
అలరించిన ఒగ్గు కళా ప్రదర్శన
బొంరాస్పేట: మండల పరిధిలోని నాందర్పూర్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు నిర్వహించిన శ్రీమల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ఒగ్గు బీరప్ప డోలు కళాబృందంతో నిర్వహించిన ప్రదర్శన, కథ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో తాలూకా యాదవసంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్ యాదవ్, కురుమ సంఘం నాయకులు మహేశ్, అన్నయ్య, పాండు, నర్సింలు, పుర్ర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment