అల్లిపురం: గాజువాకకు చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుడిని క్రికెట్ బెట్టింగ్ ఊబిలో దింపి, అతని దగ్గర నుంచి డబ్బులు కాజేసిన విజయనగరానికి చెందిన ముఠాలోని ఇద్దరు క్రికెట్ బుకీలను సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నిందితుల ద్వారా త్వరలోనే మరింత మందిని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలకు ఆశ చూపించి లక్షలు కొల్లగొడుతున్నారని, అటువంటి వాటి జోలికి ప్రజలు వెళ్లకూడదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment