వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ | - | Sakshi
Sakshi News home page

వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ

Published Tue, Apr 29 2025 7:11 AM | Last Updated on Tue, Apr 29 2025 7:11 AM

వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ

వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ,బీకాం, బ్యాచిరల్‌ ఆఫ్‌ వొకేషనల్‌ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 80 కళాశాల నుంచి 55 కేంద్రాల్లో 25,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, స్పిరిట్స్‌ డిగ్రీ కళాశాల కేంద్రాలను విశ్యవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య అల్లం శ్రీనివాస రావు , వైవీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు మే 24వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఉపకులపతి ఆదేశాల మేరకు పరీక్షలలో ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను నియమించామని, అదనంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement