రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ | - | Sakshi
Sakshi News home page

రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ

Apr 1 2025 12:36 PM | Updated on Apr 1 2025 3:27 PM

రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ

రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ

చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో గత రెండు రోజులుగా దొంగ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కుందూనది వద్ద చాపాడుకు చెందిన శాంతమ్మ దోస పండ్ల వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి బైక్‌లో వచ్చి రూ.100లకు దోస పండ్లు కొనుగోలు చేశాడు. రూ.500 నోటు ఇచ్చి రూ.400 చిల్లర తీసుకుని వెళ్లాడు. ఇంతలో పిల్లలు అది దొంగ నోటుగా గుర్తించి వెతికేలోగా బైక్‌లో వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. సోమ వారం చాపాడులోని ఓ స్వీట్స్‌ బేకరిలో స్వీట్లు కొనుగోలు చేసిన వ్యక్తి దొంగనోటు మార్చుకుని పరారైనట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో దొంగ నోట్లు చలామణీ కావడంతో చాపాడుకు చెందిన ఎస్‌.ఓబులేసు ట్రైనీ డీఎస్పీ భవానీకి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement