కేంద్రానికి అశాసీ్త్రయమైన డీపీఆర్‌ను పంపించారు | - | Sakshi
Sakshi News home page

కేంద్రానికి అశాసీ్త్రయమైన డీపీఆర్‌ను పంపించారు

Published Wed, Mar 5 2025 2:03 AM | Last Updated on Wed, Mar 5 2025 2:03 AM

కేంద్రానికి అశాసీ్త్రయమైన డీపీఆర్‌ను పంపించారు

కేంద్రానికి అశాసీ్త్రయమైన డీపీఆర్‌ను పంపించారు

చౌటుప్పల్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అశాసీ్త్రయంగా పంపించిందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. చౌటుప్పల్‌, భువనగిరి, గజ్వేల్‌ ప్రాంతాలకు చెందిన ట్రిపుల్‌ఆర్‌ భూనిర్వాసితులు మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్‌ను కలిశారు. ఎలాగైనా నిబంధనల ప్రకారం 40కిలోమీటర్ల దూరం నుంచి అలైన్‌మెంట్‌ మార్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తప్పులతో కూడిన డీపీఆర్‌కు కేంద్రం ఏ విధంగా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉత్తర భాగంలో శాసీ్త్రయంగా డీపీఆర్‌ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలైన్‌మెంట్‌ మార్పిడి చేస్తామని చౌటుప్పల్‌, భువనగిరి, గజ్వేల్‌ ప్రాంతంలోని బాధిత రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. దక్షిణ భాగంలో 40 కిలోమీటర్ల దూరానికి రోడ్డును మార్చిన సీఎం ఉత్తర భాగం విషయాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్‌, భూనిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్‌ చింతల దామోదర్‌రెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, జాల వెంకటేష్‌, దబ్బేటి రాములు, బోరెం ప్రకాష్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్‌, జాల శ్రీశైలం, నర్సింహ పాల్గొన్నారు.

ఫ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement