దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్‌

Published Wed, Apr 9 2025 7:34 AM | Last Updated on Wed, Apr 9 2025 7:34 AM

దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్‌

దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్‌

అనంతగిరి: కరీంపూర్‌ గ్రామంలో అమాయకులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు అనిల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కరీంపూర్‌ గ్రామస్తులు మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పలువురు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఆజాం ఆయన అనుచరులు అకారణంగా తమపై దాడి చేశారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చిన స్థానిక పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటి వరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో శాంతియుత వాతవరణం కల్పించాలని కోరారు.

ఎస్పీ కార్యాలయం ఎదుట కరీంపూర్‌ గ్రామస్తుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement