జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన వద్దు

Published Thu, Feb 20 2025 12:35 AM | Last Updated on Thu, Feb 20 2025 12:33 AM

జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన వద్దు

జీబీఎస్‌ వ్యాధిపై ఆందోళన వద్దు

విజయనగరం ఫోర్ట్‌: గులియన్‌ బర్రీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ, కట్టడిచేయడానికి అవసరమైన ల్యాబ్‌లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాగునీటి పథకాలను షెడ్యూల్‌ ప్రకారం క్లోరినేషన్‌ చేయాలని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. జీవన రాణి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంబంగి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు బలహీన పడడం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి 80 శాతం మందికి సహజంగానే తగ్గిపోతుందన్నారు. 15 శాతం మందికి చికిత్స అవసరమని, కేవలం 5 శాతం మందికి మాత్రమే పరిస్థితి విషమంగా మారుతుందన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి సీఈఓ ఆర్‌.వెంకటరామన్‌, డీపీఓ టి.వెంకటేశ్వరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత, మున్సిపల్‌ కమిషనర్‌ పి.నల్లనయ్య, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement