భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు

Mar 17 2025 9:30 AM | Updated on Mar 17 2025 9:30 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని శ్రీనిరంజన మఠంలో ఆదివారం వీరశైవ సమాజం భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మఠం మల్లికార్జునస్వామి, గడ్డం చంద్రశేఖర్‌స్వామి, మఠం విజయకుమార స్వామిలు వీరశైవ సమాజం సభ్యులచే ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, సుగంధ ద్రవ్యాలతో బసవలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా నమక చమక అధ్యాయాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బిల్వాష్టకం, శివాష్టకం, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. దూప, దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్‌ సిద్ధలింగ మహాస్వామి వారికి వీరశైవ సమాజం భక్తులు పాదపూజ చేశారు. నిరంజన మఠంలో బసవలింగేశ్వర స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ ముందు భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తూ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌ గురునాథ్‌రెడ్డి శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతులు శ్రీజగద్గురు డాక్టర్‌ సిద్ధలింగ మహాస్వామివారు రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌ గురునాథ్‌రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయ భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్దన్‌, సమా జం సభ్యులు బిఆర్‌ విజయకుమార్‌, గంతల సంఘమేశ్వర్‌, బాలప్రకాశ్‌, తారాపురం రవి, గంటి సర్వేష్‌, రాకేష్‌, నాగభూషణం పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరశైవ సమాజం భక్తులు

స్వామివారి సేవలో పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి

భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు 1
1/1

భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement