అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన ఆస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అధ్యాపకులు మెళకువలతో బోధించాలన్నారు. సదస్సులో 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. ఓ జర్నల్ను ఆవిష్కరించారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్రాజు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ కె.సోమిరెడ్డి, స్టాఫ్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ ప్రశాంత్ మోతె పాల్గొన్నారు.
కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్
కేడీసీలో అంతర్జాతీయ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment