అంతెత్తున ఎగసి..
● దేవాదుల పైప్లైన్ లీకేజీ..
వేలేరు: మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధి కుమ్మరిగూడెం శివారులో శుక్రవారం దేవాదుల పైప్లైన్ గేట్ వాల్వ్ లీకయ్యింది. దీంతో పైప్లైన్ నుంచి 40 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. ధర్మసాగర్ పంప్హౌజ్ నుంచి గండిరామారానికి నీటిని తరలించే క్రమంలో శుక్రవారం ఉదయం పైప్లైన్ లీకవడంతో నీరు భారీగా వృథాగా పోయింది. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామరావు గమనించి పైప్లైన్ లీకేజీ విషయాన్ని కలెక్టర్, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment