చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment