కొరుటూరులో చిరుత సంచారం | - | Sakshi
Sakshi News home page

కొరుటూరులో చిరుత సంచారం

Published Fri, Feb 21 2025 7:59 AM | Last Updated on Fri, Feb 21 2025 7:58 AM

కొరుటూరులో చిరుత సంచారం

కొరుటూరులో చిరుత సంచారం

పోలవరం రూరల్‌: గోదావరి నదీ పరీవాహకంలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్య మృగాలు సంచరిస్తున్నాయి. పోలవరం మండలం కొరుటూరు సమీపంలో చిరుత సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో దీనిని గుర్తించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 గిరిజన గ్రామాలు ఖాళీ అయ్యాయి. దీంతో జనసంచారం ఉండటం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నీటి కోసం పలురకాల జంతువులు గోదావరి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. జనసంచారం లేకపోవడంతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement