చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Published Thu, Feb 20 2025 8:03 AM | Last Updated on Thu, Feb 20 2025 8:03 AM

-

తాడేపల్లిగూడెం రూరల్‌: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్సై జేవీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి అజయ్‌కుమార్‌ బాబు (27) ఈ నెల 16వ తేదీన రాత్రి తన తల్లి ఇంటి డాబాపైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మెట్లపై నుంచి కిందకు పడిపోయాడు. దీంతో అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 17న తాడేపల్లిగూడెం ట్రినిటీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై అజయ్‌కుమార్‌ బాబు భార్య లావణ్య రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement