
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
● పోటాపోటీగా ప్రధాని మోదీ, రేవంత్రెడ్డి
ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు
● బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్యతోపులాట
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అని ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. పోలీ సులు చేరుకుని ఇరువర్గాలను పంపించి ఎయిర్పోర్ట్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment