9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా | - | Sakshi
Sakshi News home page

9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా

Published Thu, Feb 20 2025 8:04 AM | Last Updated on Thu, Feb 20 2025 8:02 AM

9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా

9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా

వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌

తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న డ్రైవ్‌ ప్రారంభం కాగా.. ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పరిశీలన, టికెట్‌ తనిఖీలు చేపడుతున్నారు. సరైన టికెట్‌ లేకుండా రిజర్వేషన్‌, దివ్యాంగ, మహిళల బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 18 వరకు కమర్షియల్‌ సిబ్బంది 9,300 కేసులు నమోదు చేసి, రూ.46 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ నెల 28వ వరకు తనిఖీలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement