ఆలేరురూరల్: ఎరువుల దుకాణాల్లో ప్రతిరోజు యూరియా అమ్మకాలు ఈపాస్ మిషన్ ద్వారానే జరగాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. యాసంగి సీజన్కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మొత్తం 101 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్, ఏఈఓ నాగార్జున, సాకెర, శివకుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment