పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.
వ్యక్తి అరెస్ట్
గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment