వటపత్రశాయికి వరహాల లాలీ.. | - | Sakshi
Sakshi News home page

వటపత్రశాయికి వరహాల లాలీ..

Published Wed, Mar 5 2025 2:03 AM | Last Updated on Wed, Mar 5 2025 2:03 AM

-

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన మంగళవారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరు, మాడ వీధుల్లో వటపత్రశాయి అలంకార సేవలో ఊరేగించారు. వేకువజామున నిత్యారాధనలు చేపట్టిన తరువాత, పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అనంతరం శ్రీస్వామి వారిని వటపత్రశాయి అలంకరణలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంఽశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు పాల్గొన్నారు.

సాయంకాలం వేళ..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామి వారిని హంస వాహన సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు వరకు సాగింది.

ఆలయంలో నేడు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీస్వామి వారిని బుధవారం ఉదయం శ్రీకృష్ణాలంకారణ (మురళీ కృష్ణుడు) సేవ చేపట్టనున్నారు. అదేవిధంగా సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు.

ఫ రాత్రి హంస వాహనంపై

ఊరేగిన స్వామివారు

ఫ నాల్గవ రోజుకు చేరిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement