదని చెప్పారు. దేశంలో 90 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే.. అందులో తెలంగాణ వాటానే 50 శాతానికిపైగా 56 లక్షల ఎకరాలు అని వివరించారు. -
Gadwal BRS Meeting: ధరణిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, జోగులాంబ గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని.. అలాగే, జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ పప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గద్వాల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గద్వాలలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. పాత గద్వాలకు.. నేటి గద్వాలకు ఎంతో తేడా ఉంది. జిల్లా ప్రజలకు జోగులాంబ దీవెనలు ఉండాలి. గద్వాలకు త్వరలో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉంది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాం. మరో 5-10 ఏళ్లు ఇలాగే కష్టపడితే మనకు ఎదురుండదు. మానవీయ కోణంలో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రగతిలో మనకన్నా ఎత్తుగా ఉన్న అనే స్టేట్స్ను అధిగమించాం. గతంలో మనం వలస పోయాం. ఇప్పుడు వేరే వాళ్లు ఇక్కడికి వలస వస్తున్నారు. గత పాలకులెవరూ ప్రజలను పట్టించుకోలేదు. రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చాం. ధరణి తీసేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిసేస్తామంటున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చాం. ధరణితోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ధరణితో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాం. ధరణి ఉండాలా.. తీసేయాలా.. మీరే చెప్పండి అని ప్రజలను ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిధులు అడిగే దమ్ము లేదు.. అలాంటోడు మంత్రిగా ఉండడం నల్లగొండ దురదృష్టం -
ధరణి రద్దు చేస్తే.. బ్రోకర్ల రాజ్యమే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం అవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. సుపరిపాలన పోయి., లంచాల పద్ధతి వస్తుందని, దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దు య్యబట్టారు. ధరణి కారణంగానే ఇప్పటివరకు 60 లక్షల మంది రైతులకు రూ.60 వేల కోట్ల రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయని వివరించారు. శనివారం హరీశ్రావు సంగారెడ్డిలో జరిగిన సుపరిపాలన దినోత్సవంలో ప్రసంగించారు. ధరణిపై అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల తీరును ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎల్లంకల పడ్డది.. ‘సుపరిపాలన అంటే.. గతంలో ఒక లీడరుండె... అంతా హైటెక్.. అంతా సుపరిపాలననే.. మాట మాట్లాడితె హైటెక్ అంటుండె. ఇగ నా అంత అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంల లేడంటుండే. ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్... ఎల్లంకెల పడ్డది. ఇతని పుణ్యమా అని ఇయ్యాల ఎల్లంకెల పడ్డది ఆంధ్రప్రదేశ్. కానీ ఇవాళ కేసీఆర్గారు మాటలు తక్కువ... మనవి చేతలెక్కువ. కానీ వాళ్లయెట్లుండంటె మాటలు కోటలు దాటినయ్. చేతలు మాత్రం పకోడీలాగుండె వాళ్ల పరిస్థితి. కానీ మన కేసీఆర్ హయాంలో మాటలకంటే చేతల్లోనే కేసీఆర్ ఎక్కువగ దృష్టి పెట్టిండు. మనది ప్రచారం తక్కువ. పని ఎక్కువ. కానీ ఆ ప్రచారం కేసీఆర్గారు చెయ్యరు. మనం చెయ్యాలె. లబ్దిపొందిన మనం, దాని ద్వారా లాభాలు పొందిన మనం, ఈ నిజాలను ప్రచారంలో పెట్టాలె. అందుకే మళ్లొక్కసారి అంటున్న.. ఏం లబ్దిపొందినమనేది పక్క రాష్ట్రం పొయ్యి చూసొస్తే అర్థమయితది’ అని హరీశ్ అన్నారు. తాను తప్పు చేశానని లగడపాటి అన్నారు తెలంగాణను వ్యతిరేకించి తాను తప్పు చేశానని లగడపాటి రాజగోపాల్ ఇటీవల ప్రకటించినట్లు తాను విన్నానని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్న కారణంగా లగడపాటి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు. -
ధరణి పోర్టల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ధరణిని బరాబర్ రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను బరాబర్ రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గడీల పాలన పునరుద్ధరణ కోసమే కేసీఆర్ ధరణిని తీసుకువచ్చారని, ఈ పోర్టల్ ద్వారా బినామీల పేరిట వేల ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. ‘కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణిని తెచ్చారు. 97 శాతం భూ వివాదాలకు ధరణి పోర్టలే కారణం. దీనిని ఇచ్చి న మాట ప్రకారం కచ్చి తంగా రద్దు చేస్తాం’అని ప్రకటించారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం కత్రియా హోటల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందని, ధరణిలో అవకతవకలకు కారణమైన అధికారులు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. ‘ధరణి రాకముందు రైతుబంధు రాలేదా? భూముల రికార్డులు లేవా? ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్కు ఎందుకంత దుఃఖం వస్తోంది?’అని ప్రశ్నించారు. ధరణి విషయంలో కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి కోసం చర్లపల్లి జైల్లో డబుల్బెడ్రూం ఇల్లు కట్టిస్తామని రేవంత్ పేర్కొన్నారు. యువత ముందుండాలి: రాష్ట్రంలో కేసీఆర్పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యూత్ కాంగ్రెస్ శ్రమించాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి న పార్టీగా ఒక్క అవకాశాన్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు. పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న విడుదల చేస్తామని చెప్పారు. దేశంలో డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని, దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజిన్ పని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రద్దయిన వెయ్యినోటు లాంటి వారయితే, మోదీ.. వెనక్కు తీసుకున్న రెండు వేల రూపాయల నోటు లాంటివారని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్లను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలంగా పనిచేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. చర్చకు మేం సిద్ధం: ఈ సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, అంతకుముందు జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని రేవంత్ అన్నారు. ‘2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చకు కేటీఆర్, హరీశ్లు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేయనిది ఏదైనా బీఆర్ఎస్ చేసి ఉండే క్షమాపణలు చెప్పడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ‘కాంగ్రెస్ ఏం చేసిందని తండ్రీ కొడుకులు అడుగుతున్నారు. కేసీఆర్లా మేం రాష్ట్రాన్ని కొల్లగొట్టం. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుంది’అని వ్యాఖ్యానించారు. డీకే అరుణ బీజేపీ అధ్యక్షురాలయితే మంచిదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ మంత్రి డి.కె.అరుణను నియమిస్తే మంచిదేనని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీని కూడా కాంగ్రెస్ వాళ్లే నడిపిస్తున్నట్టు అవుతుందని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అరుణని అధ్యక్షురాలిగా నియమిస్తే బీజేపీని నడిపే బలం ఆ పార్టీ వాళ్లకి లేదని ఒప్పుకున్నట్టే అవుతుందని చెప్పారు. తెలంగాణలో ఏముందని షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, పొత్తులయినా, టికెట్లయినా పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న మంత్రి కేటీఆర్ ప్రశ్నకు స్పందిస్తూ.. తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెపితే బీఆర్ఎస్ దుకాణాన్ని బంద్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. -
ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్
సాక్షి, నాగర్కర్నూల్: రైతు పేరిట ఉన్న భూమి మార్చేందుకు ఇప్పుడు ఎమ్మార్వో, మంత్రి, చివరకు ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదని, ధరణితో కేవలం రైతు బొటన వేలికే భూముల రికార్డులు మార్చే అధికారం ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ధరణి తీసేస్తే రైతులు మళ్లీ పంట డబ్బుల కోసం చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రూ.5 లక్షలు, వడ్లు అమ్మితే పంట డబ్బులు వెంటనే అందుతున్నాయని తెలిపారు. మంగళవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు. ధరణి లేకుంటే ఎన్ని పంచాయతీలయ్యేవో.. ‘ప్రపంచంలో ఎక్కడినుంచైనా బటన్ నొక్కి రైతు తన పేరిట ఉన్న భూమిని చూసుకునే చక్కని సదుపాయం ధరణి కల్పించింది. ధరణి లేకుంటే కోట్ల రూపాయలు పలుకుతున్న భూములతో ఎన్ని పంచాయతీలు, పోలీసు కేసులు, మర్డర్లు అయ్యేవో ఆలోచించాలి. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలన్న కాంగ్రెస్ నేతలకు ఇదంతా ఇష్టం లేదు. అందువల్ల వారినే బంగాళాఖాతంలో పడేయాలి. కాంగ్రెస్ మాటలు విని రైతులు సాధికారతను కోల్పోవద్దు. రైతుల మధ్య మళ్లీ భూ తగాదాలు పెరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. ధరణి తీసేస్తే వీఆర్వోలు, గిర్దావరీల చేతుల్లోకి మన బతుకులు వెళ్తాయి. మళ్లీ వాళ్లు రాసిందే రాత, గీసిందే గీతగా మారుతుంది. ఇప్పుడు అడుగుతున్నా ధరణి తీసేద్దామా? కాపాడుకుందామా? ధరణితో నూటికి 99 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఏవైనా సమస్యలు మిగిలి ఉంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిషాల్లో పరిష్కారం చేస్తారు..’ అని కేసీఆర్ అన్నారు. మంది మాటలకు ఆగం కావొద్దు.. ‘తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇందులో ఒకటిన్నర ఏళ్లు కరోనా, మరో ఏడాది నోట్ల రద్దుతోనే గడిచిపోయింది. అయినా మిగిలిన ఆరున్నర ఏళ్లలోనే దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం నంబర్వన్గా ఉంది. మంది మాటలు విని ఆగం కావొద్దు. కాంగ్రెస్ రాజ్యంలో దళారులదే భోజ్యం. ఆ ప్రబుద్ధుల పాలనలో కంప చెట్లే దిక్కయ్యాయి. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..’ అని సీఎం పేర్కొన్నారు. ఇకపై బంగారు తునకగా పాలమూరు.. ‘ఉద్యమ సమయంలో నన్ను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపిస్తామని పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. అప్పుడు పాలమూరులో ఉద్యమం అంతగా లేకున్నా ఎంపీగా గెలిపించారు. ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడి కష్టాలు అర్థమయ్యాయి. కల్వకుర్తి తండాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. దుందుభి వాగుపై గోరటి పాట రాస్తూ ‘వాగు ఎండిపోయెరా, చేను ఎండిపోయెరా..’ అని బాధపడ్డడు. నేను ఇక్కడి ఎంపీగా ఉండగానే రాష్ట్రం సాధించుకున్న చరిత్ర పాలమూరుకు ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరును పంటల భూమిగా మార్చిన సంతోషం ఉంది. ‘వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా.. నేడు చెరువులన్నీ నిండి పన్నీటి జలకమాడే పాలమూరు’ అంటూ నేనే పాట రాసిన. నాగర్కర్నూల్ నుంచి శపథం చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఏ పని చేసినా భగవంతుడు ఓడించలే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. నార్లాపూర్, ఏదుల, మిగతా అన్ని రిజర్వాయర్లను ఆగస్టులోనే నింపుతాం. నా బలగం, బంధువులు తెలంగాణ ప్రజలే.. దేశంలో ఎక్కడకు పోయినా తెలంగాణ మోడల్ గురించే అడుగుతున్నారని కేసీఆర్ చెప్పారు. తన బలగం, బంధువులు తెలంగాణ ప్రజలేనని, మీరిచ్చిన ధైర్యంతోనే దేశ రాజకీయాల్లోకి పోవాలన్న నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలమూరులో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇకపై నా పాలమూరును బంగారు తునకగా చూడబోతున్నాం. రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. కానీ వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం. కులవృత్తుల కుటుంబాలకు ఈ నెల 9 నుంచి ఇంటికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
ధరణిని వద్దన్న కాంగ్రెస్.. బంగాళాఖాతంలోకే!
నిర్మల్: రైతులకు ఎంతో మేలు చేస్తున్న ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ దుర్మార్గులనే బంగాళాఖాతంలోకి విసిరేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. ధరణితోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు, రైతు బీమా సొమ్ములు పడుతున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహాణీలు, భూమి రికార్డులు మార్చేయడం వంటి ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటికి చెక్ పెట్టేందుకే ధరణిని తెచ్చామని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ మళ్లీ వస్తే రైతు బంధు, దళిత బంధు పథకాలు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.56 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయంతోపాటు బీఆర్ఎస్ భవన్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం, పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక క్రషర్ గ్రౌండ్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. సభ ప్రారంభమయ్యే సమయంలో కాసేపు వర్షం కురిసింది. అయినా ప్రజలు వేచి ఉన్నారు. కేసీఆర్ కూడా తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ దేశంలో రైతులకు మేలు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదేనని, దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ పక్కా అన్నారు. ‘‘మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి రైతులు రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేస్తారా? రైతు బీమా పైసలు నేరుగా నామినీ ఖాతాలో వేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్.. మాకు మీరు కావాలె. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని అక్కడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు..’’అని కేసీఆర్ చెప్పారు. దోపిడీని ఆపేందుకే ధరణి ధరణి పోర్టల్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటారా? ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా డబ్బులు ఖాతాలలో పడుతున్న విషయం వాళ్లకు తెలుసా? ఇప్పుడు ధరణి వద్దంటున్న దుర్మార్గులు 50ఏళ్లపాటు పాలించారు. రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. కాంగ్రెస్ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం చూశాం. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారేసరికి పహాణీలు మారిపోయేవి. ధరణితో ఆ సమస్యలన్నీ తీరాయి. ఇలాంటి ధరణి ఉండొద్దా? ధరణి పోర్టల్ను తీసివేస్తామంటున్న కాంగ్రెస్ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలి..’’అని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో బాధలు పడ్డామని.. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ముగింపు పలుకుతారని కేసీఆర్ పేర్కొన్నారు. వేల కోట్లతో ఉచిత్ విద్యుత్ ఇస్తున్నాం.. రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని.. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. రైతులకు ఎన్ని మీటర్లు పెట్టావని అడిగేవారే లేరని పేర్కొన్నారు. ఉద్యోగుల కృషితో అద్భుత ఫలితాలు కొత్త కలెక్టరేట్ను ప్రారంభించిన తర్వాత జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సమష్టిగా కృషి చేసి అద్భుత ఫలితాలు సాధించగలిగామన్నారు. ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందని.. ముఖ్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇందుకు అధికారుల కృషే కారణమని అభినందించారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల్లో నిరుపేదలు ఉన్నారని, వారికోసం చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డి, రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు సీఎం వరాలు తన పర్యటన సందర్భంగా నిర్మల్ జిల్లాకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున.. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నామని.. జేఎన్టీయూ ఆధ్వర్యంలో దానిని ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా నంబర్ వన్గా నిలవడంపై టీచర్లు, విద్యార్థులను అభినందించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తామని.. దీనికి పునాదిరాయి వేసేందుకు త్వరలోనే బాసరకు వస్తానని కేసీఆర్ తెలిపారు. మండలం సార్.. చూసిన.. చూసిన.. బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలను మండలంగా ఏర్పాటు చేయాలంటూ సొనాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్మల్ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మేరకు గట్టిగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దానిపై స్పందిస్తూ.. ‘చూసిన.. చూసిన..’ అని సమాధానమిచ్చారు. దీంతో తమ విజ్ఞప్తి సీఎం దృష్టికి వెళ్లిందని సొనాల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్బుక్లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్బుక్లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్బుక్ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్బుక్లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్బుక్లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్బుక్లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పందించారు. ట్రాన్స్పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
కోట్లుపెట్టి కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు?: కిషన్ రెడ్డి
సాక్షి, వికారాబాద్: కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ధరణితో లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్గా ప్రకటించడం వల్ల చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందనేది తెలియడంలేదు గతంలో గతంలో కొన్ని భూ సంబంధిత సమస్యలు ఉంటే ధరణి పోర్టల్ వల్ల ఇవి భారీగా పెరిగిపోయాయి. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అది ప్రగతిభవన్ నుంచే చేపట్టాలి. సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేవి.. కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా?. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములకు విక్రయాలు చేపడుతున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్ లు సామాన్యులకు చేరడం లేదు. వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్ ఉందని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అందించిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి బాగానే ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లు కేసీఆర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బయటపెట్టాలి. ధరణిలో భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో బయటపెట్టండి. ప్రగతిభవన్లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను అమలుచేస్తున్నారు తప్ప.. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదు. ఒవైసీ గతంలోనే చెప్పాడు.. కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని చెప్పాడు. రాజాసింగ్ సెక్రటేరియట్కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు?. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్కు వెళ్లేందుకు అనుమతిలేదు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారినే లోనికి పంపించడం లేదు. పాతబస్తీలోకి ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి కానీ ధైర్యంగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోంది. తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. హైదరాబాద్లో రూ.కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూం ఏం చేస్తోంది. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
‘ధరణి’తో సమస్యలు పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో రైతుల సమస్యలు పెరిగాయని, ఎక్కడికి పోయి వీటిని పరిష్కరించుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొందని పేర్కొంది. పొరపాట్లను సరిచేసుకునే ఆప్షన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పింది. బ్రోకర్లకే లబ్ధి అనేలా ధరణి పోర్టల్ తయారైందని.. ఇన్నేళ్లయినా సమస్యలు పరిష్కరించకపోవడం ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని సర్కార్ను మందలించింది. ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)ను కోర్టుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరై 4 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జస్టిస్ కె.లక్ష్మణ్ ఆర్డర్ కాపీలో ధరణిలోని పలు సమస్యలను ప్రస్తావించారు. ధరణిలో హైకోర్టు పేర్కొన్న ప్రధాన సమస్యలు 1. డేటా సవరణ కోసం పెట్టుకున్న ఆన్లైన్ అర్జీలను పరిష్కరించకపోవడం 2. నిర్ణీత సమయంలో ఈ–పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయకపోవడం 3. సర్వే కోసం ఎఫ్–లైన్ దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోకపోవడం.. కాలవ్యవధి పాటించకపోవడం 4. వేలంలో కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు జారీ చేసిన కొనుగోలు డాక్యుమెంట్ను పరిగణనలోకి తీసుకోకపోవడం 5. ఏ కారణాలు చెప్పకుండా ఆన్లైన్/ఎఫ్–లైన్ దరఖాస్తులను తిరస్కరించడం 6. సెక్షన్ 7కు లిమిటేషన్ పీరియడ్ వివరంగా చెప్పలేదు. ఎప్పటినుంచి న్యాయస్థానం డిక్రీలు పరిగణనలోకి తీసుకుని మార్పు చేస్తారో చెప్పలేదు. 7. అమ్మకం, కొనుగోలు లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడానికి ధరణిలో అప్లోడ్ చేసిన జనరల్, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలను పట్టించుకోకపోవడం. 8. ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 7లో పేర్కొన్న ‘కోర్టు డిక్రీ’ అనే దానిలో స్పష్టత లేదు. 9. కోర్టు కేసులు, స్టే, ఇంజెంక్షన్ ఆదేశాల్లో వివాదం ఉన్న భూమి మాత్రమే కాకుండా.. సదరు సర్వే నంబర్లోని భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెడుతున్నారు. 10. కొత్త ఆర్వోఆర్ యాక్ట్ రాకముందు పాత ఆర్వోఆర్ చట్టం–1971లోని సెక్షన్ 5(బీ), 5(5), 9 కింద రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై అప్పీల్ లేదా రివిజన్కు అవకాశం కల్పించే ప్రొవిజన్లు లేవు. దీంతో కొత్త చట్టం రాకముందు అధికారులిచ్చిన ఆదేశాలను సవాల్ చేయడానికి తెలంగాణ జనరల్ క్లాజెస్ చట్టం–1891 కింద అప్పీల్కు అవకాశం ఇవ్వాలని కొందరు పిటిషన్లు వేస్తున్నారు. 11. పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లను కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపాల్సి ఉంటుంది. అలాంటి అప్పీళ్లను ఇప్పటికీ ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపలేదు. 12. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు మారిన భూమి మాత్రమే కాకుండా మొత్తం ఆ సర్వే నంబర్ను ‘నాలా’ జాబితాలో చూపిస్తున్నారు. 13. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో నమోదైన భూమిలో కొంత భాగాన్ని మార్చడానికి ఎటువంటి ఆప్షన్ అందుబాటులో లేదు. 14. పొరపాటున ఏదైనా సర్వే నంబర్ నిషేధిత జాబితాలో చేరినా.. ప్రభుత్వ భూమి అని నమోదైనా దానిని మార్చడానికి ఆప్షన్ అందుబాటులో లేదు. 15. మ్యుటేషన్ చేయాలని కోరుతున్న వ్యక్తికి ఉన్న టైటిల్ను తనిఖీ చేయడం అధికారులకు కష్టమైన పనిగా మారింది. మ్యుటేషన్ చేయాలని కోరుతున్న భూమి లింక్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా ఆప్షన్ ఉండాలి. 16. ఉమ్మడిగా కొనుగోలు చేసిన భూమి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య ఉన్న భూమిని హక్కుదారుల మధ్య విభజించడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. 17. చనిపోయిన విక్రయదారు వారసుల నుంచి పట్టా పొందే వీలు లేదు. 18. మిస్సింగ్ సర్వే నంబర్లు మళ్లీ చేర్చడానికి, తప్పుడు ఎంట్రీలు మార్చే ఆప్షన్ లేదు. 19. భూ యజమాని నుంచి ప్రభుత్వం భూమి సేకరించిన తర్వాత ఆ భూమిని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. 20. అలాగే ప్రభుత్వం అసైన్ చేసిన భూముల వివరాలు కూడా ధరణిలో కనిపించడం లేదు. ► ఇవికాక కోర్టు దృష్టికి రాని ఎన్నో సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఇంకా ఆలస్యమే..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం. ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్ఏ వర్గాలు చెపుతున్నాయి. వేలసంఖ్యలో పెండింగ్లో టీఎం 33 దరఖాస్తులు ధరణి పోర్టల్లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
తిరస్కరణకు కారణం చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆమోదించినా, తిరస్కరించినా అందుకు తగిన కారణాలను కలెక్టర్లు విధిగా తెలియజేసేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ కసరత్తు చేస్తున్నారు. రైతుల భూములపై తీసుకొనే నిర్ణయాలకు గల కారణాలు పబ్లిక్ డొమైన్లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు. అదే జరిగితే దరఖాస్తు తిరస్కరణకు గల కారణం రైతుకు తెలుస్తుందని, మరోసారి అలా తిరస్కారానికి గురికాకుండా అవసరమైన పత్రాలు సమకూర్చుకొనేందుకు, రికార్డులను రెవెన్యూ యంత్రాంగానికి సమర్పించి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం పొందేందుకు రైతుకు వీలు కలుగుతుందని, ఈ కోణంలోనే సీసీఎల్ఏ స్థాయిలో కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు కారణమేంటో తెలియక.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా నమోదవుతున్న అర్జీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు ఎక్కడకు వెళ్లింది... ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నారు? ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? వంటి వివరాలేవీ రైతులకు తెలియట్లేదు. దరఖాస్తును ఆమోదించారో లేదో కూడా తెలియని దుస్థితి. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి వేచి చూశాక సదరు రైతు ఫోన్కు దరఖాస్తును కలెక్టర్ తిరస్కరించారనో లేదా ఆమోదించారనో మాత్రమే సందేశం వస్తోంది. ఆ సందేశం వచ్చే వరకు తమ దరఖాస్తు ఏమైందంటూ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకుగల కారణమేంటో కూడా తెలియట్లేదు. కారణం కోసం ఏ స్థాయిలోని కార్యాలయానికి వెళ్లినా తమకు తెలియదంటే తమకు తెలియదంటూ దాటవేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో రైతులు తమ వినతులను ఉపసంహరించుకోవడమో లేక దళారులను ఆశ్రయించడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు తమ దరఖాస్తులపై స్పష్టతనిచ్చే దిశగా సీసీఎల్ఏ కసరత్తు జరుగుతోంది. త్వరలో మరో 10 మాడ్యూల్స్ ధరణి పోర్టల్ ద్వారా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 10వరకు కొత్త మాడ్యూల్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందే ‘నాలా’ కేటగిరీలోకి మారినా వ్యవసాయ కేటగిరీలోనే నమోదైన భూములు, వారసత్వ హక్కులు కల్పించాల్సిన భూములు, సంస్థల పేరిట పట్టా హక్కులు కల్పించాల్సిన భూముల విషయంలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తున్నాయని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరికొన్ని సమస్యలకు కూడా త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందని అంటున్నాయి. -
ధరణిపై పోరు ఇక ‘ఉధృతం’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్పై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ‘మన భూమి–మన హక్కు’పేరిట రైతులకు ప్రత్యేకంగా ధరణి కార్డులు జారీ చేస్తూ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ధరణి సమస్యలపై గ్రామస్థాయిలో అదాలత్లు నిర్వహించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భూరక్షక్’లకు మంగళవారం గాంధీభవన్లో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జనగామ, హనుమకొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్యకర్తలు ఈ శిక్షణకు హాజరయ్యారు. దీనికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీనియర్ నేతలు హర్కర వేణుగోపాల్, అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్రెడ్డి తదితరులు హాజరు కాగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, సి.శ్రీనివాస్లతోపాటు సాంకేతిక, న్యాయనిపుణులు భూరక్షక్లకు శిక్షణనిచ్చారు. 14 అంశాలతో వివరాల సేకరణ: శిక్షణలో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని భూరక్షక్లకు వివరించారు. ఇందుకోసం యాప్ను ఉపయోగించే విధానం గురించి అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు, 14 అంశాలతో కూడిన వివరాలను ఆ యాప్లో నమోదు చేయాలని భూరక్షక్లకు సూచించారు. ఈ మేరకు ప్రత్యేక కార్డులు యాప్లోనే రూపొందుతాయని, వీటిని రైతులకు అందజేయడంతో సమస్య నమోదు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. శిక్షణ అనంతరం డాక్టర్ నీలిమ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూరక్షక్లకు శిక్షణనిస్తామని, అన్ని గ్రామాల్లో ధరణి అదాలత్లు నిర్వహించేందుకు షెడ్యూల్ను కూడా త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు. -
విరాసత్ నుంచి నాలా వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ కసరత్తు ప్రారంభించారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను తయారు చేయిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. చిన్నవే కానీ.. సతాయిస్తున్నాయి వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు. కానీ ధరణి పోర్టల్ ఆన్లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకరీతిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్ఏ నవీన్మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడంలోనే అసలు సమస్య వచ్చిందనే నిర్ధారణకు వచ్చి ఆయా సమస్యల నివృత్తి, పరిష్కారానికి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. తన వరకు వస్తున్న దరఖాస్తులు, విజ్ఞప్తులను అధ్యయనం చేయడంతోపాటు సీసీఎల్ఏ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చిన్న సమస్యలు కూడా అగ్నిపరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా పట్టాదారు చనిపోయే సమయం నాటికి ఆ వ్యక్తి పేరిట ఉన్న భూమికి సంబంధించిన రికార్డులపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకపోతే ఆ భూమిని చనిపోయిన పట్టాదారు వారసులకు బదిలీచేసే అవకాశం ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్లో అందుబాటులో లేదు. అలాగే గతంలో నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు) భూములు ఇప్పటికీ ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల విభాగంలోనే కనిపిస్తున్నాయి. ఈ భూములను నాలా కింద మార్పు చేసే ఆప్షన్ కూడా ధరణిలో లేదు. గతంలో కంపెనీలు, ట్రస్టుల పేర్లపై ఉన్న భూముల వివరాలు ధరణిలో సక్రమంగా అప్లోడ్ కాకపోవడంతో వాటి పాసుపుస్తకాలు ఆయా కంపెనీలు, ట్రస్టుల పేరిట రావట్లేదు. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపగా ఇందుకు సంబంధించిన మార్పులు వారం రోజులు లోపే ధరణిలో కనిపించనున్నాయి. మరోవైపు మరికొన్ని సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మిస్సింగ్కు మిత్తల్ ‘మార్కు’ ధరణిలో ఎదురవుతున్న మరో సమస్య మిస్సింగ్ సర్వేనంబర్లు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో కొన్ని సర్వేనంబర్లు మిస్సవడంతో ఈ సర్వే నంబర్లలోని భూముల రైతులు పాసు పుస్తకాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు అందక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణిలో మిస్సింగ్ సర్వేనంబర్ల నమోదు కోసం సీసీఎల్ఏ ప్రత్యేక ఆప్షన్ కల్పించారు. టీఎం–33 కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన సర్వేనంబర్లను పోర్టల్లో సరిచేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్న నేపథ్యంలో రోజుకు 500 చొప్పున దరఖాస్తులను పరిష్కరించేందుకు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. -
బరాబర్ ధరణిని రద్దు చేస్తాం
సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల రూరల్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను బరాబర్ రద్దుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్లో భూసమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులతో మీభూమి– మీహక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ‘ధరణి అదాలత్’గ్రామసభను నిర్వహించింది. ధరణి పోర్టల్లో పేర్లు నమోదుకాక, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను కాంగ్రెస్ నేతలు తెలుసుకున్నారు. తర్వాత వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ కార్డులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, కొప్పుల రాజు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడారు. భూస్వాములు, కేసీఆర్ కుటుంబీకుల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. అందువల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిన 22 లక్షల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీసీఎల్ఏ చేతిలో ధరణి పోర్టల్ లేదని.. ఫిలిప్పీన్స్కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి, వెనక నుంచి కేసీఆర్ కుటుంబీకులు వేలకోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో ‘ధరణి అదాలత్’ ధరణి పేరుతో కేసీఆర్ సర్కారు పేదల భూములను కబళిస్తోందని.. పేదలకు తిరిగి భూహక్కులు కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఏఐసీ సీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దివంగత సీ ఎం వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు భూయాజ మాన్య హక్కులు కల్పించారని.. బీఆర్ఎస్ సర్కారు ఆ భూములను లాక్కుంటోందని జాతీయ నేత కొప్పుల రాజు ఆరోపించారు. కాంగ్రెస్ పంచ సూత్రాలివీ.. ♦ ధరణి పోర్టల్లో 60 లక్షల మంది పేర్లు ఉంటే.. అందులో దాదాపు 20 లక్షల ఖాతాల్లో పేరు, స ర్వే నంబర్తోపాటు చాలా తప్పులున్నాయి. అ న్నీ దిద్ది ఎవరి భూమిపై వారికి హక్కులివ్వాలి. ♦ మేమొచ్చాక రెండేళ్లలో భూముల రీసర్వే. ♦ రాష్ట్రంలోని 125 భూచట్టాలు, 3 వేల జీవోలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే చట్టంగా తీసుకొస్తాం ♦ బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధిస్తాం. భూయజమాని అనుమతి లేకుండా సేకరించవద్దంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచి్చన చట్టాన్ని కచి్చతంగా అమలు చేస్తాం. ♦ తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు పథకాలు అందిస్తాం. కవితను బహిష్కరించలేదేం: రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడితే కొడుకైనా, బిడ్డ అయినా జైలులో పెడతానని కొన్నిరోజుల కింద సీఎం కేసీఆర్ చెప్పారని, మరి మద్యం కుంభకోణానికి పా ల్పడిన ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పద వి నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. ఇద్దరూ ఆడపిల్లలే..పట్టా పాస్బుక్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమిని కేటాయించి లావణి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ధర ణి తెచ్చాక భూమిని ఆ న్లైన్లో నమోదు చేయకపోవడంతో పట్టా దారు పాస్బుక్ ఇవ్వలేదు. నాకు ఇద్దరు ఆడ పిల్లలే. పనిచేస్తేనే పూటగడిచేది. సర్కార్ ఇప్పటికైనా పాస్బుక్ ఇవ్వాలి. – కవ్వంపల్లి జ్యోతి -
కాంగ్రెస్ ‘హామీ కార్డు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు న్న వేళ రాష్ట్ర రైతాంగాన్ని ఆకట్టుకొనే ప్రయత్నా లను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. రైతులకు చుక్కలు చూపుతున్న ధరణి పోర్టల్ సమస్యలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కారం చూపుతామంటూ ఏకంగా ‘హామీ కార్డులు’ జారీ చేస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పైలట్ ప్రా జెక్టు కింద ఈ ‘హామీ కార్డుల’జారీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్య వహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభించిన టీపీసీసీ.. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతోంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఫొటోతో కార్డు..: ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో సమస్యలున్నాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనికి పరిష్కారంలో భాగంగా రైతుల ఫొటోలు, వివరాలతోపాటు ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలను కార్డు ముందు భాగంలో ముద్రిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఈ కార్డులను తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారులకు చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తోంది. ఈ కార్డుల జారీ కంటే ముందు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఐదుగురు ‘భూరక్షక్’లను నియమించాలని పార్టీ నిర్ణయించింది. భూరక్షక్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించి సమస్యల పరిష్కారంపై శిక్షణ ఇప్పించనుంది. వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘ధరణి అదాలత్’లు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల వివరాలు నమోదు చేసుకొని వారికి కార్డులు అందించనున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ నేతృత్వంలోని ఓ బృందం ఈ కార్యాచరణ కోసం కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తోందని, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు, అభిప్రాయాల మేరకు ముందుకెళుతున్నామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మన భూమి–మన హక్కు: జైరాం రమేశ్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధరణి అదాలత్లు నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు. ధరణి పోర్టల్ అంటే ఒకరి స్థానంలో మరొకరి ఫొటో పెట్ట డం కాదని, ఎవరి భూమిపై వారికి హక్కులు కల్పించాలని, మన భూమి–మన హక్కు పేరుతో ఇందుకోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర భూసర్వే చేపడతామని, రైతుల పక్షపాతిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. -
‘ధరణి’ దంగల్! రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’నడుస్తోంది. పోర్టల్ అందుబాటులో వచ్చినప్పటి నుంచి భూసమస్యల తుది పరిష్కార అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టినా.. సదరు పరిష్కార ఉత్తర్వులను మాత్రం తహసీల్దార్ల డిజిటల్ సంతకాలతో జారీ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలకు తమ డిజిటల్ సంతకాలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే తాము బాధ్యులం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయాలి? సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలి? అన్న దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది. నిర్ణయం కలెక్టర్ది.. సంతకం తహసీల్దార్ది ధరణి పోర్టల్లో వివరాల నమోదులో తప్పులతో లక్షల కొద్దీ భూసంబంధిత సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారం కోసం రైతులు ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే.. అది నేరుగా జిల్లా కలెక్టర్/ కలెక్టర్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ లాగిన్కు వెళుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ దరఖాస్తును ఆన్లైన్లోనే తహసీల్దార్కు పంపుతుంది. తహసీల్దార్లు దానిపై విచారణ జరిపి.. ఆన్లైన్, ఆఫ్లైన్లో రెండు నివేదికలు తయారుచేసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. ఆర్డీవో కార్యాలయంలో పరిశీలన తర్వాత దరఖాస్తులు ఆన్లైన్లోనే తిరిగి కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. తహసీల్దార్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఆర్డీవో అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సదరు దరఖాస్తును అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అన్నదానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం బయోమెట్రిక్, డిజిటల్ కీ మాత్రమే కలెక్టర్ది వాడుతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ రావడం లేదు. కేవలం కలెక్టర్లు ఆమోదించినదీ, తిరస్కరించినదీ మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ ధ్రువీకరణపై తహసీల్దార్ డిజిటల్ సంతకం వస్తోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. తహసీల్దార్ విచారణ పూర్తయి నివేదిక పంపాక కూడా పలు దరఖాస్తుల విషయంలో జిల్లాల కలెక్టర్లపై రాజకీయ, ఇతర ఒత్తిడులు వస్తున్నాయి. దీంతో తహసీల్దార్ల నివేదిక ఎలా ఉన్నా కలెక్టర్లు ధ్రువీకరిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 20 శాతానికిపైగా దరఖాస్తుల్లో తహసీల్దార్ల అభిప్రాయానికి, నివేదికకు భిన్నంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అంచనా. ఏదైనా సమస్య వస్తే బాధ్యులెవరు? తమ అభిప్రాయాలకు భిన్నంగా జారీ అయ్యే ధరణి ఉత్తర్వులపై.. తమ డిజిటల్ సంతకాలే ఉండటంపై తహసీల్దార్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ, ఇతర కారణాలతో భూముల ఉత్తర్వులపై ఫిర్యాదులు వస్తే.. సదరు నిర్ణయాలపై తమ సంతకాలు ఉంటాయని, తాము కూడా బాధ్యులం కావాల్సి వస్తుందని తహసీల్దార్లు వాపోతున్నారు. కలెక్టర్లతోపాటు తాము కూడా బదిలీ కావడమో, విచారణ ఎదుర్కోవాల్సి రావడమో జరిగితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా భూసమస్య కోర్టుకు వెళితే అక్కడ తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, లేకుంటే తమపై చర్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో ధరణి ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ల సంతకాలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం సంతకంతో సమస్యలు పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు లేనందున.. భూసమస్యల పరిష్కార విచక్షణాధికారం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతే నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తామని చెప్తున్నారు. ట్రెసాపై ఒత్తిడి ‘ధరణి’సంతకాల విషయమై వారం, పది రోజులుగా రెవెన్యూ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయాలని, లేదంటే కొందరు తహసీల్దార్లు కలిసి పిటిషన్ వేయాలనే అభిప్రాయం ఆ చర్చల్లో వ్యక్తమవుతోంది. కోర్టుకు వెళ్లడం కుదరకపోతే మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ), లోకాయుక్త వంటి సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను బహిరంగంగా ప్రభుత్వానికి తెలియపర్చాలని, ఇందుకోసం జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అవసరమైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు విధుల బహిష్కరణకు పిలుపునివ్వాలని ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)’పై తహసీల్దార్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. -
‘ధరణి’ ఇలా దారిలోకి! రంగంలోకి నవీన్ మిత్తల్
సాక్షి, హైదరాబాద్: సమస్యల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ‘ధరణి’ని దారిలోకి తెచ్చేందుకు కొత్త భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ కసరత్తు మొదలుపెట్టారు. మొదటగా ధరణి సమస్యలపై అధ్యయనం చేయాలని భావించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. రైతులు, రెవెన్యూ వర్గాలు ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మరోవైపు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ధరణి సమస్యలు, పరిష్కారాలపై తయారు చేసిన నివేదికను కొత్త సీసీఎల్ఏకు అందజేయాలని భావి స్తోంది. మొత్తం 25 అంశాలతో రూపొందించిన నివేదికలోని అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా చాలా వరకు ‘ధరణి’సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతోంది. ధరణి పోర్టల్ సమస్యలపై ట్రెసా నివేదికలోని అంశాలివే... –వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారం తర్వాత కూడా తహసీల్దార్/ఆపరేటర్ లాగిన్లకు సమాచారం రావడంలేదు. సదరు దరఖాస్తులు చేసుకున్న సమయంలోనే తహసీల్దార్/ఆపరేటర్ లాగిన్లలో నోటీసు వచ్చేలా ఆప్షన్ ఇవ్వాలి. –ఒక సర్వే నంబర్లోని కొంతభాగం భూమిని గతంలో ఉన్న తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి ఉంటే, ఆ భూమిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే ఆ సర్వే నంబర్లోని అన్ని భూములకూ ప్రస్తుత తహసీల్దార్ డిజిటల్ సంతకం కనిపిస్తోంది. అలాకాకుండా ఏ తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే వారి సంతకమే కనిపించేలా సరిచేయాలి. –తహసీల్దార్ లాగిన్లలో ప్రస్తుత పహణీ/ భూహక్కుల అంతర్గత పుస్తకం/ పాసు పుస్తకాలు కనిపించడంలేదు. దీంతో రికార్డుల పరిశీలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భూసేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకున్న భూములను పరిశీలించే క్రమంలో సమస్యలు వస్తున్నాయి. తహసీల్దార్ లాగిన్లో ప్రస్తుత పహాణీలు, ఆర్వోఆర్ఐబీలు, పాసుపుస్తకాలు అందుబాటులో ఉంచాలి. –ఉన్న భూమి కంటే ఎక్కువ, తక్కువగా రికార్డయిన వివరాలను సరిచేసే ఆప్షన్ ఇవ్వాలి. –రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లకు సర్టిఫైడ్ కాపీలు తీసుకునే అవకాశం ప్రస్తుతం ధరణిలో లేదు. కానీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం సర్టిఫైడ్ కాపీలిస్తున్నారు. వీటి కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నందున మీసేవా ద్వారా వాటిని తీసుకునే అవకాశం కల్పించాలి. –ధరణి ప్రాజెక్టు అందుబాటులోకి రాకముందు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను రద్దు చేసుకునేందుకు, వాటిల్లోని తప్పులను సరిచేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలి. –కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు తహసీల్దార్లు, ఆర్డీవోలు జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలను అమలు చేసే ప్రొవిజన్ ఇవ్వాలి. –వివాదాల్లో ఉన్న ఇనాం భూములను ప్రాసెస్ చేసేందుకు, ఓఆర్సీలు జారీ చేసేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి. –రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మ్యుటేషన్ జరిగేలోపు పట్టాదారుడు చనిపోతే ఆ పట్టాదారువారసులకు మ్యుటేషన్ చేసే అవకాశం ఇవ్వాలి. –అసలైన పట్టాదారులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కొందరు మీసేవా కేంద్రాల ద్వారా పట్టాభూములను నాలా కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో అసలైన పట్టాదారులకు ఇబ్బంది అవుతోంది. అలాంటి థర్డ్ పార్టీ దరఖాస్తులను రద్దు చేసే ఆప్షన్ ఇవ్వాలి. –సిటిజన్ పోర్టల్ ద్వారా భూముల నిర్వహణ, సేల్ సర్టిఫికెట్, ఎక్సే్చంజ్ డీడ్లు చేసుకునే అవకాశం పవర్ ఆఫ్ అటారీ్నలకు ఇవ్వాలి. –ధరణిలో తప్పుగా నమోదై, డిజిటల్ సంతకాలు కాని ఎంట్రీలను తొలగించే ఆప్షన్ ఇవ్వాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లలో పొరపాటున పడిన చిన్న, చిన్న తప్పులను సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలి. – కొన్ని అసైన్డ్ భూముల రికార్డుల్లో భూమి స్వభావాన్ని పొరపాటున పట్టా అని నమోదు చేశారు. ఈ కారణంతో ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ రికార్డులను సరిచేసే ఆప్షన్ టీఎం–33లో కనిపించడం లేదు. దీంతో అసైన్డ్ భూములకు వారసత్వహక్కులు కూడా కల్పించలేకపోతున్నాం. –రెండు ఖాతాలు కలిగిన రైతులు ఒక ఖాతాలో ఆధార్ నమోదు చేసుకోకపోతే మళ్లీ నమోదు చేసుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదు. మీరు నమోదు చేసిన ఆధార్ నంబర్ ఇప్పటికే ఉందని చూపిస్తోంది. ఈ సమస్యను సవరించాలి. –ఆర్డీవో స్థాయిలో ఇప్పటికే ప్రొసిడీంగ్స్ వచ్చిన భూములకు వ్యవసాయ కేటగిరీ నుంచి నాలా కేటగిరీకి మార్చుకునే అవకాశం కల్పించాలి. –వీలునామాలను అమలు పరిచే ఆప్షన్ ఇవ్వాలి. -
ఓ ధరణి.. ఎన్నో సమస్యలు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో తవ్వే కొద్దీ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. భూవిస్తీర్ణంలో మార్పులకు అవకాశం ఇవ్వకపోవడం, కొత్త పహాణీలు అందుబాటులో లేకపోవడం, ఏజీపీఏలను పరిగణనలోకి తీసుకోక పోవడం వంటి పలు సమస్యలు బయటపడుతున్నాయి. ఇటీవల భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా బాధ్యతలు చేపట్టిన నవీన్మిత్తల్.. రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యల్లో ప్రధానమైన ధరణి పోర్టల్ను సులభతరం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న కీలక సమస్యలను గుర్తించి పరిష్కరించే క్రమంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి అక్కడి రెవెన్యూ యంత్రాంగంతో గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లాలోని అందరు తహసీల్దార్లతో సమావేశమై ప్రధానంగా ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి గల అవకాశాలను గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కార లాగిన్ జిల్లా కలెక్టర్లకు కాకుండా తహసీల్దార్లకు ఇవ్వాలని కొందరు సూచించినట్టు తెలిసింది. ధరణిలో అటు రైతులకు, ఇటు రెవెన్యూ యంత్రాంగానికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపై యాదాద్రి జిల్లా యంత్రాంగం ఓ నివేదికను కూడా మిత్తల్కు అందజేసింది. కాగా ‘పైలట్’తరహాలో యాదాద్రికి వచ్చిన మిత్తల్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రెవెన్యూ అధికారులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. తాజా అధ్యయనంలో వెల్లడైన కీలక సమస్యలివే.. ఒక రైతుకు వాస్తవానికి ఎకరం భూమి ఉంటే ధరణి రికార్డుల్లో రెండు ఎకరాలుగా పొరపాటుగా నమోదైంది. ఈ పొరపాటును సవరించే/తొలగించే ఆప్షన్ ధరణి పోర్టల్లో అందుబాటులో లేదు. గతంలో కొందరు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసుకున్నారు. ఈ భూములకు నాలా ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయి. కానీ కొన్నిచోట్ల అవి వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో సదరు రైతులు/సంస్థలు/పరిశ్రమలు తమ భూముల మారి్పడి కోసం ధరణిలోని 33 మాడ్యూల్ కింద మిస్సింగ్ సర్వే నంబర్ల కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్ లాగిన్లో పరిష్కరించిన తర్వాత కూడా అవి వ్యవసాయ భూములుగానే కనబడుతున్నాయి. కొన్ని భూములకు ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజీపీఏ)లు ధరణిలో ప్రాసెస్ కావడం లేదు. వీటిని ప్రాసెస్ చేసేందుకు పట్టాదారు బయోమెట్రిక్ వివరాలను ధరణి పోర్టల్ అడుగుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు అసలు పట్టాదారుకు కాకుండా థర్డ్ పారీ్టలు కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఒక సర్వే నంబర్లో థర్డ్ పార్టీలు (పట్టాదారుకు తెలియకుండా) దరఖాస్తు చేసుకుని ఉంటే.. అసలు పట్టాదారు లేదా ఆ సర్వే నంబర్లోని మరో పట్టాదారు దరఖాస్తు చేసుకునేందుకు ధరణి అనుమతించడం లేదు. ఇప్పటికే దరఖాస్తు పెండింగ్లో ఉందని చెబుతోంది. ఈ విషయంలో థర్డ్ పార్టీలను నియంత్రించే పద్ధతి తీసుకురావాలి. ధరణి పోర్టల్లో తాజా పహాణీలు అందుబాటులో లేవు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్ల లాగిన్లలో కొత్త పహాణీలు అందుబాటులో ఉంచాలి. కొందరు రైతులు తమ భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. అలాంటి మారి్టగేజ్ భూములకు డూప్లికేట్ పాసు పుస్తకాలు తీసుకుని సేల్డీడ్లు చేసుకునే వెసులుబాటును తొలగించాలి. ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులకు సంబంధించిన వివరాలను పొరపాటుగా నమోదు చేస్తే, దరఖాస్తు పూర్తయిన తర్వాత మళ్లీ ఆ వివరాలను సవరించుకునే అవకాశం లేదు. వారసత్వ హక్కులు (పౌతీ) కల్పించే క్రమంలో ఈ–పాసు పుస్తకాలు వస్తున్నాయి కానీ, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు పౌతీ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు. ధరణి పోర్టల్లో ఆధునీకరించిన లేదా సవరించిన వివరాలు అందుబాటులో లేవు. సదరు రైతుకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం (సర్వే నంబర్, ఖాతా, విస్తీర్ణం లాంటి వివరాలు) అందుబాటులో ఉంచాలి. గతంలో ఆర్డీవోలు జారీ చేసిన నాలా ప్రొసీడింగ్స్ను అప్డేట్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. గతంలో జారీ చేసిన 13–బి, 38ఈ సర్టిఫికెట్ల అప్డేషన్కు కూడా ఆప్షన్ తీసుకురావాలి. క్రయ విక్రయ లావాదేవీల కోసం బుక్ చేసిన స్లాట్లను అనివార్య పరిస్థితుల్లో రద్దు చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. -
ధరణిని ప్రక్షాళన చేయండి
సాక్షి, హైదరాబాద్: అనేక సమస్యలు సృష్టిస్తున్న ధరణిలో మార్పులు తీసుకురావాలని బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్రావు ప్రభుత్వానికి సూచించారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ పాత అసైన్డ్ భూములు, సాదా బైనామా ద్వారా కొన్న భూములు ధరణిలో నమోదు కావడం లేదని వివరించారు. వాటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిషేధిత భూములుగా ధరణి చూపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులపై ఆయన మాట్లాడుతూ, లక్షల్లో పెరిగిన అనాథ పిల్లల కోసం బడ్జెట్లో నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల ప్రస్తావన తెచ్చిన రఘునందన్.. అవి తమ పార్టీ చేపట్టినవిగా పేర్కొనడం సభలో వివాదం రేపింది. ఇది అప్రస్తుత ప్రసంగమంటూ మండిపడ్డ అధికార పక్ష సభ్యులు, పేరున్న పాఠశాలలకూ మతం రంగు పులమడం సరికాదని సూచించారు. -
రైతులకు మేలు చేసేందుకే ధరణి
సాక్షి, హైదరాబాద్: వివాదాల్లేకుండా, భూ రికార్డులను భద్రపర్చి రైతులకు మేలు చేసేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ధరణిలో భూమి నమోదు కాలేదని ఇప్పటివరకూ 13 లక్షల ఫిర్యాదులొస్తే 12 లక్షలు పరిష్కరించినట్టు చెప్పారు. రైతుకు తన భూమిపై పూర్తి హక్కు కల్పించే ధరణిని విపక్షాలు అడ్డుకోవడం విడ్డూరమన్నారు. గురువారం శాసనసభలో పలు పద్దులపై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. పైరవీకారుల రాజ్యాన్ని తెచ్చేందుకే.. రైతులను పీడించే పైరవీకారుల రాజ్యాన్ని మళ్ళీ తెచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ ధరణిని వ్యతిరేకిస్తోందని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సాదా బైనామా ద్వారా భూమి రికార్డుల్లోకి ఎక్కించేందుకు 2016లోనే కాకుండా 2020లోనూ అవకాశం కల్పించామని, ఈ దశలోనే కోర్టు కేసు వల్ల ఇది ఆగిపోయిందన్నారు. ఈ రెండేళ్లలో ధరణి ద్వారా 24 లక్షల లావాదేవీలు జరిగాయని, కేవలం 15 నిమిషాల్లోనే లావాదేవీ పూర్తవుతోందని తెలిపారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఇవ్వడం వల్ల, ప్రతి గ్రామంలోనూ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయడం వల్ల సమస్యలు తగ్గుతున్నాయని చెప్పారు. 58, 92 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ 125 గజాలున్న 1.25 లక్షల మంది పేదలకు 58 జీవో ద్వారా ఇళ్ళ జాగాలను క్రమబద్దీకరించామని, ఇళ్ళు కట్టుకున్న 36 వేల మంది పేదలకు 59 జీవో ద్వారా క్రమబద్ధీకరణ చేశామని ప్రశాంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో భవంతులు ఉన్న 44 కాలనీల్లో రెగ్యులైజేషన్ చేపట్టి, యజమానుల్లో ఆందోళన తగ్గించామని చెప్పారు. 2.92 లక్షల మందికి డబుల్ బెడ్రూ ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో 1.38 లక్షలు పూర్తి చేశామని, మరో 45 వేలు 90 శాతం పూర్తయ్యాయని, 35 వేలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ పథకానికి రూ. 11,639 కోట్లు ఖర్చవుతుంటే కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1,311 కోట్లు మాత్రమేనన్నారు. వక్ఫ్ భూములు పరిరక్షిస్తాం ఆదాయంలో రిజిస్ట్రేషన్ల శాఖ 3వ స్థానంలో ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన న్యాయపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నామని, గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్డు, మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్డు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. -
‘ధరణి కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయింది’
హైదరాబాద్: బీఆర్ఎస్ భూకబ్జాల ప్రభుత్వమని ధ్వజమెత్తారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి 50 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. తనకు గుంట భూమి లేదంటున్న మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్కు మియాపూర్లో 500 ఎకరాల భూమి ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. తనకు భూమి లేదంటున్న కవిత.. చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. తెల్లాపూర్లోని కేటీఆర్ భూకబ్జాలు త్వరలోనే బయటపెడతానని రేవంత్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని, ధరణి పోర్టల్ అనేది పెద్ద కుంభకోణమన్నారు. ధరణి కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వ భూములను కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. తాను భూకబ్జాలు చేసి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండని రేవంత్ ఛాలెంజ్ చేశారు. -
ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు?.. బండి సంజయ్ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నలుగురు కలెక్టర్లపై డీవోపీటీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, అడ్డగోలుగా దోచుకుంటున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘సీఎం కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం త్వరలో బయటపెతాం. ఆ నలుగురు కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాం. ఆ కలెక్టర్లకే అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ నివేదిక బయటపడితే మిగతా కలెక్టర్లు తలదించుకుంటారు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, కలెక్టర్లకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలను బండి సంజయ్ ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ నలుగురు కలెక్టరు ఎవరై ఉంటారని వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. చదవండి: మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంపై హరీష్ రావు ఫైర్ -
‘ధరణి’కి ఎప్పట్లోగా పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటిలోగా ప్రభుత్వం పరిష్కరిస్తుందో సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ధరణిలో 25 లక్షల మంది రైతులు దరఖాస్తులు పెట్టుకొని, తమ సమస్యలను గురించి ఎక్కడ చెప్పాలో తెలీక ఇబ్బందులు పడ్డారన్నారు. ధరణితో తలెత్తిన సాంకేతిక సమస్యలతో తమ భూములకు రైతుబంధు రాక పలువురు ఆత్మహత్యలకు పాల్పడితే, బీఆర్ఎస్ నేతలు సమస్యలను తేలిక చేసి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉప సంఘం రిపోర్టు ఇచ్చినా కూడా భూముల సమస్యకు పరిష్కారం దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్ సమాధానం తరువాత ఈటల మాట్లాడుతూ, రింగ్ రోడ్డు చుట్టుపక్కల దాదాపు 60 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను లబ్ధిదారులకు కేవలం 300 గజాలు ఇచ్చి లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములను ఇవ్వాలి కానీ గుంజుకునే ప్రయత్నం చేయొద్దని, ఈ విధంగా దళితుల కళ్లలో మట్టికొడుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రే అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని ఈటల గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ తన వాగ్ధాటితో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చి, వాటిని ఇతరులపైకి విజయవంతంగా నెట్టివేశారని వ్యాఖ్యానించారు. ప్రధాని, కేంద్రాన్ని లక్ష్యంగా విమర్శలు చేసిన కేటీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నులతో మాత్రమే నడుస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో పెట్రో ధరలు పెరిగాయని చెబుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్పై 35.2 శాతం పన్ను వేయడం లేదా అని ఈటల ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తున్నా ఇక్కడెందుకు తగ్గించలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు పదవులు శాశ్వతం కాదని, ప్రజల గొంతునొక్కిన వారు కాలగర్భంలో కలిసిపోతారని ఈటల ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ తన వాగ్ధాటితో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారని, ఇవన్నీ నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీలను కూడా మాట్లాడించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. -
ధరణిపై దండుగా కదలాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో భూములు రీ సర్వే చేస్తేనే ధరణి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో శనివారం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్), గ్రామీణ న్యాయపీఠం సంస్థ, తెలంగాణ సోషల్మీడియా ఫోరం, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కలెక్టరేట్ వరకు తీసుకుపోయిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో గవర్నర్ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాసపత్రిక సంపాదకులు వి.లచ్చిరెడ్డి, సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, కిసాన్సెల్ నాయకులు కోదండరెడ్డి, బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ధరణితో విప్లవాత్మక మార్పు
సాక్షి, కామారెడ్డి: భూముల రికార్డులను భద్రపరిచి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రూపొందించిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ధరణిలో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన ‘డోంగ్లీ’మండలాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ధరణితో తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడం, పాసుపుస్తకాలు ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, త్వరితగతిన పనులు జరగడానికి ధరణి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇక్కడ అమలవుతున్న ధరణి పోర్టల్ విధానాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు ధరణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పథకాలను చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నపుడు ఏ ఊరికీ సరైన రోడ్లు లేవని, తాగునీరు దొరికేది కాదని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తారురోడ్లు నిర్మించామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందిస్తున్నామని, 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని గ్రామాల ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామని అంటున్నారని తెలిపారు. సభలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జెడ్పీ చైర్పర్సన్ దఫెదార్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారికి మంత్రి నివాళి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పిట్లం మండ ల కేంద్రంలో ఆయన చిత్రపటానికి మంత్రి హరీశ్రావు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని కొనియాడారు. ఓర్వలేక నిధులు నిలిపేసిన కేంద్రం: హరీశ్ తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మెరుగైన పాలనను టీఆర్ఎస్ అందజేస్తుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నిజాంపేట్ మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 97 వేల ఉద్యోగాల భర్తీకి నోటి ఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని, అయితేఈ మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందన్నారు. మంత్రిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం.. పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాల్లో పర్యటించిన సందర్భంగా మంత్రి హరీశ్రావును అడ్డుకునేందుకు బీజేపీ, బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
ధరణిని ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ పనితీరుపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారంతోపాటు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుని అధికారికంగా పార్టీ వైఖరిని వెల్లడించాలని భావిస్తోంది. తద్వరా వరంగల్ డిక్లరేషన్కు అనుగుణంగా ముందుకెళ్లే దిశగా కార్యాచరణ మరింత ఉధృతం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, మల్లురవి, ధరణి కమిటీ సభ్యులు హర్కర వేణుగోపాల్, ఈరవత్రి అనిల్, చెరుకు సుధాకర్, ప్రీతం తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశమైన వీరు ధరణి పోర్టల్ వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కొనసాగించాలా లేదా కొత్త పద్ధతిలో తీసుకెళ్లాలా అనే దానిపై చర్చించారు. దీనిపై మండలానికి ఐదుగురిని నియమించి వారితో డేటా సేకరించాలని, ఆ తర్వాత 3వేల మందితో సమావేశం నిర్వహించి అందులో వెల్లడైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. మాది తోడికోడళ్ల పంచాయితీ: రేవంత్, జగ్గారెడ్డి ధరణిపై సీఎల్పీలో జరిగిన సమావేశానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తమది తోడికోడళ్ల పంచాయతీ అని, పొద్దున తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతామని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి.. రేవంత్రెడ్డిని ఆ పదవి నుంచి దింపి పీసీసీ అధ్యక్షుడు కావాలన్నది తన అభిమతం కాదని స్పష్టంచేశారు. ఆయన దిగిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు. నాపై కుట్రలు కొత్త కాదు: దామోదర నేను ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజిని ఎప్పుడూ కలవలేదు. ఎవరో కావాలని తనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు నాకు కొత్తకాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి. కవిత, సంతోష్ను అరెస్టు చేయాలి: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నేరస్తులేనని... వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోశ్ను ముందుపెట్టి తెలంగాణలోని వివిధ పార్టీల నేతలను కొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఒక స్కీం అని, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం ఒక స్కాం అని అన్నారు. -
Dharani Portal: సమస్యల్లేని ‘ధరణి’! పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిషేధిత భూముల జాబితాలో చేర్చిన పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ఇప్పటికే సుమోటోగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకెళుతోంది. అందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు లేదంటే జనవరి నెలలో గ్రామాలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో రూపొందిస్తూనే.. జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే గ్రామస్థాయి కార్యాచరణపై సమాచారం అందించింది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ను ఖరారు చేయనుంది. జూలైలోనే అనుకున్నా... ధరణి గ్రీవెన్సులు అధికారికంగానే 10లక్షలు దాటిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూలై5న ప్రకటించారు. జూలై15 కల్లా వీటిని పూర్తి చేయాలని చెప్పినప్పటికీ అప్పట్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సాధ్యం కాలేదు. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత దసరా అనంతరం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, గ్రామస్థాయికి వెళ్లి ధరణి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రతిపాదన కూడా అమలు కాలేదు. అయితే, ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సీసీఎల్ఏ వేదికగా నిషేధిత జాబితాను ప్రక్షాళన చేసే ప్రయత్నం జరిగింది. దీంతో మళ్లీ గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆరేడు వారాల్లో... దశల వారీగా గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే కొత్త తలనొప్పులు వస్తాయేమోననే భయం రెవెన్యూ యంత్రాంగాన్ని వేధిస్తోంది. ఇప్పటికే ధరణి సమస్యలు ప్రతి గ్రా మంలో 150వరకు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖకు సిబ్బంది కూడా తగినంతమంది లేరు. దీంతో ఒకేసారి అన్ని గ్రామాలకు వెళ్లకుండా దశల వారీగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 7–10 వారాల పాటు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల నేతృత్వంలో రెండు బృందాలు ఏర్పాటు చేయాలని, ఆ బృందాలు రెండు గ్రామాలకు వెళ్లి వారంలో 2 రోజుల పాటు ధరణి సమస్యలపై దరఖాస్తులు తీసుకోవాలని, మిగిలిన నాలు గు రోజులు వాటి పరిష్కార ప్రక్రియ చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇలా సదరు మండలంలో అన్ని గ్రామాలు పూర్తయ్యేంతవరకు కార్యక్రమా న్ని కొనసాగించనుంది. ఇలా చేస్తే ఆరేడు వారాల్లో ప్రతి మండలంలో అన్ని గ్రామాలు పూర్తవుతాయని, కొన్ని మండలాల్లో 10 వారాల వరకు వెళ్లినా మొత్తంగా 7–10 వారాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయని సర్కారు భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్న ప్రభుత్వ వర్గాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లనున్నాయి. ఈ నేప థ్యంలో త్వరలో సీఎం సమక్షంలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ధరణి సమస్యల పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. -
రైతు పోరుతో ప్రజల్లోకి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ను ఎదుర్కొని నిలబడాలంటే ఉద్యమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు రైతు పోరుబాటను చేపట్టనుంది. ముఖ్యంగా రుణమాఫీ జరగని అన్నదాతలు, ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పోడు భూములు సాగుచేసుకుంటూ హక్కుల కోసం పోరాడే ఆదివాసీ, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో మద్దతును, సానుభూతిని పొందాలని భావి స్తోంది. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళనలను నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించింది. మండల స్థాయిలో ఈనెల 24న జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు నవంబర్ 30న నియోజకవర్గస్థాయి నిరసనలు, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతు పక్షాన ఉద్యమించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు అంశాలను పట్టించుకుంటుందని, టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల సమయంలోనే రైతులకు తాయిలాలు ప్రకటిస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైతుల పక్షాన ఆందోళనలు ముగిసిన తర్వాత బీసీల సమస్యలపై ఉద్యమించే ప్రణాళికలను కూడా కాంగ్రెస్ పెద్దలు సిద్ధం చేస్తున్నారు. ఆందోళనల కోసం జిల్లాల వారీ ఇన్చార్జులు వీరే.. మహేశ్కుమార్గౌడ్ (ఆదిలాబాద్), కె. ప్రేంసాగర్రావు (మంచిర్యాల), ఏలేటి మహేశ్వర్రెడ్డి (నిర్మల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), జీవన్రెడ్డి (జగిత్యాల), జి. నిరంజన్ (పెద్దపల్లి), వి. హనుమంతరావు (సిరిసిల్ల), పి. సుదర్శన్రెడ్డి (నిజామాబాద్), షబ్బీర్అలీ, సురేశ్ షెట్కార్ ( కామారెడ్డి), సిరిసిల్ల రాజయ్య (వరంగల్), కొండా సురేఖ (హన్మకొండ), డి. శ్రీధర్బాబు (భూపాలపల్లి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి. జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (మెదక్), జె. గీతారెడ్డి (సిద్దిపేట). -
ధరణితోనే సమస్యలు
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు. భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధరణిలో మరో లొల్లి!.. దశాదిశ లేని ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ధరణిలో పొరపాటున నిషేధిత జాబితా చేర్చిన పట్టా భూములను తొలగించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చేపట్టిన కసరత్తుపై విమర్శలు వస్తున్నాయి. సరైన రికార్డులు, క్షుణ్ణమైన పరిశీలన లేకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్ఏ ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందులో అసైన్డ్, కోర్టు కేసుల్లో ఉన్న భూములూ ఉంటున్నాయని తహసీల్దార్లు చెప్తున్నారు. అది కూడా మౌఖిక ఆదేశాలే ఇస్తున్నారని.. దీనివల్ల భవిష్యత్తులో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా, తప్పుల తడకగా పరిష్కరించడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. రికార్డుల ప్రకారం రాష్ట్రంలో నిషేధిత భూముల సర్వే బైనంబర్లు 7లక్షల వరకు ఉన్నట్టు రెవెన్యూ వర్గాల అంచనా. అయితే ధరణి పోర్టల్లో నమోదు సమయంలో తప్పుల వల్ల వాటి సంఖ్య 20లక్షల వరకు చేరింది. రెండేళ్లు గడిచినా ఈ రికార్డులను సరిచేయడంలో పురోగతి లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ క్రమంలో తామే సుమోటోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని సీసీఎల్ఏ ముందుకొచ్చింది. నిషేధిత జాబితా నుంచి తొలగించాలో, లేదో నిర్ణయించాలంటూ 5,14,833 సర్వే బైనంబర్లను రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు పంపింది. ఇందులో 3,12,976 సర్వే బైనంబర్లను పరిశీలించిన స్థానిక రెవెన్యూ యంత్రాంగం కేవలం 85,132 (27.2 శాతం) నంబర్లలోని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, 2,27,843 (72.8 శాతం) నంబర్లలోని భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది. కలెక్టర్లకు ‘హైదరాబాద్’ పిలుపు నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగించే ప్రక్రియపై తుది నిర్ణయం పేరుతో కలెక్టర్లను హైదరాబాద్ రావాలని సీసీఎల్ఏ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వారం రోజులుగా కలెక్టర్లతోపాటు సదరు జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, తహసీల్ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉన్న రికార్డులతో సీసీఎల్ఏ కార్యాలయానికి వస్తున్నారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సర్వే బైనంబర్లలో ఎన్ని పరిష్కారమయ్యాయి? పరిష్కారమైన వాటిలో ఎన్ని నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు? ఎన్ని నంబర్లను కొనసాగించారనే వివరాలను, వాటికి కారణాలను సీసీఎల్ఏ వర్గాలకు వివరిస్తున్నారు. ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి యంత్రాంగం చెప్పిన కారణాలను వినకుండా.. అసైన్డ్ భూమి అయినప్పటికీ 20 ఏళ్లుగా పట్టాభూమి అని రాసి ఉందిగనుక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లాల యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నారాయణపేట జిల్లాలకు చెందిన కసరత్తు పూర్తికాగా.. నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు చెందిన అధికారులు ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న యంత్రాంగానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మొత్తం మీద ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని క్షేత్రస్థాయిలో నిర్ణయించిన వాటిలో నుంచి కనీసం 30 శాతం సర్వే బైనంబర్లను తొలగించడమే లక్ష్యంగా సీసీఎల్ఏ కార్యాలయంలో కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. అన్నీ మౌఖిక ఆదేశాలే.. వాస్తవానికి భూరికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం మండల తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. కానీ ధరణి పోర్టల్ తర్వాత జిల్లా కలెక్టర్లు భూసమస్యలను పరిష్కరిస్తున్నారు. కానీ ఆయా పరిష్కార పత్రాలపై ఉండేది తహసీల్దార్ల డిజిటల్ సంతకాలే. దీనివల్ల కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా కోర్టులకు వెళితే తహసీల్దార్లే బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా జరుగుతున్న కసరత్తు మరీ ఘోరంగా ఉందని తహసీల్దార్లు వాపోతున్నారు. తమకు కేటాయించిన సర్వే బైనంబర్లలోని భూముల రికార్డులను పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా, వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటున్నామని.. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి లిఖితపూర్వక మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయానికి పిలిపించి కూడా ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా.. కేవలం మౌఖికంగా ఫలానా సర్వేబై¯ð నంబర్లోని భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని వివరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ముప్పు తెచ్చి పెడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించారా, లేదా?.. తెలిసేదెలా? ఎవరైనా రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్నది సదరు రైతులకు తెలియడం లేదు. చాలా మంది రైతులకు తెలియకుండానే వారి భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. అంతేగాకుండా సుమోటోగా తీసుకున్న 5 లక్షలకుపైగా సర్వే నంబర్లు మినహా ఇతర సర్వే నంబర్లలోని భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తొలగించాలని రైతు దరఖాస్తు చేసుకుంటే.. ధరణి పోర్టల్లో ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా ఇప్పుడు తొలగించారు. దీంతో తమ భూమి నిషేధిత జాబితాలో ఉందా, తొలగించారా? తమ దరఖాస్తును ఏం చేశారు? అసలు పరిష్కరిస్తారా లేదా? అన్న విషయాల్లో రైతులకు ఎలాంటి స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. చదవండి: మీ వెనుక ఎవరున్నారు?