పడిపోతున్న భూగర్భ జలం | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న భూగర్భ జలం

Published Sun, Mar 2 2025 1:46 AM | Last Updated on Sun, Mar 2 2025 1:46 AM

-

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు నవంబర్‌ నుంచి క్రమేపీ తగ్గుతున్నాయి. సెప్టెంబర్‌ చివరన 2.94 మీటర్ల లోతులో ఉండగా నవంబర్‌ 4.16, డిసెంబర్‌ 4.81, జనవరి 5.93, ఫిబ్రవరి చివరన 6.30 మీటర్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్‌ తర్వాత వర్షాలు లేవు. నవంబర్‌ నుంచి యాసంగి వ్యవసాయ పనులు మొదలయ్యాయి. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,77,437 ఎకరాల్లో సాగు చేయగా.. ఇందులో వరి 1,19,270 ఎకరాలు, మొక్కజొన్న 57,498, వేరుశనగ 473, పొగాకు 62, కంది 35, మినుము 24, మిగతా పంటలు సింగిల్‌ డిజిట్‌లో సాగయ్యాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీనికితోడు జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. దీంతో భూగర్భ జలమట్టం పడిపోతున్నది. గత ఏడాది ఫిబ్రవరి చివరన జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.30 మీటర్లకు పడిపోయింది. అత్యధికంగా ఐనవోలులో 21.76 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 12.50 మీటర్లకు పడిపోయింది.

మండలాల వారీగా..

భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో 5.51 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్‌ 9.54, కొత్తపల్లి 8.56, వంగర 9.45, ధర్మసాగర్‌ మండలం ధర్మాపూర్‌ 3.53, ధర్మసాగర్‌ 2.89, పెద్ద పెండ్యాల 8.43. నారాయణగిరి 3.53, ఎల్కతుర్తి 7.51, హనుమకొండ 6.04, హసన్‌పర్తి మండలం నాగారం 7.89, సీతంపేట 3.42, ఎల్లాపూర్‌ 2.94, ఐనవోలు మండలం పున్నేలు 3.86, పంథిని 4.69, ఐనవోలు 21.76, కమలాపూర్‌ మండలం శనిగరం 6.11, వేలేరు మండలం పీచర 9.42, వేలేరు 2.76, ఆత్మకూరు 2.76, దామెర 3.49, నడికూడ మండలం చర్లపల్లి 12.42, నడికూడ 2.84, పరకాల 3.48, శాయంపేట మండలం పత్తిపాకలో 4.78 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి.

గత నెలలో సగటు 5.93 మీటర్లు

ప్రస్తుతం 6.30 మీటర్లు దిగువన నీరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement