సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడానికి తీసుకురానున్న కుంకి ఏనుగుల నివాసానికి అసరమైన స్థల ఏర్పాట్లను రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట కొండ ప్రాంతంలో కుంకి ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన స్థావరాలను ఆమె తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడు ఏనుగుల గుంపు, పాలకొండ నియోజకవర్గంలో నాలుగు ఏనుగుల గుంపు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా కుంకి ఏనుగులను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment