
పాలకొల్లులో మరో పసికందు గుర్తింపు
విజయవాడ స్పోర్ట్స్: నెలలు నిండని పసి కందులను విక్రయిస్తున్న విజయవాడ మహిళల ముఠా నుంచి మరో చంటి బిడ్డను ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం కాపాడింది. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న విజయవాడ ముఠాను ఈనెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో 2వ తేదీ ఆదివారం రాజమండ్రిలో ఓ చంటి బిడ్డను పోలీసులు స్వాధీనం చేసుకుని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యా ప్తులో భాగంగా మరో పసికందును పశ్చిమగోదా వరి జిల్లా పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ కె.లతాకుమారి, మహిళా పోలీసులు ఈ పాపను వారి చేతుల్లోకి తీసుకొని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment