పీఆర్ ఏఈ రమేశ్కుమార్ సస్పెన్షన్
సంగెం: మండలంలో పీఆర్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న కంకణాల రమేశ్కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ వి.కనకరత్నం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. ఈనెల 10న మండలంలోని కుంటపల్లి గ్రామంలో ఓ ఇంటి అనుమతి కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న విషయం విదితమే. 10వ తేదీ నుంచి 48 గంటలకు మించి నేరానికి సంబంధించి నిర్బంధంలో ఉన్నందుకు ఏఈని సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఒకరి అరెస్ట్
వరంగల్: ప్రభుత్వ భూముల్లో చేసిన ప్లాట్లను విక్రయిస్తూ.. అక్రమంగా వసూళ్లకు పాల్ప డుతూ.. ఇవ్వని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు వరంగల్ కాశిబు గ్గ వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంతేజార్గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ షుకుర్ మాట్లాడుతూ.. దేశాయిపేట శివారు ఎంహెచ్నగర్లోని ప్రభుత్వ భూముల్లో సీపీఎం పేరుతో గుడిసెలు వేసి వాటిని ఆధీనంలోకి తీసుకుని అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి నుంచి డబ్బులు తీసుకుంటూ, ఒకటే ప్లాట్ను ఇద్దరు, ముగ్గురికి అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. అడ్వాన్సులు ఇచ్చి ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే అదనంగా ఎక్కువ మొత్తంలో డబ్బులిస్తేనే ఆప్లాట్ను అప్పగిస్తానని మోసం చేస్తున్నాడని, డబ్బులు తీసుకున్న విషయం ఎవరికై నా చెబితే వారిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. గురువారం (20వ తేదీ)న బాధితులు నగరానికి చెందిన శిరీష, రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు షుకుర్ తెలిపారు. కాగా.. విచారణ అనంతరం దుబ్బ శ్రీనివాస్ తనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చేరినట్లు తెలిసింది. ఈవిషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
రేపటి నుంచి
నాటికల పోటీలు
నయీంనగర్: కాళోజీ కళాక్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటిక సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment