134 మంది కార్యదర్శులకు మెమోలు | - | Sakshi
Sakshi News home page

134 మంది కార్యదర్శులకు మెమోలు

Published Thu, Mar 6 2025 1:59 AM | Last Updated on Thu, Mar 6 2025 1:59 AM

-

నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్‌ బ్రేక్‌ తప్పేలా కనిపించడం లేదు. నల్లగొండ జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖ జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడంతో 134 మందికి చార్జి మెమోలు అందజేశారు. గతంలోనూ 109 మందికి నోటీసులు జారీ చేశారు.

అనుమతి లేకుండా నెలల తరబడి

చార్జి మెమోలు అందుకున్న వారు ఎలాంటి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. వారంతా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారు. తిరిగి విదుల్లో జాయిన్‌ అయ్యేందుకు రాగా 109 మంది కార్యదర్శుల సెలవుల సర్వీస్‌ కాలాన్ని కట్‌ చేస్తూ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గతంలో పనిచేసిన ప్రాంతాల నుంచి బదిలీ చేశారు. దీంతో కార్యదర్శులంతా కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. వీరిని వాస్తవంగా సస్పెండ్‌ చేయాలి కానీ, మానవతా దృక్పథంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్‌ను రద్దు చేసి వేతనాన్ని కట్‌ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. తాజాగా చార్జి మెమోలు అందుకున్న వారిని త్వరలో విచారించేదుకు అధికారిని నియమించునున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement