గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు | - | Sakshi
Sakshi News home page

గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు

Published Fri, Mar 7 2025 8:55 AM | Last Updated on Fri, Mar 7 2025 8:54 AM

 గోవర

గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారు ఉగ్రనారసింహుడిగా సింహ వాహనంపై విహరించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. అదేవిధంగా రాత్రి సమయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ వైభవంగా కొనసాగుతున్న

వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫ నేడు ఎదుర్కోలు ఉత్సవానికి

ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు

No comments yet. Be the first to comment!
Add a comment
 గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు1
1/1

గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement