ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. ఈఏడాది జనవరి 2025 నుంచి 44 రోజులకుగాను.. హుండీల్లో రూ.42,64,669, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా.. రూ.1,35,94,297లు రాగా.. మొత్తం రూ.1,78,58,966ల నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు పి.రమేశ్, శ్రీనివాస్, ప్రశాంత్, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, రాములు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment