
నిట్లో ఉత్సాహంగా మారథాన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు సూచించారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆధ్వర్యంలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, పరుగు, నడక, యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహాల వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిట్ ముఖద్వారం వరకు మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, శారదా ప్రసన్న మాలిక్, సుశాంత్ కుమార్, బెహారా తదితరులు పాల్గొన్నారు.