రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
తాండూరు సబ్ కలెక్టర్
ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు రూరల్: రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలు పెండింగ్లో ఉంచరాదని అన్నారు. మహబూబ్నగర్ – చించోళి నేషనల్ హైవే పనుల్లో భాగంగా పాత తాండూరు మీదగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు సంబంధించి రైతుల పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. రోజువారి భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెతావత్ తారాసింగ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment