ఏర్పేడు పట్టణంలో బుధవారం వేకువజామున 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం దుంగలను ఓ లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రాకను చూసి స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ వాసుతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.