ఒకవైపు ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ యాదవే ఉంటాడని ప్రకటించినా, పార్టీ మీద ఆధిపత్యాన్ని వదులుకోడానికి మాత్రం పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ ససేమిరా అంటున్నారు. తాను ఎమర్జెన్సీ సమయంలో పార్టీని స్థాపించానని, అప్పటికి అఖిలేష్ వయసు కేవలం రెండేళ్లేనని చెప్పారు. వివాదాల్లో పడొద్దని మాత్రమే తాను వైరివర్గానికి చెప్పానని, పార్టీ ఐకమత్యంగా ఉండాలన్నదే తన ధ్యేయమని లక్నోలో తన ఇంటి వద్ద గుమిగూడిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ అన్నారు.