Samajwadi Party
-
ఆపరేషన్ మిల్కీపూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్లో 5,500 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్లో సమాజ్వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై ఉద్యమించాలి : సమాజ్వాదీ పార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై సమాజ్వాదీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతో కలిసి పోరాడాలని సమాజ్వాదీ పార్టీ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్ అన్నారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, సామాజికవేత్త దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదిరె నర్సింగ్రావు నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న కార్యక్రమాలతో పాటు సభ్యత్వ నమోదు, సామాజిక కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. నేషనల్ సెక్రటరీ జగదీష్ యాదవ్ సూచించినట్లుగా త్వరలోనే ప్రజా సమస్యలపై కూడా పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
సమాజ్వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సింగ్ రావు
హైదరాబాద్: సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్తో కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
కాంగ్రెస్పై కత్తులు!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్వాదీ పార్టీ ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఎస్) నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది! అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు ఇండియా పక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఇతర అంశాల్లోనూ భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. పార్లమెంట్ లోపల, బయట కలిసి ఒక్కతాటిపై పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ విపక్ష కూటమిని ముందుకు నడిపించలేదని కుండబద్ధలు కొడుతున్నారు. సారథ్యం నుంచి కాంగ్రెస్ తప్పుకుని సమర్థులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమన్న పశి్చమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చైర్పర్సన్గా ఉన్నారు. ఇదేనా పొత్తు ధర్మం? బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో లోక్సభ ఎన్నికలకు ముందు 2023 జూన్లో 17 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒకే వేదికపైకి చేరాయి. కాంగ్రెస్తో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలు చేతులు కలిపాయి. అయితే, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిపోయారు! ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇండియా పక్షాలు కొన్నిచోట్ల కలివిడిగా, మరికొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీచేశాయి. అంతిమంగా పరాజయమే మిగిలింది. లోక్సభలో స్వీయ బలం పెరగడం ఒక్కటే కాంగ్రెస్కు కొంత ఊరట కలిగించింది. లోక్సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హరియాణాలో మిత్రపక్షాలను పక్కనపెట్టి దాదాపుగా ఒంటరిగా పోటీచేయడం వికటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్వి ఒంటెత్తు పోకడలంటూ భాగస్వామ్య పార్టీలు మండిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, పొత్తుధర్మం పాటించడంలేదని ఆక్షేపిస్తున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సమాజ్వాదీ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని ఆ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్ చెప్పారు. అయితే కూటమిలో అభిప్రాయభేదాలు నిజమేనని అంగీకరించారు. లుకలుకలపై కాంగ్రెసే స్పందించి భాగస్వాములను సమాధానపరచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. మిత్రపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక కూటమి ఎందుకని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు, అందుకే అవమానాలు ఎదురయ్యాయి’’ అని ఆరోపించారు. కూటమి ఒక్కటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం తమకు లేదని, ఏ క్షణమైనా అది ముక్కలయ్యే అవకాశం ఉందని జేడీ(యూ) సీనియర్ నేత రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. కూటమికి ఎవరు సారథ్యం వహించాలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. సారథ్యానికి సిద్ధమన్న మమత ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్వీర్ సింగ్ కోరారు. ఆమెకు తమ మద్దతు, సహకారం ఉంటాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాత్రం మమత వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది. తమ కూటమి పెద్దగా మరొకరు అవసరమని భావించడం లేదని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ తేల్చిచెప్పారు. మమత వ్యాఖ్యలను పెద్ద జోక్గా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ కొట్టిపారేశారు.ఎంవీఏకు సమాజ్వాదీ గుడ్బైముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ఎంవీఏతో తెగదెంపులు చేసుకుంటున్నామని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తెలిపింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను కీర్తిస్తూ శివసేన(యూబీటీ) ఇటీవల ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదేవిధంగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ‘ఎక్స్’లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అబూ అజ్మీ చెప్పారు. ఈ పరిణామంపై శివసేన(యూబీటీ) స్పందించింది. బాబ్రీ మసీదుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఈ విషయం తెలుసుకునేందుకు ఎస్పీకి దశాబ్దాలు పట్టిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎస్పీ),ఎస్పీ ఉన్నాయి.‘‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. నాకు చాన్సిస్తే కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన’’ – శుక్రవారం మీడియాతో మమత -
ఇండియా కూటమి చీఫ్గా మమతా బెనర్జీ..?
జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.రెండు పాత్రలకు న్యాయం చేస్తాబెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అందుకే కూటమికి దూరమయ్యారా?ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మమతకు పగ్గాలు అప్పగిస్తారా?ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్పర్సన్గా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయంమమతకు సమాజ్వాదీ పార్టీ మద్దతుఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మమత వారసుడు అతడేనా?ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది. -
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్ను సస్పెండ్ చేశారు. -
కాంగ్రెస్కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఆ ఎన్నికల్లో సీట్ల షేరింగ్కి ‘నో’
హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ, లేక ఆప్తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. అయితే, ఏప్రిల్-జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్ను ఎస్పీ తిరస్కరించింది.తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్పూర్ (ప్రయాగ్రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు -
హర్యానా ఎన్నికల్లో సమాజ్వాదీ ఒంటరి పోరు?
యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: అఖిలేష్
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. కన్నౌజ్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “నేను కర్హల్, మొయిన్పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నికల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబట్టి ఒక సీటును వదులుకోవాలి. కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నాననే విషయం మీకు తెలియజేస్తున్నానను` అని పేర్కొన్నారు.’లోక్సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.కాగా ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ.. మొత్తం 80 స్థానాల్లో కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్లలో సొంతంగా విజయం సాధించి లోక్సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
Akhilesh Yadav: బీజేపీని అడ్డుకున్నాం
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్పై విజయం సాధించారు. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్ సినిమా రీరిలీజ్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని బస్తీ, శ్రావస్తిలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. -
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
కీలకమైన ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల పోరు పశి్చమ యూపీ నుంచి యాదవ భూమికి చేరింది. బ్రజ్, రోహిఖండ్ ప్రాంతాల్లోని 10 లోక్సభ స్థానాలకు 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. యాదవులు, ముస్లింలు ఒక్కటైతే అక్కడ వారి తీర్పే ఫైనల్. వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమాజ్వాదీ పార్టీకి మూడో విడత అగ్నిపరీక్ష కానుంది. యూపీలో తొలి రెండు విడతల్లో జాట్ బెల్ట్గా భావించే పశి్చమ యూపీలోని 16 స్థానాలకు పోలింగ్ ముగియడం తెలిసిందే... సంభల్ యాదవ ఆధిపత్య స్థానమిది. దివంగత ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ 1998, 1999ల్లో ఇక్కడి నుంచే లోక్సభకు వెళ్లారు. 2004లోనూ ఎస్పీ నేత రామ్గోపాల్ యాదవ్ గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత సత్యపాల్ సింగ్ సైని గెలిచారు. 2019లో ఎస్పీ నేత షఫీకుర్ రెహమాన్ బార్క్ భారీ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈసారి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జియావుర్ రెహమాన్కు ఎస్పీ టికెటిచి్చంది. బీజేపీ మళ్లీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్ లాల్ సైనీనే రంగంలోకి దింపింది. బీఎస్పీ నుంచి షౌలత్ అలీ పోటీ చేస్తున్నారు.హథ్రస్ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 1991 నుంచీ బీజేపీ కంచుకోట. కాంగ్రెస్ అయితే 1971 తర్వాత ఇక్కడ ఎన్నడూ గెలవలేదు! ఇక ఎస్పీ, బీఎస్పీ ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలుపు ముఖమే చూడలేదు! 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ఇక్కడ విజయం సాధించింది. 2019లో ఎస్పీ అభ్యర్థి రామ్జీ లాల్ సుమాన్పై బీజేపీ అభ్యర్థి రాజ్వీర్ సింగ్ దిలార్ 2.6 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల దిలార్ ఏప్రిల్ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో బీజేపీ టికెట్ అనూప్ ప్రధాన్కు లభించింది. ఎస్పీ తరఫున జస్వీర్ వాలీ్మకి పోటీ చేస్తున్నారు.బరేలీ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ గంగ్వార్ ఇక్కడి నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ తరఫున గెలిచారు! ఒక్క 2009 మినహాయిస్తే 1989 నుంచి అన్ని ఎన్నికల్లో గంగ్వార్దే గెలుపు! ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఛత్రపాల్ సింగ్ గంగ్వార్కు టికెటిచి్చంది. ఎస్పీ నుంచి ప్రవీణ్ సింగ్ అరాన్ బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి చోటేలాల్ గంగ్వార్ నామినేషన్ తిరస్కరణకు గురవడం ఆ పారీ్టకి షాకిచి్చంది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీయే నెలకొంది.ఫతేపుర్ సిక్రీ 2009లో ఈ స్థానాన్ని బీఎస్పీ సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల నుంచి మాత్రం బీజేపీదే విజయం. 2019లో ఆ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ చాహర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్కు 1.72 లక్షల ఓట్లు పోలైతే, చాహర్ ఏకంగా 6.67 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు! దాంతో ఈ విడత కూడా చాహర్కే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రామ్నాథ్ సికర్వార్, బీఎస్పీ నుంచి రామ్నివాస్ శర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ మాజీ నేత భగవాన్ శర్మ (గుడ్డూ పండిట్) స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో ఉండటం కాంగ్రెస్కు ప్రతికూలం కానుంది.బదాయూ ఎస్పీకి కీలకమైన స్థానమిది. 1996 నుంచి 2014 దాకా ఆ పారీ్టకి కంచుకోట. 2009, 2014ల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ నెగ్గారు. 2019లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య ఆయనపై కేవలం 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విడత దురి్వజయ్ శాక్యను బీజేపీ పోటీలో దించింది. ఎస్పీ కూడా సీనియర్ నేత శివపాల్ యాదవ్ ఒత్తిడితో ఆయన కుమారుడు ఆదిత్యకు టికెటిచ్చింది. ధర్మేంద్ర యాదవ్ను పక్కన పెట్టడం దానికి ప్రతికూలంగా మారొచ్చంటున్నారు.ఫిరోజాబాద్ ఇదీ ఎస్పీ ఆధిపత్యమున్న స్థానమే. 2009లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, 2014లో ఆయన సోదరుడు అక్షయ్ యాదవ్ విజయం సాధించారు. 2019లో మాత్రం ఫిరోజాబాద్ బీజేపీ పరమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రసేన్ జడాన్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అక్షయ్ యాదవ్పై గెలిచారు. ఈసారి ఎస్పీ నుంచి మళ్లీ అక్షయ్ బరిలో ఉన్నారు. బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీని మార్చి విశ్వదీప్ సింగ్కు టికెటిచి్చంది.ఎటా ఆది నుంచీ బీజేపీని ఆదరిస్తున్న స్థానమిది. 1999, 2004 ఎన్నికల్లో మాత్రం ఎస్పీ నెగ్గింది. 2009 ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం విశేషం! ఆయన కుమారుడు రాజ్వీర్సింగ్ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ తరఫున దవేశ్ శాక్య, బీఎస్పీ నుంచి మహమ్మద్ ఇర్ఫాన్ బరిలో ఉన్నారు.ఆవ్లా 1989 నుంచి బీజేపీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 2009 నుంచి ఆ పారీ్టకే ఇక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మేంద్ర కశ్యప్కే ఈసారి కూడా బీజేపీ టికెట్ దక్కింది. ఎస్పీ నుంచి నీరజ్ మౌర్య, బీఎస్పీ తరఫున అబిద్ అలీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2014లో ఎస్పీ, 2019 ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి.బీజేపీ హవా కొనసాగేనా!? మూడో విడతలో పోలింగ్ జరిగే 10 స్థానాల్లో ఎనిమిది 2019లో బీజేపీ గెలుచుకున్నవే. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి బరిలో దిగగా బీఎస్పీ ఒంటరి పోరు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాటి మధ్య చీలితే బీజేపీ లాభపడనుంది. ఈ 10 లోక్సభ స్థానాల్లో ముస్లింలతో పాటు ఓబీసీలు, ముఖ్యంగా యాదవ్ల పాటు ఓట్లు ఎక్కువ. ఎటా, ఫిరోజాబాద్, మెయిన్పురి, బుదౌన్, సంభాల్ యాదవ ప్రాబల్య స్థానాలు. సంభాల్, ఆవ్లా, ఫతేపుర్ సిక్రీ, ఆగ్రా, ఫిరోజాబాద్ల్లో ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. బరేలీలోనైతే ఏకంగా 33 శాతం దాకా ఉంటారు! ఇతర లోక్సభ స్థానాల్లో లోధ్, కచి్చ, శాక్య, మురావోల ప్రాబల్యమూ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. -
లోక్సభ ఎన్నికల తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లోక్సభ ఎన్నికల తరుణంలో సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన కీలక నేతలు బీజేపీ చేరారు.సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌబే, బలరామ్ యాదవ్, జగత్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, పలువురు జిల్లా అధ్యక్షులు ఈరోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీపై ప్రజలకు చేరువైంది. ఆయన నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాం. అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పాఠక్ అన్నారు. -
బీజేపీ ఆటనే.. మేమూ మొదలుపెట్టాం!
లక్నో : తాజా ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారిని తాజా ఉప ఎన్నికలు ఓడించాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న ఆటను.. తాము కూడా ఆడుతున్నామని, విపక్షాలను చీల్చి గండి కొట్టాలన్న బీజేపీ ఎత్తుగడలకు బ్రేక్ వేశాయని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘బీజేపీ మాతో ఆడుతున్న ఆటనే.. మేం ఆ పార్టీ నుంచి నేర్చుకొని.. ఆడుతున్నాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఏమైంది? రుణమాఫీ కాదు రైతుల ప్రాణాలను బీజేపీ సర్కారు బలిగొంటోంది. ఇది పెద్ద మోసం’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కైరానా లోక్సభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్ఎల్డీకి మద్దతునిచ్చాయి. మరోవైపు నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. -
‘యోగి.. నువ్వేం ముఖ్యమంత్రివి?’
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్పై సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్లో యోగి.. వైరల్) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్కౌంటర్లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ముజఫర్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీహర్లో బీజేపీ-జేడీయూ కూటమికి షాక్
-
రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని.. బీజేపీలోకి జంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ సమాజ్వాదీ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాంరాం చెప్పి సోమవారం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ నేత పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన సోమవారం కమలం కండువా కప్పుకున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన నరేశ్ అగర్వాల్ పార్టీ మారారు. సమాజ్వాదీ పార్టీలో నరేశ్ అగర్వాల్ అత్యంత సీనియర్ నేత. ఆయన ఏడుసార్లు హర్దోయి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నరేశ్ పార్టీని వీడటం.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
అక్కడ విపక్షాల అనైక్యత బీజేపీకి వరం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సంయుక్తంగా బీజేపీకి పళ్లెంలో పెట్టి అందిస్తున్నాయని చెప్పవచ్చు. గతేడాది ఉత్తరప్రదేశ్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇకముందు కలిసికట్టుగా పోటీ చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు ప్రకటించారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయగా, బీఎస్పీ విడిగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈసారి గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని, తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పాలకపక్ష బీజేపీకి ఓ సవాల్ను విసురుతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సాక్షి ప్రత్యేకం. ఈసారి ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. ఆయన మొండితనం తెలిసిన కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ నాయకురాలు మాయావతిని కదిపి చూసింది. ఆమె ఎలాంటి ఐక్యతా పిలుపునకు స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలోపెట్టుకొని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సమాజ్వాది పార్టీ గోరఖ్పూర్ నుంచి సంతోష్ నిషాద్, ఫూల్పూర్ నుంచి నాగేంద్ర పటేల్ను రంగంలోకి దించింది. గోరఖ్పూర్లో నిషాద్ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని, ఫూల్పూర్లో కుర్మీలు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ గోరఖ్పూర్ నుంచి సుర్హీత ఛటర్జీ కరీంను, ఫూల్పూర్ నుంచి మనీష్ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.సాక్షి ప్రత్యేకం. యూపీలోని ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతగా తీవ్రంగా ప్రయత్నించిందీ ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభపడేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే కావడంతో ప్రాంతీయ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు పట్టించుకోలేదు. 2014లో జరిగిన లోక్సభ, ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీనే బాగా దెబ్బతిన్నప్పటికీ ఐక్యత కోసం మాయావతి కలిసి రావడం లేదు. ఆమె నిర్ణయాలు ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నాయి. పొత్తుకు అంగీకరించని ఆమె ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లయితే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం బీజేపీ అభ్యర్థులదేనని ఎవరైనా చెప్పవచ్చు! -
'అదంతా టైం వేస్ట్.. ఇప్పటికే హర్ట్ అయ్యా'
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న అఖిలేశ్ యాదవ్ కాస్త చిరాకుతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులు అనేవి సమయం వృధా చేసే పనులు అని, సీట్ల పంపిణీ విషయంలో పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెడతాయని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై బుధవారం అఖిలేశ్ స్పందిస్తూ తన గురి మొత్తం ఇప్పుడు ఆ ఎన్నికలపైనే అన్నారు. 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సమాజ్వాది పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. '2019 ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి దేశం మొత్తానికి ఓ సందేశం వెళ్లనుంది. ఇప్పుడు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే విషయాన్ని నేను ఆలోచించడం లేదు. అదంతా కూడా సమయం వృధా. ఇక నేను తికమక అవ్వాలని అనుకోవడం లేదు. అయితే, పొత్తులు గురించి కాకుండా మాలాగే ఆలోచించే పార్టీతో స్నేహం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాము' అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ పొత్తుపెట్టుకొని పనిచేసి ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. -
వీడియో సాక్ష్యం.. చిక్కుల్లో నటుడు సంజయ్!
-
సమాజ్వాదీ ముసలం.. ముగియలేదా?
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములాయం కుటుంబంలోని గొడవలతో సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ములాయం, తనయుడు అఖిలేష్ల వర్గాలుగా చీలిపోయిన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకోగా.. ఒకానోక టైంలో తనను తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ ప్రకటించుకోవటం.. సైకిల్ గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటం లాంటివి చూశాం. చివరకు పరిస్థితి సర్దుమణిగినా.. పార్టీకి భారీ ఓటమి మాత్రం తప్పలేదు. ఇదిలా ఉంటే నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పార్టీలో పరిస్థితులు ఏం మారలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న రాష్ట్ర సర్వసభ్య సమావేశం, అక్టోబర్ 5న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ యువనేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే విభేధాల అనంతరం భారీ స్థాయిలో నిర్వహించబోతున్న పార్టీ సమావేశాల విషయంలో నేతాజీ ములాయం పేరు ప్రస్తావన రాకపోవటం విశేషం. ములాయం వర్గీయులకు కూడా ఈమేర ఆహ్వానం అందలేదనే తెలుస్తోంది. మరోవైపు ములాయం సింగ్ నేతృత్వంలో ఈ నెల 21న లొహియా ట్రస్ట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రస్ట్ 11 మంది సభ్యుల్లో తనయుడు అఖిలేష్తోపాటు, సోదరుడు రామ్గోపాల్ యాదవ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ మొన్నామధ్య నిర్వహించిన సమావేశాలకు వీరిద్దరూ హాజరుకాకపోవటంతో.. త్వరలో నిర్వహించబోయేదానిపై కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటంతో సమాజ్వాదీ పార్టీ అధికార జగడం ఇంకా సర్దుమణగలేదనే చెప్పుకుంటున్నారు. -
అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది. తప్పు జరిగిపోయింది: సమాజ్వాదీ పార్టీ సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎమ్మెల్సీల రాజీనామా.. సీఎంకు లైన్క్లియర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లైన్ క్లియర్ అయింది. ఆయన ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. శాసనమండలిలో ఆయన అడుగుపెట్టేందుకు వీలుగా ఇద్దరు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్సీలు రాజీనామా చేసి.. మార్గం సుగమం చేశారు. శాసనమండలి సభ్యులైన బుక్కాల్ నవాబ్, యశ్వంత్ సింగ్ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. మరింతమంది రాజీనామా చేసే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోసిన్ రజాలు శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నికకావాల్సి ఉంది. వీరికి రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానిక మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీలుగా ఉన్న సీఎం యోగి, డిప్యూట్యీ సీఎం మౌర్య తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గత ముఖ్యమంత్రులైన మాయావతి, అఖిలేశ్ యాదవ్ సైతం ఇదేవిధంగా ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టారు. -
దేవుళ్లను అవమానించారు!
♦ రాజ్యసభలో ఎస్పీ ఎంపీ అగర్వాల్ వ్యాఖ్యపై దుమారం ♦ క్షమాపణకు అధికార పక్షం డిమాండ్ ♦ సభ రెండుసార్లు వాయిదా.. ఎట్టకేలకు దిగొచ్చిన నరేశ్ అగర్వాల్.. ♦ మన్ కీ బాత్ ఆపండి.. రుణాల్ని మాఫీ చేయండి: లోక్సభలో విపక్షాలు న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లపై రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర దుమారం సృష్టించాయి. హిందూ దేవుళ్లను ఆల్కహాల్ బ్రాండ్లతో అగర్వాల్ పోల్చారని, సభ వెలుపల ఆయన ఆ వ్యాఖ్యలు చేసుంటే తప్పకుండా కేసు పెడతారని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర మిత్రపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన క్షమాపణకు పట్టుబట్టాయి. అందుకు అగర్వాల్ నిరాకరించడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం సమావేశమయ్యాక ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ‘దళితులు, మైనార్టీలపై పెరుగుతున్న హత్యాచారాలు, దాడులు’ అంశంపై చర్చ సందర్భంగా అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ‘మీరు వాడిన మాటల తీవ్రత ఇంకా గుర్తించలేదు. ఇతర మతాల దేవుళ్ల గురించి అలా మాట్లాడేందుకు మీరు సాహసించగలరా?’ అని ప్రశ్నించారు. అగర్వాల్ వ్యాఖ్యల్ని డిప్యూటీ చైర్మన్ వినకపోవడంతో రికార్డుల పరిశీలనకు సభను 10 నిమిషాలు వాయిదావేశారు. అనంతరం భేటీ కాగానే కురియన్ మాట్లాడుతూ ‘అగర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే ఆ వ్యాఖ్యల్ని ఎక్కడా వాడవద్దని మీడియాకు సూచించారు. ఇంతలో అగర్వాల్ లేచి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పగా.. ‘దేవుళ్లని అవమానిస్తే ఊరుకోం’ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార సభ్యుల నిరసనలతో సభ వాయిదాపడింది. అనంతరం సమావేశమయ్యాక.. తన వ్యాఖ్యలకు అగర్వాల్ క్షమాపణలు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏ కుల, మత విశ్వాసాల్ని అవమానించలేదని వివరణ ఇచ్చారు. రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించింది రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించిందన్న ప్రతిపక్షాల నిరసనలతో లోక్సభ మార్మోగింది. రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ‘మన్ కీ బాత్ బంద్ కరో, కర్జా మాఫీ షురూ కరో’(రేడియోలో మాట్లాడడం ఆపి.. రైతు రుణ మాఫీ మొదలుపెట్టండి) అని నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షం స్వాభిమాని ప„Š (ఎస్డబ్లు్యపీ) ఎంపీ రాజు షెట్టీ కూడా విపక్షాలతో జతకలిశారు. దీంతో సభ ప్రారంభంలోనే గంట వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, రైతు రుణాల మాఫీతో పాటు.. పెట్టుబడి ఖర్చుల్లో 50 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. 193వ నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ చెప్పా రు. ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వాకౌట్ చేశారు. ‘గోరక్షణ’పై రాష్ట్రాలకు పూర్తి అధికారం ‘గోరక్షణ’ పేరిట హత్యలపై లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాంటి సంఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ సమాధానంపై ఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. వెల్లోకి దూసుకెళ్లారు. పాకిస్తాన్తో కలసి భారత్పై దాడి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని మాజీ రక్షణ మంత్రి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్సభలో పేర్కొన్నారు. అలాంటి ముప్పు ఎదురైతే ఎలా ఎదుర్కొంటారో పార్లమెంట్కు చెప్పాలని ఆయన కోరారు. ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధ హోదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ పెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. పేద విద్యార్థుల ఫీజులు పెంచబోమని, రిజ్వరేషన్ల చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.‘ద ట్రిపుల్ ఐటీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) బిల్లు’లో భాగంగా 15 ట్రిపుల్ ఐటీల్ని ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’గా పరిగణిస్తారు. -
అపర్ణా యాదవ్ సంస్థకు 86% ‘నిధులు’
లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గో సంరక్షణకు కేటాయించిన నిధుల్లో 86 శాతం డబ్బులు అపర్ణ యాదవ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి చేరాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ వివరాలు వెల్ల డించింది. నాటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు తమ్ముడు ప్రతీక్ యాదవ్ భార్యనే అపర్ణ. గో సంరక్షణకు కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 2012 నుంచి 2017 మధ్య యూపీ ప్రభుత్వం మొత్తం రూ.9.66 కోట్లను గో సంరక్షణకు కేటాయించగా, అందులో రూ.8.35 కోట్లను అపర్ణ నడిపే జీవ్ ఆశ్రయ అనే సంస్థకు కేటాయించింది. -
అఖిలేష్.. ఇక చాలు దిగిపో!
తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటని అడిగితే మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు. -
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
-
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
తన పేరు చెప్పేటప్పుడు ఆ యువకుడి గొంతులో కాస్తంత గర్వం తొణికిసలాడింది. ''నా పేరు మోహిత్ యాదవ్..'' అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు. తన మేనమామ పేరు చెప్పుకొంటూ అతగాడు రెచ్చిపోయాడు. ఎందుకంటే అతడి మేనమామ ఉత్తరప్రదేశ్లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ!! మోహిత్ యాదవ్ అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్ను లాగి ఒక్కటిచ్చాడు. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు యాదవ్ను అరెస్టు చేశారు. మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి. రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మోహిత్ యాదవ్ నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని స్టేషన్కు లాక్కెళ్లారు. అక్కడ కూడా అలాగే చేయడంతో లోపల వేశారు. అతడు బాగా తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు. -
శివపాల్ సన్నిహితులపై వేటు
లక్నో: సమాజ్వాదీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. శివపాల్ యాదవ్కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై వేటు పడింది. మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, కల్లు యాదవ్, రాజేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్ సహా ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. 'సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ తమ్ముడు, శివపాల్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులపై వేటు వేయడం గమనార్హం. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం. తన కొడుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ అన్నారు. కాంగ్రెస్తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. -
ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ను పలకరించగా.. ఆయన మోదీ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు. పక్కనే ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. మోదీలో చెవిలో ములాయం ఏం చెప్పారన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ బయటపెట్టారు. 'నేతాజీ (ములాయం) ప్రధాని మోదీతో.. కాస్త చూసుకోండి, ఇతను నా కొడుకు అఖిలేష్ అని చెప్పారు' అని అఖిలేష్ వెల్లడించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్మింది చెబుతున్నాని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎస్పీ ఓడిందని అఖిలేష్ ఆరోపించారు. -
ములాయం కొత్త పార్టీ!!
-
ములాయం కొత్త పార్టీ!!
కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది. -
జనం మెచ్చని జోడీ.. విడాకులే దారి
- ఎస్పీతో కాంగ్రెస్ తలాక్ లక్నో: ‘ఈ జోడీ ప్రజలకు నచ్చింది.. బంపర్ మెజారిటీ గెలిపిస్తారు..’ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ మధ్య పొత్తుపై సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలివి. సీన్ కట్చేస్తే ‘జనం మెచ్చని జోడీకి విడాకులే దారి.. ఎస్పీతో పొత్తుకు రాంరాం..’ అని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు! ఆదివారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మీడియాకు చెప్పారు. యూపీ వ్యవహారాల ఇన్చార్జి గులామ్ నబీ ఆజాద్ సహా కీలక నేతల సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల.. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా దారుణంగా నష్టపోయిందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ‘3కే’ ఫార్ములాకు పునరంకితం.. సమాజ్వాదీ పార్టీతో తెగదెంపుల అనంతరం తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన ‘3కే’ ఫార్ములాకు పునరంకితం అవుతున్నట్లు యూపీ కాంగ్రెస్ ప్రకటించింది. కోల్పోయిన చరిష్మాను తిరిగి సాధించుకోవడం కాంగ్రెస్కు తెలుసని, అతి త్వరలోనే నేలకు కొట్టిన బంతిలా దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ సూచించిన ‘కార్యకర్త.. కార్యాలయం.. కార్యక్రమం..’ అనే 3కే ఫార్ములాతో కాంగ్రెస్కు పునరుజ్జీవం కలుగజేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. -
ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్కు కోపం వచ్చింది. 'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి. -
సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింహాద్రి
సాక్షి, హైదరాబాద్: సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో సోమనబోయిన రామలింగయ్య, భద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా సింహాద్రి జన్మించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు నల్లగొండలో, పీజీ, పీహెచ్డీ ఉస్మా నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 35 ఏళ్ల పాటు ఓయూలో ఫ్రొఫెసర్గా పని చేశారు. 30 ఏళ్ల నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపై 1996 నుంచి ప్రొఫెసర్ జయశంకర్తో కలసి అనేక పుస్తకాలు రాశారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రోడ్డు మ్యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. ఓబీసీ స్థితిగతులపై అనేక పరిశోధనలు చేయడమే కాకుండా, పుస్తకాలూ ప్రచురించారు. ‘మండలి ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి–రాజకీయాలు’ వంటి సమకాలిన అంశాలపై పుస్తకాలు రాశారు. ఓబీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
మాజీ సీఎం విద్యుత్ బకాయి రూ.4 లక్షలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టడంతో విద్యుత్ శాఖ సిబ్బంది మొండి బకాయిలను వసూలు చేసేందుకు తనిఖీ నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 4 లక్షల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించలేదని గుర్తించారు. ఎతావ్లోని ములాయం ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. రోజుకు 5 కిలోవాట్ల విద్యుత్ వాడేందుకు అనుమతి ఉండగా, ములాయం ఇంట్లో ఎనిమిది రెట్లు ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించారు. ఈ నెలలోపు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు గడువు విధించారు. ములాయం సొంత నియోజకవర్గమైన ఎతావ్లో సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆయనకు సువిశాలమైన బంగ్లా ఉంది. 12 గదులు ఉన్న ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ ఉంది. -
‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’
లక్నో: బీజేపీని ఓడించడమే తన లక్ష్యం అని బీఎస్పీ అదినేత్రి మాయావతి శపథం చేశారు. అందుకోసం ఏ పార్టీతోనైనా తాను చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. విషాన్ని(పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ) విషంతోనే దెబ్బకొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల కిందట సమాజ్వాది పార్టీతో పొత్తుపెట్టుకొని విడిపోయిన ఆమె ఈ వ్యాఖ్యల ద్వారా తొలిసారిగా బహిరంగంగా ఎస్పీతో పొత్తుకు కూడా స్వాగతం అంటూ పరోక్షంగా చెప్పారు. అంబేద్కర్ జయంతి మాట్లాడిన ఆమె భవిష్యత్తులో బహుజన ఉద్యమం తీసుకొచ్చేందుకు, మత శక్తులను నిలువరించేందుకు ఇతర పార్టీలతో సత్సంబంధాలు అవసరం అని ఆమె అన్నారు. అంతకుముందు సమాజ్వాది పార్టీ నేత రాజేంద్ర చౌదరీ మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజకీయాలు రక్షించేందుకు మేం ఏమైనా చేస్తాం. విభజన శక్తులను అడ్డుకోవాలి. మాలాగా ఆలోచించే పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. కావాలంటే బీఎస్పీ కూడా’ అని చెప్పారు. అయితే, అలాంటి కూటమి ఒకటి వస్తే దానికి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానిపై మాత్రం బదులివ్వలేదు. -
'బావగారూ... మాట నిలబెట్టుకోండి'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్ష బాధ్యతలు ములాయం సింగ్ కు అప్పగించాలని అఖిలేశ్ యాదవ్ ను ఆయన మరదలు అపర్ణ యాదవ్ కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ములాయంను పదవీత్యుడిని చేయడం తనను కలచివేసిందని వెల్లడించారు. ఈగో సమస్యల వల్లే ఎన్నికల్లో తాను ఓడిపోయానని చెప్పారు. 'అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తిరిగి అప్పగిస్తానని అఖిలేశ్ జనవరిలో చెప్పారు. తాను మాటమీద నిలబడే వ్యక్తినని అఖిలేశ్ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. నేతాజీ బతికున్నంత వరకు మా ఇంట్లో ఆయన మాటే ఫైనల్. ఎన్నికలకు ముందు ఆయనను పరాభవానికి గురిచేయడం నన్ను కలచివేసింది. ఆయన కూడా చాలా బాధ పడ్డారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. కుటుంబమంతా కలిసివుండాలని కోరుకుంటున్నాను. మా పార్టీ ఎప్పుడు గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశాను. మేము నియమించిన బృందం ఈగో సమస్యలతో సమన్వయంతో పనిచేయలేదు. ఈ విషయాన్ని నేతాజీ, అఖిలేశ్ దృష్టికి తీసుకెళ్లినా వారేమీ చేయలేకపోయార'ని అపర్ణ యాదవ్ వివరించారు. -
ముఖ్యమంత్రితో బాబాయ్ మంతనాలు
లక్నో : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, రాజకీయ సమీకరణలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలవడం హాట్ టాఫిక్గా మారింది. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది. . ముఖ్యమంత్రి నివాసంలో జశ్వంత్నగర్ ఎమ్మెల్యే అయిన శివపాల్యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే అని చెబుతున్నా, శివపాల్ ...సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణ యాదవ్ పలుమార్లు యోగి ఆదిత్యనాథ్తో కలిసిన విషయం తెలిసిందే. త్వరలో అపర్ణయాదవ్ కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు శివపాల్ కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ములాయం కుటుంబసభ్యులు కమలానికి చేరువ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ.. అబ్బాయ్ అఖిలేష్, బాబాయ్ శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్గా ఉన్న శివపాల్ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావలనుకున్న అఖిలేష్కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎస్పీ ఓటమితో ములాయంతో పాటు శివపాల్ కూడా అఖిలేశ్పై తీవ్రస్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే. -
సమాజ్వాదికి ఝలక్.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీకి తాజాగా ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదంటూ ఎస్పీలో కీలక అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ భాటియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలోనే సమాజ్వాది పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ న్యాయవాదిగా ఉన్న గౌరవ్ భాటియా బీజేపీలో చేరకముందు సమాజ్వాది పార్టీ తరుపున జాతీయ చానెళ్లలో రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. విషయ పరిజ్ఞానంతోపాటు మంచి చతురత కలిగిన నాయకుడు అని కూడా గౌరవ్కు పేరుంది. అయితే, సమాజ్వాది పార్టీలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, సామ్యవాద భావాలు కొరవడుతున్నాయని, పరిపాలన కుటుంబానికి పరిమితమై పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పదవులకు తాను ఫిబ్రవరిలోనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ‘నూతన భారత నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఆలోచనను ఇస్తున్నారు. ఆయన ఆలోచన విధానమే నన్ను బీజేపీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని భాటియా తెలిపారు. అంకిత భావానికి, కలుపుగోలుతనానికి బీజేపీ పెట్టిందని కొనియాడారు. సమాజ్వాది పార్టీలో మాత్రం రాజకీయ కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, పార్టీపై పట్టుకోసం సాక్షాత్తు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇక నుంచి తాను కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. గౌరవ్ భాటియా తండ్రి వీరేంద్ర భాటియా ములాయంసింగ్కు చాలా సన్నిహితుడు. ఆయన 2010లో చనిపోయారు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. -
ఎస్పీకి ఝలక్.. బీజేపీలోకి జంప్!
చాలాకాలంపాటు సమాజ్వాదీ పార్టీకి గొంతుకగా టీవీ చర్చలలో ప్రముఖంగా కనిపించిన గౌరవ్ భాటియా తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీ పదవులకు రాజీనామా చేసిన భాటియా ఆదివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎస్పీ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ లీగల్ వింగ్ అధ్యక్షుడిగా గతంలో భాటియా పదవులు నిర్వహించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయం పాలై.. అంతర్గత కుటుంబ విభేదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆ పార్టీకి మీడియా ముఖంగా వ్యవహరించిన భాటియా తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొంతముందే గత ఫిబ్రవరిలో తాను ఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు భాటియా ఫేస్బుక్లో ప్రకటించారు. తన ప్రధాన సిద్ధాంతమైన సోషలిజానికి ఎస్పీ దూరం జరిగిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని గత రెండునెలలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తాజాగా కమలం గూటికి చేరారు. -
అఖిలేశ్లా నన్నెవరూ అవమానించలేదు
-
అఖిలేశ్లా నన్నెవరూ అవమానించలేదు
ఎస్పీ చీఫ్ ములాయం ఆవేదన లక్నో: మాజీ సీఎం అఖిలేశ్లా ఇప్పటివరకు తననెవరూ అవమానించలేదని ఆయన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు శివ్పాల్నూ అగౌరవపరిచాడన్నారు. ‘తండ్రిని అవమానపరిచిన పుత్రుడు రాష్ట్ర ప్రజలకు ఎలా విధేయుడిగా ఉండగలడు’అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అఖి లేశ్పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ములాయం ప్రస్తావించారు. మోదీ నిజమే చెప్పారని, తండ్రినే పట్టించుకోనివాడు ఇంకెవరికీ ఉపయోగపడలేడని శనివారం ఇక్కడ ఓ హోటల్ ప్రారంభోత్సవంలో ములాయంసింగ్ ఘాటుగా విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని, ఎస్పీ పరాజయానికి నాంది పలికాయని చెప్పారు. ‘నాలా పూర్తిస్థాయి రాజకీయ జీవితంలో ఉన్న నేతలెవరూ తమ కుమారులను ముఖ్యమంత్రులను చేయలేదు. 2012 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు ఓటేసి గెలిపించినా అఖిలేశ్ యాదవ్ను ఆ పీఠంపై కూర్చోబెట్టా. కానీ అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నా రక్తమే నాకు వ్యతిరేకంగా మారింది’ అని ములాయం చెప్పుకొచ్చారు. తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్తో అఖిలేశ్ జతకట్టడం అత్యంత బాధాకరమన్నారు. -
ఢిల్లీలో అఖిలేష్, డింపుల్ ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అఖిలేష్ దంపతులతో పాటు సినీ నటి, ఎంపీ జయా బచ్చన్, అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 76 మంది ప్రచారం చేస్తారని ఢిల్లీ ఎస్పీ చీఫ్ ఉషా యాదవ్ చెప్పారు. ఏప్రిల్ 23న జరిగే ఎంసీడీ ఎన్నికలకు ఎస్పీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఉషా యాదవ్ చెప్పారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ బరిలో ఉన్నాయి. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారు. 2007 నుంచి ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఎంసీడీలో మొత్తం 272 కార్పొరేటర్ల స్థానాలున్నాయి. -
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
-
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
సమాజ్వాదీ పార్టీకి ఇంకా తానే పెద్ద అనుకుంటున్న ములాయం సింగ్ యాదవ్కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు భారీ షాకిచ్చారు. వాళ్లందరితో ఓ సమావేశం ఏర్పాటుచేసి, వాళ్లకు భోజన ఏర్పాట్లు కూడా చేద్దామనుకున్న పెద్దాయనను కాదని, తాము ఉండబోయేది అఖిలేష్ యాదవ్తోనే అని తేల్చిచెప్పేశారు. దాంతో చిన్నబుచ్చుకున్న పెద్దాయన.. తాను ఏర్పాటుచేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సమాజ్వాదీ పార్టీ తరఫున గత ఎన్నికల్లో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్లతో పాటు ఎమ్మెల్సీలు కూడా కలిసి తమ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేష్ యాదవ్ను ఎన్నుకున్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసే సమావేశాలకు మాత్రమే వెళ్లాలి తప్ప పార్టీ తరఫున మరెక్కడికీ వెళ్లకూడదని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లలాయ్ సింగ్ ప్రతిపాదించారు. సమావేశంలో ఎక్కడా ములాయం పేరు ప్రస్తావనకే రాలేదు. జనవరి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం నుంచి.. అఖిలేష్ యాదవ్ ఆ పదవి లాగేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలను పూర్తిగా తన చేతిలో పెట్టుకుని కూడా అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు. అయినా సరే పార్టీ మీద మాత్రం తన ఆధిపత్యం కొనసాగించాలని అఖిలేష్ గట్టి పట్టుతో ఉన్నారు. అయితే.. అఖిలేష్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన బాబాయ్, ఎమ్మెల్యే శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టారు. అలాగే తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆజంఖాన్ కూడా ఈ సమావేశానికి రాలేదు. అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయకపోవడంతో ఆజంఖాన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న అఖిలేష్ యాదవ్.. ఆ హోదాతో శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యేందుకు, ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకు కలిపి 325 స్థానాలు రాగా, రెండోస్థానంలో నిలిచిన సమాజ్వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలే వచ్చాయి. -
ఆ రెండు పార్టీలు కూటమిలోకి వస్తేనే..
పట్నా: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకికవాద పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు ఈ కూటమిలోకి రావాలని సూచించారు. ఆదివారం పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు మాట్లాడుతూ.. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే ఇదే మార్గమమని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మహా కూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) విజయం సాధించడాన్ని ఉదాహరించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా, సమాజ్వాదీ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లౌకికవాద పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. బిహార్లో ఆర్జేడీకి మిత్రపక్షమైన జేడీయూ నేతలు కూడా ఇలాంటి సూచనే చేయగా.. తాజాగా లాలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. -
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
-
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ ఎన్నికల్లో పోరాడినా బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడానికి ప్రధాన కారణం యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి గతంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవిని లాగేసుకున్న అఖిలేష్.. ఆ తర్వాత మాత్రం మళ్లీ వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్కు, మరదలు అపర్ణా యాదవ్కు టికెట్ ఇచ్చి తండ్రిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరిలో అపర్ణ ఓడిపోగా.. శివపాల్ గెలిచారు. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా జాతీయాధ్యక్ష పదవి చేపట్టిన అఖిలేష్.. ఇప్పుడు దాన్ని ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. త్వరలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన 5 కాళిదాస్ మార్గ్ను శుద్ధి చేస్తారని వార్తలు రావడంతో.. తాము మళ్లీ 2022 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పుడు అగ్నిమాపక యంత్రాల సాయంతో గంగాజలం చల్లుతామని, అప్పుడు కేవలం 5 కాళిదాస్ మార్గ్లోనే కాక.. మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చల్లుతామని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని, అయితే వాటిని మీడియాలో చూపించడం లేదని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తనమీద బురద చల్లేవారన్నారు. -
రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర
బీసీ కమిషన్ రద్దుపై రాజ్యసభలో విపక్ష ఆందోళన న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)ను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలో విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీని వెనుక రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర ఉందని ఆరోపించాయి. ఎస్పీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని అనేకసార్లు స్పష్టం చేశారని చెప్పారు. వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యంగబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందన్నారు. 1992లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటైన ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు బదులుగా రద్దు చేయాలని చూస్తున్నారని రామ్గోపాల్ యాదవ్(ఎస్పీ) మండిపడ్డారు. ఎన్సీబీసీ స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్సీఎస్ఈబీసీ)ను ఏర్పాటు చేయడం వెనుక దళితులకు, యాదవులకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఉందన్నారు. నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని పరోక్షంగా పేర్కొన్నారు. ఎస్పీ సభ్యలకు కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు మద్దతు పలికారు. రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయం ఐటీశాఖ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 2,534 వ్యక్తులు, గ్రూపులకు సంబంధించి సోదాలు జరిపి, రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని బహిర్గతం చేసిందని ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్సభలో చెప్పారు. నగలు, నగదు సహా రూ. 3,625 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను జప్తు చేసిందన్నారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2016 నాటికి రూ. 8,08,318 కోట్ల వ్యవసాయ రుణాలను అందించామన్నారు. ‘గోవధకు పాల్పడితే మరణ శిక్ష’ గోవధ, గోవుకు సంబంధించిన ఇతర నేరాలకు పాల్పడితే మరణదండన విధించాలని ప్రతిపాదిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన రాజ్యంగంలోని 37వ అధికరణ ప్రకారం ఆవుల సంరక్షణకు కేంద్ర పరిధిలో సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. లోక్సభకు ‘ఆత్మహత్య’ బిల్లు మానసిక ఆరోగ్యరక్షణ బిల్లును ఆరోగ్య మంత్రి నడ్డా లోక్సభలో ప్రవేశపెట్టారు. మానసిక రోగులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్న దీనికి అన్ని పార్టీల సభ్యు లూ మద్దతు పలికారు. ఆత్మహత్యను నేరంగా పరిగణించకూడదనే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది. ఇతర ముఖ్యాంఖ్యాలు ► రూ. 5వేల, రూ. 10వేల నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు తెలిపారు. దీనిపై రిజర్వు బ్యాంకుతో చర్చించగా, వీటిని ప్రవేశపెట్టే పరిస్థితి లేదని తేలిందన్నారు. ► మాజీ ఎంపీల పింఛన్ నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీల్లో 80 శాతం మంది కోటీశ్వరులని సుప్రీం కోర్టు అన్నట్లు వచ్చిన వార్తలను లోక్భలో సభ్యులు ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. ► వైద్యవిద్యా సంస్థల్లో అదనంగా 5వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను కల్పించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి నిధులను 28 శాతం పెంచామన్నారు. -
అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!
నిన్న మొన్నటి వరకు ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు అభిమానం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇది. యూపీలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ది కాదని పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు శివపాల్ - అఖిలేష్ ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇంతటి మోదీ గాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా శివపాల్ మాత్రం జస్వంత్నగర్ స్థానంలో బీజేపీ నాయకుడు మనీష్ యాదవ్ పాత్రేను 52 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరినీ నిందించబోమని, నేతాజీ పోరాటానికి ఇప్పుడు కూడా తామంతా మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ ఇంతకుముందు ఎక్కడ ఉండేదో మళ్లీ అక్కడకు తీసుకెళ్తామన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరో తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జరిగిందేదో జరిగిపోయిందని నిట్టూర్చారు. -
403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రంలో 19 శాతం ముస్లింలు ఉండగా... తాజా శాసనసభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 24 మంది మాత్రమే విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో 69 మంది ముస్లిం సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘సబ్కా సాత్... సబ్కా వికాస్’ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... మొత్తం 403 స్థానాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలోకి దింపకపోవడం గమనార్హం. ముస్లింలు అధికంగా ఉండే రోహిల్ఖండ్, తెరాయ్తో పాటు యాదవులు, దళితులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న తూర్పు ప్రాంతం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు పెద్ద ఓటు బ్యాంకులు. ఈ సామాజిక లెక్కల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్తో జతకట్టింది ముస్లింల ఓటు బ్యాంకు కోసమే. ఈ ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య చీలిపోతే... అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది వారి అంచనా. మరోవైపు యూపీలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. ఈసారి 479 మంది మహిళా అభ్యర్థులు పోటీపడితే... 40 మంది మాత్రమే గెలిచారు. వీరి గెలుపు శాతం పది కంటే తక్కువ. ఇక... 403 మంది నూతన శాసనసభ్యుల్లో డిగ్రీ ఆపై చదువులు చదివినవారు 290 మంది. 143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 403 కొత్త ఎమ్మెల్యేల్లో 143 మంది నేర చరితులు, 322 మంది కోటీశ్వరులు ఉన్నారు. నేర చరితుల్లో హత్య తదితర తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నట్టు ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో బీజేపీ తరుఫున కోలొనెల్గంజ్ స్థానం నుంచి నెగ్గిన అజయ్ప్రతాప్సింగ్ టాప్లో ఉన్నారు. ఈయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,455 మంది కోటీశ్వరులు పోటీపడ్డారు. -
అందుకే ఓడిపోయాం: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదని ములాయం అన్నారు. ఓటర్లను సంతృప్తి పరచలేకపోయామని, అందుకే ఓటమి చవిచూశామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి 54 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ అంచనాలకు మించి 325 సీట్లు కైవసం చేసుకుంది. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలు ఎస్పీ ఓటమి కారణాలుగా భావిస్తున్నారు. ములాయం ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. కేవలం సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ పోటీచేసిన జశ్వంత్ నగర్, లక్నో కంటోన్మెంట్లలో మాత్రమే ప్రచారం చేశారు. శివపాల్ విజయం సాధించగా, అపర్ణ ఓటమి చవిచూశారు. కాగా తమకు ఓటమి కొత్త కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని ములాయం అన్నారు. -
‘అఖిలేశ్తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
అఖిలేశ్ భవితవ్యం..!?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సమాజ్వాదీ పార్టీ మళ్లీ కోలుకుంటుందా? తండ్రిని కాదని అన్ని తానై నడిపించిన అఖిలేశ్ పరిస్థితి ఏంటి? మళ్లీ ములాయం పార్టీ పగ్గాలు చేపడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్తో తాత్కాలిక స్నేహమేగాని ఏనాడూ అధికారం పంచుకోని ములాయం మార్గాన్ని వదిలి అఖిలేశ్ సాధించింది శూన్యమే. 1967లో ఎన్నికల బరిలో దిగి.. తొలి ప్రయత్నంలోనే ములాయం విజయం సాధించా రు. సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా, మాజీ ప్రధాని చరణ్సింగ్ బాటలో పయనించి యూపీలో పెను మార్పులకు పునాదులు వేశారు. మొదటినుంచి బ్రాహ్మణేతర, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్ని ములాయం వంటపట్టించుకున్నారు. అయితే యాదవ పరివారంలో తండ్రి నేతృత్వం లోని వర్గాన్ని పక్కకు నెట్టి నాయకత్వాన్ని అఖిలేశ్ కైవసం చేసుకున్నా.. తండ్రి బాటలో మాత్రం పయనించలేదు. 2007లో 97 స్థానాలతో, 2012లో 80 స్థానాలతో బీఎస్పీ ప్రతిపక్ష హోదా సాధించగా.. ఈ సారి ప్రతిపక్ష హోదా పొందిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమైంది. అయితే అఖిలేశ్ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పరిస్థితి. కాంగ్రెస్ను పొత్తుకు ఒప్పించి అఖిలేశ్ విజయం సాధించినా... 40 సీట్లకు మించి పోటీచేసే సామర్థ్యం లేని ఆ పార్టీకి 60కిపైగా సీట్లిచ్చి ఆయన పెద్ద తప్పిదం చేశారు. 2019లో బీఎస్పీతో పొత్తు? 1995లో ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య వైరం కొనసాగుతోంది. దానికి ముగింపు పలికే అవకాశాన్ని అఖిలేశ్ ఉపయోగించుకుంటే లౌకిక, సామాజిక శక్తులు ఏకం కావచ్చు. నరేంద్ర మోదీ దెబ్బతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపి విజయం సాధించిన నితీశ్, లాలూను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయడమే మాయ, అఖిలేశ్ల ముందున్న మార్గమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శివ్పాల్ గెలుపు.. అపర్ణ ఓటమి లక్నోలో బలంగా ఉందనుకున్న ఎస్పీకి రాజధానిలోనూ చుక్కెదురైంది. కంటోన్మెంట్ ప్రాంతంలో ములాయం రెండో కోడలు అపర్ణా యాదవ్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రీటా బహుగుణ జోషి 33,796 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ అలహాబాద్ (పశ్చిమ) స్థానం బరిలో దిగి 25వేల పైచిలుకు ఓట్లతో ఎస్పీ అభ్యర్థి రీచా సింగ్పై గెలిచారు. రాజ్నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా నుంచి లక్షా నాలుగు వేల ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిని ఓడించారు. అయితే, మాజీ మంత్రి, ఎస్పీ సీనియర్ నేత శివ్పాల్ యాదవ్ తన సిట్టింగ్ నియోజక వర్గం జస్వంత్పూర్ నుంచి 52 వేల ఓట్లతో గెలిచారు. ‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక శివ్పాల్ తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9). కులం ప్రభావం ఎక్కువే! అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది. అప్నాదళ్తో పొత్తు లాభిస్తుందా? కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
ఆ మంత్రి పోలీసుల ఎదుట లొంగిపోవాలి
లక్నో: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంపై వస్తున్న విమర్శలకు అధికార సమాజ్వాదీ పార్టీ స్పందించింది. ప్రజాపతి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి, పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఎస్పీ నేత అబు అజ్మీ సూచించారు. ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్వాదీ పార్టీ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనిపై స్టే విధించాలని ప్రజాపతి కోరాగా సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలో కొనసాగించడంపై యూపీ గవర్నర్ తప్పుపట్టారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున పోటీచేశారు. -
స్టార్ లీడర్
‘ఒకప్పటి’ అనే మాట జయప్రదకు ఎప్పటికీ వర్తించదేమో! సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్లో ఆమె స్టార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద. పెళ్లి కూడా అంతే! చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్ నటికి అది బాల్య వివాహమే! జయప్రద తొలి సినిమా ‘భూమికోసం’. తొలి పార్టీ ‘తెలుగుదేశం’. ఇవి రెండూ ఆమెను మరికొన్ని సినిమాలకు, మరికొన్ని పార్టీలకు నడిపించాయి. పెళ్లే.. ఆమెను ఏడడుగులకు మించి ముందుకు నడిపించలేకపోయింది. జయప్రదకు పిల్లల్లేరు. వద్దనుకుంటే లేకపోవడం కాదు. పుట్టే భాగ్యం లేక లేకపోవడం కాదు. మరి ఎందుకు? బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సమీపంలోని జయప్రద విడిది గృహంలో కొన్నాళ్ల క్రితం సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆమెను కలిశారు. ఆ రోజు మిగతా మీడియా ప్రతినిధులెవరూ లేరు. జయప్రద, సాక్షి. అంతే. అదొక అపూర్వమైన సందర్భం. జయప్రద ఎన్నో సినిమాల్లో నవ్వి ఉంటారు. ఆ రోజు నవ్విన నవ్వు ఏ సినిమాలోనూ లేనిది. చిన్న పిల్ల నవ్వినట్టు పడీ పడీ నవ్వారు. ఆమె పోటీ నటి శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే.. నేను నవ్విస్తే..’ అనే పాటలో నవ్విన నవ్వేం పనికొస్తుంది? అలా నవ్వారు. అంత నవ్వూ.. ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అన్న ప్రశ్న దగ్గర సడన్గా ఆగిపోయింది! ‘మీరు పిల్లలెందుకు వద్దనుకున్నారు?’ అని నేరుగా అడగలేకపోయారు సాక్షి ప్రతినిధి. అందుకే ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అని అడిగారు. జయప్రద గ్రహించారు. ‘మీరు నేరుగా అడగలేని ప్రశ్నకు సమాధానం కూడా నేను నేరుగా చెప్పలేనిదే’ అన్న భావం సాక్షి ప్రతినిధికి ఆమె మౌనంలో ధ్వనించింది. జయప్రద గత సోమవారం షిర్డీ దర్శనానికి వచ్చి వెళ్లారు. ఆలయ ప్రాంగణం బయట ఈ సౌందర్యరాశి కొన్ని నిమిషాలపాటు అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమెలో నేటికీ ‘పూర్వపు నటి’ ఛాయలు మొదలు కాలేదు! సినిమాలు చేస్తే మళ్లీ చూస్తారు. రాజకీయాల్లోకి వస్తే మళ్లీ రాణిస్తారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో ఉన్నారు! దేశంలో కాంగ్రెస్ ఉండీ లేనట్లు ఉన్నట్లే, జయప్రద కాంగ్రెస్లో ఉన్నారు. బీజేపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు జయప్రద పార్టీ ఆర్.ఎల్.డి. రాష్ట్రీయ లోక్ దళ్. 2014లో యూపీలోని బిజ్నోర్ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అది అజిత్సింగ్ పార్టీ. అంతకు ముందు ఆమె పార్టీ ఆర్.ఎల్.ఎం. రాష్ట్రీయ లోక్ మంచ్. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పటికి ఆమె సమాజ్వాదీ పార్టీ నుంచి రెండోసారి రాంపూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అమర్సింగ్తో పాటు, అతడికి బహిరంగ మద్దతు ఇచ్చిన జయప్రదనూ పార్టీ నుంచి బహిష్కరించడంతో అమర్సింగ్ సొంత పార్టీ పెట్టుకుని (అదే ఆర్.ఎల్.ఎం) జయప్రదను కూడా కలుపుకున్నారు. రీ ఎంట్రీ? నో ఎంట్రీ? సమాజ్వాదీ పార్టీలోకి రాకముందు టీడీపీలో ఉన్నారు జయప్రద. ఎన్టీఆర్ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆమెను తన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. తెలుగు మహిళను చేశారు. రాజ్యసభకూ పంపారు. చివరికి పార్టీ నుంచే బయటికి పంపేశారు. అక్కడి నుంచి సమాజ్వాదిలోకి వెళ్లిపోయారు జయప్రద. సినిమా ప్రొఫైల్ కన్నా, రాజకీయాల్లో జయప్రద ప్రొఫైల్ చాలా పెద్దది! మూడు వందల సినిమాల్లో నటించారు కదా అనిపించవచ్చు. ఒకవేళ నరేంద్రమోదీ కనుక 2019 ఎన్నికల కోసం ఆమెను పార్టీలోకి తీసుకోదలిస్తే ఆమె నటించిన సినిమాలన్నిటినీ ముందేసుకుని చూడమని మాత్రం అమిత్షాకు కచ్చితంగా పురమాయించరు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యురాలిగా, పదేళ్లు ఎంపీగా జయప్రద అతి కీలకమైన అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. అదొక పెద్ద జాబితా. మోదీకి పరిశ్రమలు ముఖ్యం. విదేశీ వ్యవహారాలు ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యం. ఇక ముఖ్యం అయినా కాకున్నా.. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఆయనకు ముఖ్యం. ఈ కమిటీలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం జయప్రదకు ఉంది. అది మోదీ ఇమేజీకి ఉపయోగపడుతుంది. జయప్రద కూడా ఇప్పుడు మోదీ పాలనా విధానాలను సమర్థిస్తున్నారు. మొన్న షిర్డీ వచ్చినప్పుడు మోదీ నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ మాట్లాడ్డం ఒక ఎత్తుగడగా జరిగిందని మాత్రం అనుకోవడానికి లేదు. జయప్రదలోని రాజకీయ విజ్ఞత ఇంకా అంత ‘ఎత్తుకు’ ఎదగలేదు. ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలోనూ ఎక్కడా ఆమె తన ఉద్దేశాలను, ఉద్వేగాలను దాచుకోలేదు. కోపం వస్తే అరిచేశారు. భయం వేస్తే ఏడ్చేశారు. తను నమ్మినవాళ్ల వెంట వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న వాళ్ల వెంట వచ్చేశారు. ఎన్నికల కోడ్ని కూడా చూసుకోకుండా.. మహిళా ఓటర్ల నుదుటిపై ఆప్యాయంగా బొట్టు పెట్టారు. ఇప్పుడు కూడా, తను మోదీ వైపు మాట్లాడుతున్నప్పటికీ.. మోదీకి రాజకీయ ప్రత్యర్థులైన ములాయంని కానీ, అఖిలేశ్ని కానీ ఆమె విమర్శించడం లేదు. ములాయం తనను పార్టీ నుంచి బహిష్కరించారన్న బాధ ఆమెలో లేదు. అఖిలేశ్ నాకు తమ్ముడి లాంటి వాడు. ములాయం నాకు తండ్రి లాంటి వారు అంటున్నారు. అలాగని ఆ తండ్రీకొడుకుల పాలనలో యూపీ భలే బాగుందని అనడం లేదు. ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని జయప్రద ఏమాత్రం సంశయం గానీ, సంకోచం గానీ లేకుండా అంటున్నారు. రాజకీయాల్లో ఇది అరుదైన గుణం. ఈ గుణం బీజేపీకైనా, ఇంకొక పార్టీకైనా ఎంతవరకు పనికొస్తుందనేదాన్ని బట్టి మాత్రమే జయప్రద రాజకీయ పునఃప్రవేశం అన్నది సంభవం అవుతుంది. అంతులేని కథ ‘భూమికోసం’ చిత్రం తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ’. అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. డైరెక్టర్ కె.బాలచందర్! తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో తీస్తున్నారు ఆయన. తమిళ్లో సుజాత చేసిన పాత్రను ఇక్కడ జయప్రద వెయ్యాలి. అంత నిండైన పాత్రను ఈ అమ్మాయి చెయ్యగలదా? పెళ్లీడు దాటిపోయిన అమ్మాయిగా కనిపించాలి. కనిపించగలదా? సందేహాలన్నీ ఎగరగొట్టేశారు జయప్రద. బాలచందర్ ఎప్పుడో గానీ చప్పట్లు కొట్టరట. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు ఆయన క్లాప్స్ కొట్టారు. ‘సినిమాలకు పనికొస్తానా?’ అని ముందు భయపడిన జయప్రద.. ‘అంతులేని కథ’ విడుదలయ్యాక సినిమాలే జీవితంగా స్క్రీన్ మీదికి వచ్చేశారు. సిరిసిరిమువ్వ, భద్రకాళి, అడవిరాముడు, యమగోల, అందమైన అనుభవం, సాగర సంగమం, దేవత, మేఘసందేశం.. ఇవి కాక.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేశారు. ఇప్పటికీ అలాగే! జయప్రద ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆమె అందం. ఆ అందానికి కారణం మాత్రం ఆమె తీసుకునే ఆహారం, తీసుకోని ఆహారం కూడా! ఎప్పుడోగానీ జయప్రద లంచ్లో, డిన్నర్లో రైస్ ఉండదు. పండ్లు, పండ్ల రసాలు, తాజా కూరగాయలు, ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. సూప్స్ తాగుతారు. పూర్తిగా ఆకలి వేసే వరకు ఆగరు. కడుపు నిండా తినరు. పొట్ట తేలిగ్గా ఉంటే, ఒళ్లు హుషారుగా ఉంటుందట. ఈ ఆహార నియమాలతో పాటు యోగా చేస్తుంటారు. జిమ్కు వెళుతుంటారు. తొలి పారితోషికం 10 రూపాయలు ‘భూమికోసం’ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ పది రూపాయలు. పోటా పోటీ జయప్రద, శ్రీదేవి ఇంచుమించు ఒకే ఈడు వారు. ఒక స్క్రీన్ కడుపున పుట్టిన తోబుట్టువుల్లా కనిపించేవారు. శోభన్బాబు నటించిన ‘దేవత’ సినిమాలో వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కూడా నటించారు. అయితే బయట మాత్రం ఒకరితో ఒకరు ముభావంగా ఉండేవారు! ఎందుకనో దగ్గరితనం ఉండేది కాదు. ‘పోటీ ఉండేది కాబట్టి అలా ఉండేవాళ్లమేమో’ అని అనేవారు జయప్రద. రెండేళ్ల క్రితం 2015 నవంబర్ 27న హైదరాబాద్లో జయప్రద దత్తపుత్రుడు సిద్ధార్థ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి శ్రీదేవి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్లిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. పదవులు–బాధ్యతలు 1996–2002 : రాజ్యసభ సభ్యురాలు 1996–97 : పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సంప్రదింపులు, సమాచారం–ప్రసారాలు.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2004 : ఎంపీగా ఎన్నిక. (యూపీలోని రాంపూర్ నియోజకవర్గం) 2004–09 : సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, జల సంరక్షణ, నిర్వహణలపై పార్లమెంటరీ ఫోరం.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2009 : రెండోసారి ఎంపీగా ఎన్నిక (మళ్లీ అదే నియోజకవర్గం) 2009 : ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలు. ఇవన్నీ కాక.. 2014 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకైన పాత్ర. వ్యక్తిగతం జయప్రద (54): నటి, రాజకీయ నాయకురాలు అసలు పేరు: లలితారాణి జననం: 3 ఏప్రిల్ 1962 జన్మస్థలం: రాజమండ్రి (ఆం.ప్ర) తల్లిదండ్రులు: కృష్ణారావు, నీలవేణి చదువు: బి.ఎ. భర్త: శ్రీకాంత్ నహతా సంతానం: లేరు ఉండడం: ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ అభిరుచులు: మ్యూజిక్, డ్యాన్స్, చిత్రలేఖనం - మాధవ్ శింగరాజు -
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు. -
ప్రధాని కోటలోనూ మాదే విజయం
అజాంగఢ్: సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇద్దరికీ కలసి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ప్రచారం చేస్తున్న అఖిలేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో ఎస్పీ ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఆరు, ఏడో దశల ఎన్నికల్లోనూ తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని, తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అఖిలేష్ అన్నారు. 300 సీట్లు గెలుస్తామని చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మోదీ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నా, తమదే విజయమని, సంపూర్ణ మెజార్టీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉందన్నారు. -
ఎస్పీ తప్ప ఏ పార్టీలోనైనా చేరతా
షిర్డీ: సమాజ్వాదీ పార్టీలోకి తప్ప ఏ పార్టీ ఆహ్వానించినా అందులో చేరతానని సమాజ్వాదీ బహిష్కృత నేత, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. షిర్డీలో సోమవారం ఆమె మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేవన్నారు. సమాజ్వాదీ పాలనలో యూపీ గుండారాజ్గా మారిపోయిందన్నారు. అజంఖాన్ వంటి నేతలున్న సమాజ్వాదీ పార్టీలో ఎప్పటికీ వెళ్లనని చెప్పారు. మోదీని ఉద్దేశించి అఖిలేశ్ గాడిద అని సంబోధించడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందని కొనియాడారు. -
సమాజ్ వాది పార్టీ అభ్యర్థిపై కాల్పులు
లక్నో: సమాజ్ వాది పార్టీ అభ్యర్థి కుమారున్ని ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో గురువారం ఉదయం కాల్చారని పోలీసులు తెలిపారు. ఇందులో అభ్యర్థి చాలా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థి సిద్దా గోపాల్ కుమారుడు దీనికి కారణమని చెప్పారు. బాధితున్ని చికత్స కోసం కాన్పూర్కి తరలించారు. బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అరిదర్మాన్ సింగ్ బాధితుని కుటుంబసబ్యులతో్ మాట్లాడారు. Uttar Pradesh, Samajwadi Party, Siddha Gopal Sahu, victim, ఉత్తరప్రదేశ్, సమాజ్ వాది పార్టీ, సిద్దా గోపాల్, బాధితుడు -
అదంతా ములాయం నాటకం: అమర్సింగ్
-
అదంతా ములాయం నాటకం: అమర్సింగ్
న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్’ అంతా తూచ్ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్సింగ్. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్ యాదవ్ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్ బాంబు పేల్చారు. ‘ములాయం, అఖిలేశ్ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్ ఎన్–న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు. మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ ములాయం. కాంగ్రెస్తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు. -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్పై అమర్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మా పొత్తుతో మోదీ నవ్వు మాయం
రాహుల్ గాంధీ వ్యాఖ్య బందా(యూపీ): ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ చేతులు కలపడంతో ప్రధాని మోదీ ముఖంలో నవ్వు మాయమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ యూపీకి సొంత కొడుకు కాడని, దత్తపుత్రుడు మాత్రమేనని విమర్శించారు. ‘గంగామాత తన కొడుకు వారణాసికి పిలిపించుకుందని 2014లో మోదీ చెప్పారు.. మోదీజీ.. సంబంధాలనేవీ చెప్పుకుంటే కాదు పెంపొదించుకుంటే ఏర్పడతాయి’ అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, మోదీకి మాత్రం ఆ ఉద్దేశం లేదని ఆరోపించారు. మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: న్యూఢిల్లీ: యూపీలో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ఎన్నికల వాతావరణాన్ని మోదీ కలుషితం చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ‘మోదీ ఎన్నికల సభల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఖబరిస్తాన్ ఉన్నప్పుడు శ్మశానం కూడా ఉండాలని ఆదివారం ఆయన అన్న మాటలు సమాజాన్ని విడగొట్టేవే. ఆయన మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. -
యూపీలో గూండా రాజ్యం
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ► ఓటమి భయంతో అఖిలేశ్ ముఖం కళ తప్పింది ► యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఫతేపూర్: ఉత్తరప్రదేశ్లో గూండా రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్వాదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని ఆయన తప్పుపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫతేపూర్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... యూపీలో పోలీసుస్టేషన్లు సమాజ్వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ‘అఖిలేశ్ యాదవ్ ముఖం కళ తప్పింది. అతని మాటతీరు నీరసపడింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో పాటు, మాటల కోసం వెదుకులాడుతున్నారు. ఆటలో ఓటమిని ఆయన అంగీకరించారు’ అని మోదీ పేర్కొన్నారు అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ‘రాష్ట్రంలో పోలీసు విభాగం ఎందుకు అంత అసమర్ధంగా ఉంది? ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదు? ఇదేం పనితీరు?’ అంటూ మోదీ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రజాపతి తరఫున అఖిలేశ్ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం పదేళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందంటూ ఎస్పీ, బీఎప్పీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శిస్తూ... ‘ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదన్న విషయం పుట్టుకతోనే ప్రముఖులైనవారికి అర్థమైంది. అందుకే ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడింది’ అని విమర్శించారు. యూపీని దత్తత తీసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. శివాజీయే ఆదర్శం న్యూఢిల్లీ: మరాఠా యోధుడు శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. శివాజీ ఆలోచనలతోనే తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ‘శివాజీ వంటి గొప్ప నేత మన గడ్డపై పుట్టి మనల్ని పాలించటం గర్వకారణం. ధైర్య, సాహసాలు, సుపరిపాలనకు ఆయన పర్యాయపదం. ముంబైలో గొప్పగా శివ్స్మారక్ నిర్మించటమే ఆయన గొప్పతనానికి జాతి ఇచ్చే అసలైన నివాళి’ అని అన్నారు. -
సమరాంగుణ
ఏడు విడతలుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న ఆదివారం మూడో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ జరిగిన 69 నియోజకవర్గాలలోనూ అత్యంత కీలకమైన లక్నో కంటోన్మెంట్లో ప్రధానంగా బహుజన సమాజ్పార్టీ (బిఎస్పీ), భారతీయ జనతాపార్టీ (బీజేపి), సమాజ్వాది పార్టీ (ఎస్పీ) ల మధ్యే పోటీ నడిచింది. ఈ మూడు పార్టీలలోనూ మళ్లీ బీజేపీ, ఎస్పీల మధ్యే గట్టి ఫైట్ జరిగింది. ఇందుకు ఒక కారణం ఈ రెండు పార్టీల అభ్యర్థులూ మహిళలే కావడం. ఇంకో కారణం ఆ ఇద్దరు మహిళలూ సీనియారిటీలో ఒకరు, సీఎం ఇంటి నుంచి ఒకరు ప్రముఖ వ్యక్తులు కావడం! ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ... సమాజ్వాది పార్టీ నుంచి, డాక్టర్ రీటా బహుగుణ జోషి.. బీజేపీ నుంచి ఒకరితో ఒకరు తలపడ్డారు. కౌంటింగ్ మార్చి 11న. ‘ఎన్నికలవారి’ కుటుంబం కనుక అపర్ణ గెలవడంలో ఆశ్చర్యం లేదు. రీటా బహుగుణ ఓడిపోతేనే విశేషం. ఎందుకంటే రీటా... కాంగ్రెస్ అనే పెద్దింటి నుంచి వచ్చి, అంతే పెద్దదైన బీజేపీ అనే మెట్టినింట అడుగుపెట్టిన అమ్మాయి. రీటా బహుగుణ 2016 అక్టోబర్ 20న ‘వాస్తవాధీన హస్తరేఖ’ దాటి బీజేపీలోకి వచ్చేశారు. భారత సైనికులు 2016 సెప్టెంబర్ 29న వాస్తవాధీన రేఖ దాటి వచ్చిన పాక్పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపారు. ఏమిటి కారణం ఈ రెండు ఘటనలకు? సహనం నశించడం! 24 ఏళ్లుగా కాంగ్రెస్కు కాపుకాసిన తనను పక్కన పెట్టి, యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్ను పార్టీ పైకి తేవడంతో బహుగుణ షాక్కు గురయ్యారు. వెనువెంటనే సహనం కోల్పోకుండా ఉండేందుకు కొంత సమయం తీసుకున్నారు. భారత సైన్యం కూడా అంతే! చూసింది.. చూసింది. పాక్ మాట వినకపోవడంతో సహనం కోల్పోయి షాక్ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఏమిటి సంబంధం ఈ రెండు పరిణామాలకు? బీజేపీలో చేరడానికి బహుగుణ చెప్పని కారణం షీలాదీక్షిత్ అయితే, చెప్పిన కారణం.. సర్జికల్ స్ట్రైక్స్! ‘సైనికులు రక్తం చిందిస్తుంటే, మోదీజీ ఆ సైనికుల వెనుక దాక్కున్నారు’ అని కాంగ్రెస్ కామెంట్ చేసింది. ఆ కామెంట్ నచ్చకనే తను బీజేపీలోకి వచ్చినట్టు రీటా బహుగుణ చెప్పుకున్నారు. ప్రతీకారంలో.. అసమాన ప్రతిభ! కామెంట్లకు తీరిగ్గా చింతించేంత సున్నిత హృదయురాలేమీ కాదు రీటా. కామెంట్లకు వెంటనే కోపం తెచ్చుకునేంత అపరిణత మనస్కురాలు కూడా కాదు. రాటు దేలిన పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమెది! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంతి హెచ్.ఎన్. బహుగుణ కూతురు ఆమె. ఎంపీ కమలా బహుగుణ ముద్దుల కూతురు ఆమె. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ చెల్లెలు ఆమె. అలహాబాద్ మేయర్ ఆమె. అఖిలభారత మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమె. జాతీయ మహిళా కౌన్సిల్ ఉపాధ్యక్షురాలు ఆమె. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె. అన్నిటినీ మించి కాంగ్రెస్ పార్టీ ఆడకూతురు ఆమె! అయితే ఇవన్నీ అతి ప్రాచీనమైన విషయాలు. ఈ కాంగ్రెస్ రాజనీతిజ్ఞురాలు ప్రస్తుతం బీజేపీ కార్యకర్త! ఇప్పుడామె భుజంపై వేసుకున్న కార్యం.. అపర్ణా యాదవ్పై గెలిచి, లక్నో కంటోన్మెంట్ సీటును బీజేపీకి బహుమతిగా ఇవ్వడం! బహుగుణ ఇచ్చిన బహుమతిగా అమిత్షా మెప్పు పొందడం. కాంగ్రెస్ను కుళ్లికుళ్లి చచ్చేలా చేయడం. కానీ ఒక్కసీటు పోయినందుకు కాంగ్రెస్ కుళ్లికుళ్లి చస్తుందా? చావదు. రీటాను కోల్పోయినందుకు మాత్రం చస్తుంది. కాంగ్రెస్ను వదిలి రీటా వెళ్లిపోవడానికి, మిగతావాళ్లు వెళ్లిపోవడానికీ తేడా ఉంది. ప్రత్యర్థికి ఫినిషింVŠ టచ్ ఇవ్వడంలో రీటా.. కాంగ్రెస్ పరిభాషలో ప్రతిభావంతురాలు. యూపీలో ఆ ప్రతిభ ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర లేదు. మాటను వదిలితే.. అది బాణమే! మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీటా 14 రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాహుల్, దిగ్విజయ్సింగ్లతో పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. రీటా ఎం.ఎ. చదువుకున్నారు. హిస్టరీలో పీహెచ్డీ చేశారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఇప్పటికీ ఆమె మధ్యయుగాల, ఆధునిక కాలాల చరిత్రను బోధిస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితి ఆమెకు ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమెన్ ఇన్ సౌత్ ఏషియా’ అంటూ ఎక్స్లెన్స్ అవార్డు కూడా ఇచ్చింది. అయితే రీటా రాజకీయ జీవితంలో ఇవేవీ ఆమె అసలైన పాటవాలు కావు. కాంగ్రెస్లోకి రాకముందు ఆమె రాసిన చరిత్ర పుస్తకాలు సైతం పార్టీలో ఆమెకు ఇవ్వని గుర్తింపును.. సుతిమెత్తగా కనిపించే ఆమెలోని సూదంటు స్వరం ఇచ్చింది. ఆ స్వరంలోంచి బాణాల్లా దూసుకొచ్చే మాటలు ఇచ్చాయి. పార్టీలో ఆమెను ప్రముఖురాలిగా చేసిన ఆ మాటలే.. కొన్నిసార్లు ఆమెను చట్టం దృష్టిలో దోషినీ చేశాయి. మాయావతికి కోటి పరిహారం! రీటా ప్రసంగం మరీ అంత రెచ్చగొట్టేలా ఏమీ ఉండదు కానీ ఆ గొంతులో ఎంతో సౌమ్యంగా గంధకం మండుతుంది. ఓసారి రీటా ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల సమస్యలపై మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి అన్నారు. అత్యాచార బాధితులకు చేతిలో ఓ పాతిక వేలు పెట్టి మాయావతి చేతులు దులుపుకుంటోంది అన్నారు. అంతవరకు బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లారు రీటా. ‘డబ్బు తీసుకోకండి. డబ్బు ఇవ్వబోతే మాయావతి ముఖాన కొట్టండి’ అని అత్యాచార బాధితులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆగలేదు. ‘నీపై కూడా అత్యాచారం జరుగుతుంది. అప్పుడు నీకు మేము కోటి రూపాయల పరిహారం ఇస్తాం’ అని మాయవతిని ఉద్దేశించి అన్నారు! అలా అన్నప్పుడే మొరాదాబాద్ జైల్లో రీటా రెండు వారాల పాటు జ్యుడీషియల్ రిమాండులో ఉండవలసి వచ్చింది. ఇంకోసారి పశ్చిమ యూపీలోని భట్టా పర్సౌల్ గ్రామంలో రైతు సమస్యలపై మాట్లాడుతున్నారు రీటా బహుగుణ. పక్కన రాహుల్, దిగ్విజయ్సింగ్ కూడా ఉన్నారు. రైతుల ఇక్కట్లకు కారణం మాయావతేనని రీటా అంటున్నారు. రైతుల ఉసురు తీస్తున్న ఈ ప్రభుత్వాన్ని కలుపు మొక్కల్లా ఏరిపారేద్దాం రండి అన్నారు. మీరట్ రేంజి పోలీసులు పరుగున అక్కడి వచ్చారు. రీటాను, మిగతా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఖాకీ రంగ్ కి హాఫ్ ప్యాంట్ వాలే మహిళా ఉద్యమాలలో పాల్గొని, మహిళా రిజర్వేషన్ల కోసం పట్టుపట్టి, మహిళలకు సమన్యాయం కోసం పోరాడిన రీటా బహుగుణ.. ఒక మహిళ అయిన మాయవతి విషయంలో మాత్రం ఏమాత్రం సహానుభూతితో లేకపోవడం వింతగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే శుక్రవారం వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో రీటా తన రాజకీయ ప్రత్యర్థి అపర్ణతో కూడా అంతే విసురుగా ఉన్నారు! ‘ఆ పిల్లకు సభ్యతగా మాట్లాడ్డం తెలీదు. పొగరుగా ఉంటుంది. నేలపైకి దిగి నడవాలని నా సలహా’ అని అపర్ణ గురించి అన్నారు రీటా. అపర్ణ కూడా తక్కువేం అనలేదు. ‘ఆవిడ ఎంత సభ్యతగా మాట్లాడేవారో నేను విన్నాను. అయినప్పటికీ నేను ఆవిడను గౌరవిస్తాను. పెద్దల్ని గౌరవించడం మన సంప్రదాయం కదా’ అని అంటించారు. కాంగ్రెస్ యు.పి.చీఫ్ రాజ్ బబ్బర్ కూడా రీటాపై అసహనంతో ఉన్నారు. ఆ అసహనం ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినందుకో, బీజేపీలో చేరినందుకో స్పష్టంగా తెలియనివ్వడం లేదు బబ్బర్. ‘ఖాకీ రంగ్ కి హాఫ్ ప్యాంట్ వాలే.. అపర్ణ చేతిలో ఓడిపోవడం ఖాయం’ అని ఆయన కామెంట్ చేశారు. అయితే ఓటమికి చలించిపోయే మనిషి కాదు రీటా బహగుణ జోషీ. 2014లో లక్నో నుంచి రాజ్నాథ్సింగ్పై లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2009లోనూ అదే నియోజకవర్గంలో లాల్జీ లాండన్పై పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అప్పుడలా.. ఇప్పుడిలా... రీటా బహుగుణ బీజేపీలో చేరాక ఆర్ణబ్ గోస్వామి, మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ çసర్దేశాయ్ ఆమెను ఇంటర్వూ్య చేశారు. ‘మోదీజీ రెండేళ్ల పాలననీ, మోదీజీ అచ్ఛేదిన్ని, మోదీజీ స్వచ్ఛభారత్ని, మోదీజీ గోద్రా దారుణాలను విమర్శించారు. ఇప్పుడేమో మోదీజీకి ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు! అకస్మాత్తుగా ఇప్పుడు మోదీజీ మంచివారు ఎలా అయ్యారు? బీజేపీలో మీరెలా చేరారు? అని అడిగారు. అన్నిటికీ రీటా చెప్పిన సమాధానం ఒక్కటే. వాటి అర్థం.. సర్జికల్ స్ట్రైక్స్ మోదీజీని పునీతుణ్ణి చేశాయని! అయితే ఈ ఎన్నికల్లో రీటా బహుగుణ గెలిస్తే కనుక అదే మాటను ఆమె మరింత స్పష్టంగా చెప్పడానికి ఉత్సాహం కనబరచవచ్చు. రీటా బహుగుణ జోషి (67) జననం : 1949 జూలై 22 జన్మస్థలం : ఉత్తరాఖండ్ పార్టీ : కాంగ్రెస్ (1992–2016) బీజేపీ (2016 నుండి) ప్రాతినిధ్యం : లక్నో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (2012 నుంచి) ప్రస్తుతం : మళ్లీ అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ. తల్లిదండ్రులు : దివంగతులు బహుగుణ, కమల తోబుట్టువులు : విజయ్, శేఖర్ భర్త : పి.సి.జోషి (ఇంజనీరు) సంతానం : మయాంక్ జోషి రీటాను గుర్తు పట్టని తివారీ! గత పార్లమెంటు ఎన్నికలకు (2014) ముందు జరిగిన ఒక ‘రాజకీయ సంఘటన’ను రీటా జీవితంలోని ఒక ఆసక్తికరమైన సందర్భంగా చెప్పుకోవాలి. లక్నో లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి రాజ్నాథ్సింగ్, కాంగ్రెస్ నుంచి రీటా బహుగుణ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. యు.పి.కురువృద్ధ కాంగ్రెస్ నేత ఎన్.డి.తివారీ (88) ఆశీస్సుల కోసం రాజ్నాథ్సింగ్ ఆయన ఇంటికి వెళ్లి, వంగి ఆయన కాళ్లకు నమస్కరించారు. తివారీ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, తలపై చెయ్యి ఉంచి ‘విజయీభవ’ అని దీవించారు. ఈ సంగతి తెలిసి, మర్నాడే రీటా బహుగుణ తివారీ ఆశీస్సుల కోసం వెళ్లారు. అయితే తివారీ ఆమె ఎవరో తెలియనట్లుగా ముఖం పెట్టారు! ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఇది: తివారీ : నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? రీటా: నేను లక్నో నుంచి పోటీ చేస్తున్నాను. మీ ఆశీస్సుల కోసం వచ్చాను. తివారీ: నీ పేరేంటి? రీటా: రీటా బహుగుణ జోషీ. తివారీ: నీది ఏ పార్టీ? రీటా: దాదా.. నేను కాంగ్రెస్. నేను మీకు తెలుసు. గత నెలలో కూడా నేను మిమ్మల్ని కలిశాను. నిన్న రాజ్నాథ్జీ మీ ఆశీస్సుల కోసం వచ్చారని తెలిసి, నేనూ వచ్చాను. తివారీ: నిన్న రాజ్నాథ్ నన్ను కలిశాడా? రీటా: అవును. తివారీ: నేను అతడిని బ్లెస్ చేశానా? రీటా: అవునట. అలా అని చెప్పుకుంటున్నాడు. (ఇలా సాగుతోంది సంభాషణ..) తివారీకీ, రీటా తండ్రి హెచ్.ఎన్.బహుగుణకు పూర్వ స్నేహవైభవం ఉండేది. ఆ వైభవాన్ని రీటా గుర్తు చేశారు. ఆ తర్వాతే ఆయన.. రీటాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తన లెటర్ హెడ్పై లక్నో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజానికి రీటా ఎవరో తివారీకి బాగా గుర్తుందనీ, ఉత్తరాఖండ్ టికెట్ను తన కొడుకు రోహిత్ కు ఇవ్వకపోవడంతో సోనియా గాంధీపై కోపాన్ని ఇలా రీటా మీద ప్రదర్శించారని మీడియా ఊహించింది. ఈసారైతే తివారీ ఆశీస్సుల కోసం వెళ్లలేదు రీటా. (తివారీ కూడా ఆయన కొడుకు రోహిత్ శేఖర్తో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు.) తివారీ ఆశీస్సుల కోసం... (ఫైల్ ఫొటో) -
అఖిలేష్ ప్రచారానికి వార్ రూమ్ సపోర్టు
-
త్రిముఖ హోరాహోరీ
మూడో దశ పోరు ముగ్గురికీ ప్రతిష్టాత్మకం - 2012 ఫలితాల పునరావృతం కోసం ఎస్పీ తహతహ - 2014 ఫలితాలను మళ్లీ రాబట్టేందుకు బీజేపీ కృషి - ఆ రెండిటినీ మౌనంగా అధిగమించేంలా బీఎస్పీ వ్యూహం - మారుతున్న పరిస్థితుల్లో మూడు పక్షాల హోరాహోరీ (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరప్రదేశ్లో ఆదివారం జరుగనున్న మూడో దశ ఎన్నికలు.. అధికార సమాజ్వాది పార్టీతో పాటు.. అటు బీజేపీకి, ఇటు బీఎస్పీకి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్న సమాజ్వాది పార్టీకి ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కీలకం. రాష్ట్రంలో అధికారంలోకి రెండో స్థానంలోనన్నా నిలవడం బీజేపీకి ముఖ్యం. ఆ రెండు పార్టీలనూ ఓడించి.. ప్రస్తుత సమీకరణాలను మార్చివేయడం బీఎస్పీకి అత్యవసరం. మూదో దశలో ఫరూకాబాద్, హర్దోయ్, కన్నౌజ్, మయిన్పురి, ఇటావా, అరాయియా, కాన్పూర్, కాన్పూర్ , ఉన్నావ్, లక్నో, బారాబంకి, సితాపూర్ – మొత్తం 12 జిల్లాల్లోని 69 శాసనసభ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ప్రచారం ముగిసింది. 2012 శాసనసభ ఎన్నికల్లో ఈ 69 సీట్లలో ఎస్పీ 55 సీట్లు గెలుచుకోగా బీఎస్పీ ఆరు సీట్లు, బీజేపీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు చొప్పున గెలుచుకున్నారు. అయితే.. 2014 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ నాయకత్వానికి చెందిన యాదవ్ కుటుంబానికి సొంత కోటలైన కన్నౌజ్, మయిన్పురి జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్లా బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో.. 2012 ఫలితాలను పునరావృతం చేయాలని ఎస్పీ.. 2014 ఫలితాలను నిలుపుకోవాలని బీజేపీ.. ఆ రెండిటినీ అధిగమించాలని బీఎస్పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్యా హోరాహోరీ పోరాటం నెలకొంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం లక్నో, ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ స్వస్థలమైన ఇటావా, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం కన్నౌజ్, ఎస్పీ ఎంపీ, ములాయం బంధువు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మయిన్పురి ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఇది కోటీశ్వరుల ఖిల్లా! మూడో దశ ఎన్నికల్లో పోటీపడుతున్న 826 మంది అభ్యర్థుల్లో 250 మంది కోటీశ్వరులు, 110 మంది నేర చరితులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్లు వెల్లడించాయి. మొత్తం ఆరు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీలు, 92 గుర్తింపులేని పార్టీల అభ్యర్థులతో పాటు.. 225 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ‘మూడో దశ’లో.. 67 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 56 మంది, 68 మంది బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది, 59 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 51 మంది, 14 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, 40 మంది ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో 13 మంది, 225 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 24 మంది.. తమకు కోటి రూపాయల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎస్పీకి చెందిన అనూప్కుమార్ గుప్తా (రూ. 42 కోట్లు) అత్యధిక ధనవంతుడు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్కపూర్ (రూ. 31 కోట్లు), ఎస్పీ అభ్యర్థి సీమా సచన్ (రూ. 29 కోట్లు) ఉన్నారు. 110 మంది నేరచరితులు: ఇక నేరారోపణలు గల 110 మంది అభ్యర్థుల్లో.. 82 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో 21 మంది, బీఎస్పీ అభ్యర్థుల్లో 21 మంది, ఎస్పీ అభ్యర్థుల్లో 13 మంది, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఐదుగురు, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో ఐదుగురు, స్వతంత్రుల్లో 13 మందిపై ఈ కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో పరిస్థితులు మారాయి సమాజ్వాది పార్టీకి గత ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని అందించిన ఈ 12 జిల్లాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒకవైపు బీఎస్పీ, మరోవైపు బీజేపీలు కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. 2012 ఎన్నికల్లో మయిన్పురి, ఇటావా, ఆరాయియా, బారాబంకి, కన్నౌజ్ జిల్లాల్లో ఎస్పీ స్వీప్ చేసింది. హర్దోయ్ జిల్లాలోని 8 సీట్లలో ఆరు సీట్లను, ఫరూఖాబాద్ జిల్లాలోని నాలుగు సీట్లలో మూడు సీట్లను, ఉన్నావ్ జిల్లాలోని ఆరు సీట్లలో ఐదు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలకు ఇక్కడ విజయం నామమాత్రంగానే ఉండింది. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుకట్టి పోటీ చేస్తున్న అధికార పార్టీకి.. అభ్యర్థుల ఎంపికల్లో గొడవలు, అసమ్మతి నేతల తిరుగుబాట్లు, కులాల పునఃసమీకరణలు వంటి అంశాలు చిక్కుల్లోకి నెడుతున్నాయని అంచనా. పట్టణాల్లో మారుతున్న గాలి అలాగే సంప్రదాయంగా గతంలో బీజేపీకి ఆలంబనగా ఉన్న పట్టణ ప్రాంతాలు లక్నో, కాన్పూర్లలో ఐదేళ్ల కిందట సైకిల్ హవా వీచినా.. ఇప్పుడు గణనీయమైన మార్పులు రావచ్చునంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 19 సీట్లు (కాన్పూర్ రూరల్ మినహాయించి) ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఇమేజీని గ్రామీణ పార్టీ నుంచి ఆధునిక పార్టీగా మార్చడానికి అఖిలేశ్ చేసిన కృషితో పాటు.. ఉచిత ల్యాప్టాప్లు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత వైద్యం వంటి హామీలు ఇక్కడ కలిసివచ్చాయి. మరోవైపు అంతర్గత పోరుతో పాటు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఫలితంగా.. బీజేపీ ఆధిక్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీని ఎస్పీ అధిగమించింది. లక్నోలోని 9 సీట్లలో ఏడు, కన్పూర్లోని 10 సీట్లలో ఐదింటిని గెలుచుకుంది. ఇక్కడ గతంలో ఎన్నడూ ఎస్పీకి ఈ విజయం అందలేదు. ఇక బీజేపీ లక్నోలో ఒక్క సీటు, కాన్పూర్లో నాలుగు సీట్లు గెలుచుకుంది. కన్పూర్లో మరొక సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంత ఓటర్లు మళ్లీ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కొన్నిచోట్ల అసంతృప్త నేతల తిరుగుబాటుతో పాటు.. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలపడం ఇందుకు ఒక కారణమైతే.. బీఎస్పీ అభ్యర్థుల వల్ల కూడా అధికార పార్టీకి నష్టం వాటిల్లేలా ఉందని చెప్తున్నారు. లక్నోలో లక్కు ఎవరిదో..? రాష్ట్ర రాజధాని లక్నో నగరంలోని 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఎస్పీకి చాలా కీలకమైన విషయం. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఏడు స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ, బీఎస్పీలో చెరొకటి ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో లక్నో లోక్సభ స్థానం బీజేపీ వశమైంది. ఇప్పుడు.. ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ లక్నో కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మరో ముగ్గురు మంత్రులు కూడా నగరంలో బరిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటాబహుగుణజోషి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. ఆమె మీద అపర్ణాయాదవ్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున యోగేష్దీక్షిత్ బరిలో ఉన్నారు. సరోజినీ నగర్లో అఖిలేశ్ బంధువైన అనురాగ్యాదవ్కు ఎస్పీ టికెట్ ఇవ్వడంతో.. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే ఆర్ఎల్డీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఎస్పీ ఆకర్షణ మంత్రం.. ఇక ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి బీఎస్పీ రచించిన వ్యూహం.. ఈ మూడో దశ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందనీ చెప్తున్నారు. బారాబంకి, రామ్నగర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఏనుగు వైపు మొగ్గుచూపుతుండటం.. ఎస్పీ ఠాకూర్ అభ్యర్థులకు ప్రతికూలంగా మారవచ్చు. సీతాపూర్ జిల్లాలోని లహార్పూర్, సెవాటా సీట్లతో పాటు.. కన్నౌజ్ జిల్లాలోని చిబ్రమావు, ఉన్నావ్ జిల్లాలోని బంగేర్మావు, ఫరూకాబాద్ జిల్లాలోని ఫరూకాబాద్ సదర్, హర్దోయ్ జిల్లాలోని షాహాబాద్ సీట్లలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా బీఎస్పీ వైపు చూస్తున్నట్లు పరిశీలకులు చెప్తున్నారు. అలాగే.. ఎతావా, భగ్వంత్నగర్ సీట్లలో బీఎస్పీ ముస్లిమేతర అభ్యర్థులకు.. బీజేపీ అభ్యర్థులను ఓడించగల సత్తా ఉండటంతో అక్కడి ముస్లిం ఓటర్లు కూడా ఏనుగు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. దీనికి బీఎస్పీ మౌనంగా ఉపయోగిస్తున్న ‘బ్రాహ్మణ కార్డు’ కూడా తోడవుతోంది. ఈసారి 67 మంది బ్రాహ్మణ అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దించింది. రాష్ట్రంలో మరే పార్టీ ఇంత మంది బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. పార్టీ ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా.. అది దోహదం చేస్తోంది. హర్దోయ్ జిల్లాలోని సవాయిజ్పూర్, బిల్గ్రామ్-మల్లవాన్ సీట్లు, ఆరాయియా జిల్లాలోని దిబియాపూర్, ఎతావా జిల్లాలోని ఎతావా సదర్ సీట్లలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని బ్రాహ్మణ వర్గాలు సంప్రదాయంగా బీజేపీ మద్దతుదారులైనప్పటికీ.. ఈసారి వారిలో బీఎస్పీ అభ్యర్థులకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. బీఎస్పీకి శివ్పాల్ సాయం! ఇక ఎస్పీ నాయకత్వ కుటుంబంలో ఇటీవల రచ్చరచ్చ అయిన ఆధిపత్య పోరు.. యాదవ్ల కోటలైన ఇటావా, మయిన్పురి జిల్లాల్లో ప్రతిఫలిస్తోంది. ఇక్కడ అఖిలేశ్ బాబాయ్ శివ్పాల్ యాదవ్ శిబిరం.. బీఎస్పీ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. శివ్పాల్ సన్నిహితులైన కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం.. ఆయన మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. మయిన్పురి జిల్లాలోని కిష్నీ, కర్హాల్, భోగావ్ సీట్లలో బీజేపీ కన్నా.. బీఎస్పీ నుంచే అధికార పార్టీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇక్ మయిన్పురి సదర్ నియోజకవర్గంలో శివ్పాల్ మద్దతుదారులు ఎస్పీ అభ్యర్థికి వ్యతిరేకంగా బాహాటంగానే పనిచేస్తున్నారు. ఇక సీతాపూర్ జిల్లాలో సెవాతా, బిస్వాన్ నియోజవర్గాల్లో పార్టీ టికెట్ లభించిన ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి.. ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మారుతున్న కుల సమీకరణాలు ఇక ఎస్సీ వర్గాల వారిలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతుండటం ఎస్పీకి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఈ ప్రాంతంలో బలమైన ఎస్సీ వర్గమైన పాసీలు సంప్రదాయంగా ఎస్పీ, బీఎస్పీ మద్దతుదారులు. అయితే.. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ వర్గం ఓట్లను గణనీయంగా సంపాదించుకోగలిగింది. ఇప్పుడు కూడా లక్నోలోని మోహన్లాల్గంజ్, హర్దోయ్ జిల్లాలోని బలామావు, సాండీ (మూడూ ఎస్సీ రిజర్వుడు స్థానాలు)ల్లో కమలదళం బలమైన పాసీ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆ వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు. బారాబంకి-సీతాపూర్ ప్రాంతంలో కుర్మీల అసంతృప్తి కూడా ఎస్పీకి సమస్యగా మారిందని పరిశీలకులు చెప్తున్నారు. ఎస్పీ రాజ్యసభ్యుడు, కుర్మీ నాయకుడు అయిన బేణీప్రసాద్వర్మ కుమారుడికి టికెట్ నిరాకరించడంతో.. ఆ వర్గం వారు బీఎస్పీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
మాటలు - మంటలు
-
నేడు యూపీ, ఉత్తరాఖండ్లలో పోలింగ్
-
నేడు యూపీ, ఉత్తరాఖండ్లలో పోలింగ్
లక్నో/డెహ్రాడూన్ : రెండో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. అలాగే ఉత్తరాఖండ్లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిబిత్, బిజ్నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2.28 కోట్ల మంది ఓటేయనుండగా, అందులో మహిళలు 1.04 కోట్ల మంది ఉన్నారు. 720 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బర్హాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని 69 స్థానాలకు మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మిస్డ్ కాల్ మేనిఫెస్టో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త విధానంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలను తెలుసుకోవాలనే ఓటర్లు ఒక నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఆ సమాచారాన్ని ఫోన్ లోనే పొందొచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి తిరిగి ఫోన్ వస్తుంది. ఆన్సర్ చేయగానే కేవలం 60 సెకన్లలో మేనిఫెస్టోలోని 16 ప్రధానాంశాలను వినిపిస్తారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ప్రచారం చేయలేరు కాబట్టి ఈ విధానం ఉపయోగపడుతుందని అంటున్నారు. -
ఎస్పీ పట్టు నిలిచేనా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ముస్లింలు, ఓబీసీలు అధికంగా ఉన్న తెరాయ్, రహేల్ఖండ్ ప్రాంతాల్లోని 11 జిల్లాల్లో 67 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ముస్లింల అండతో 2012లో ఇక్కడ దాదాపు సగం(34) సీట్లు గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఈసారి కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. బలమైన మైనారిటీ నేత, రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ ఈ ప్రాంతంలో ఎస్పీకి పెద్ద దిక్కు. ఎస్పీలో అంతర్గత చిచ్చు, గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ హవా నేపథ్యంలో ప్రస్తుతం ఎస్పీ ఊపు అంతగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ముస్లింల ఆధిక్యం.. ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దు జిల్లాల ప్రాంతం తెరాయ్. మొఘలుల హయాంలో ఆఖరిదశలో అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన రుహెల్లా పఠాన్లు పాలించిన ప్రాంతం రహేల్ఖండ్. ఈ రెండు ప్రాంతాల్లో ముస్లింల జనాభా దాదాపు 36 శాతం. రాంపూర్ జిల్లాలో ఏకంగా 50 శాతం ముస్లింలే. టర్కులు, పఠాన్లు, సైఫీలు, అన్సారీలు.. ముస్లింలలో బలమైన వర్గాలు. ఓబీసీల్లో కుర్మీలు బలీయంగా ఉన్న ప్రాంతమిది. తర్వాతి స్థానం మౌర్య కులస్తులది. షహరన్ పూర్ జిల్లాలో రాజకీయంగా, సంఖ్యాపరంగా గుజ్జర్ల ఆధిక్యంలో ఉంది. ఎస్పీకి దన్ను గా నిలిచే యాదవ సామాజికవర్గం బదౌన్, సంబల్లు మినహా మిగతా 9 జిల్లాల్లో పెద్దగా లేదు. దీంతో ఆ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్లపైనే ఆధారపడుతోంది. వీరిలో ఓట్లలో చీలిక వస్తే నష్టపోతామని భయపడుతోంది. బరిలో నిలిచిన ఎంఐఎం, ఇతర చిన్నాచితక ముస్లిం పార్టీల ప్రభావం అంతగా ఉండకపోవచ్చుగాని, వీరివల్ల జరిగే ఎంతోకొంత నష్టం మాత్రం ఎస్పీకే. తాజా ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు 18 సీట్లు ఇచ్చిన ఎస్పీ... హస్తంతో తమ పొత్తుపై, అభివృద్ధికి పెద్దపీట వేసే యువ సీఎంగా అఖిలేశ్కు ఉన్న ఇమేజ్పై ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం ఎస్పీకి సవాల్గా మారింది. దళిత, మైనారిటీ వాదాన్ని వినిపించే బీఎస్పీకి ఈ ప్రాంతంలో ఏనాడూ 20 శాతానికి మించి ముస్లిం ఓట్లు పడలేదు. అయితే పలు జనరల్ స్థానాల్లో బీఎస్పీ తరఫున మాత్రమే ముస్లిం అభ్యర్థి ఉండటం, నియోజకవర్గాల వారీగా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలు ఓటేస్తే ఆ పార్టీ లాభపడుతుంది. బీఎస్పీకి సహజంగా ఉండే దళిత ఓటు బ్యాంకూ ఉంటుంది. చిక్కుల్లో బీజేపీ.. బదౌన్, ఖేరి జిల్లాలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ను వీడి వచ్చిన వారికి టిక్కెట్లిచ్చిన బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. యాదవేతర ఓబీసీల్లో బలం కూడగట్టుకుంటున్న బీజేపీకి అగ్రవర్ణాల మద్దతు ఉంది. మతపరమైన ఓట్ల విభజనకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. హిందువుల, ఓబీసీల్లోని యాదవేతరుల ఓట్లను ఏకం చేయడం ద్వారా ఇక్కడ సీట్లను పెంచుకోవాలని (2012లో బీజేపీ పదిచోట్లే గెలిచింది) చూస్తోంది. ఎస్పీలో అంతర్గత కలహాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలు తమకు కలసి వస్తాయని భావిస్తోంది. ఇక్కడి రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే చెరుకు రైతుల బకాయిలను ఇప్పిస్తామని హామీ ఇస్తోంది. పోటీలో ఉన్న ప్రముఖులు ఆజంఖాన్ (మంత్రి– ఎస్పీ)– రాంపూర్, అబ్దుల్ అజం (ఆజంఖాన్ కుమారుడు, ఎస్పీ)– సువార్, జితిన్ ప్రసాద్ (మాజీ కేంద్రమంత్రి– కాంగ్రెస్)– తిల్హర్, మెహబూబ్ అలీ (మంత్రి– ఎస్పీ)– అమ్రోహా, సురేష్ కుమార్ ఖన్నా (బీజేఎల్పీ నాయకుడు)– షాహజాన్ పూర్. రెండో దశ పోలింగ్ అసెంబ్లీ నియోజకవర్గాలు 67 బరిలో ఉన్న అభ్యర్థులు 720 ఇందులో మహిళలు 39 మొత్తం ఓటర్లు 2.28 కోట్లు ఇందులో మహిళలు 1.04 కోట్లు పోలింగ్ కేంద్రాలు 14,771 పోలింగ్ బూత్లు 23,693 2012 ఎన్నికల్లో 67 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఎస్పీ 34 బీఎస్పీ 18 బీజేపీ 10 కాంగ్రెస్ 3 ఇతరులు 2 జిల్లాలు– అసెంబ్లీ స్థానాలు: షహరన్ పూర్–7, బిజ్నోర్–8, మొరాదాబాద్–6, సంబల్–4, రాంపూర్–5, బరేలీ–9, అమ్రోహా–4, ఫిలిబిత్–4, ఖేరి–8, షాహజాన్ పూర్–6, బదౌన్ –6. -
‘నేను అసలు ఏ పార్టీ పెట్టట్లేదు’
లక్నో: ‘కొత్త పార్టీ పెడతాను.. నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావో చూస్తాను’ అంటూ అనూహ్య కామెంట్లు చేసి సమసిపోయిందనుకున్న సమాజ్వాది పార్టీలోని అసమ్మతి ముసలానికి మరోసారి ఊపిరిలూదీన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ మాట మార్చారు. ఎట్టకేలకు తాను అసలు ఏ పార్టీ పెట్టడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం మీడియా ముందు స్పష్టం చేశారు. ఆ రోజు ఏవో కోపంతో మాటలు అని అర్ధం వచ్చినట్లుగా ఆయన బదులిచ్చారు. ఎప్పటికీ తన సోదరుడు ములాయంతోనే ఉండిపోతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితా తేది మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొడుకు చేసిన చర్యలపై తొలుత అలకబూనిన ములాయం ఆ వెంటనే అందులో నుంచి బయటకు రావడమే కాకుండా కాంగ్రెస్, ఎస్పీలు విజయం సాధిస్తాయని స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు శివపాల్ ఏదో కోపంలో ఆ రోజు పార్టీ పెడతానని, అన్నాడేగానీ నిజానికి అలాంటిదేమీ లేదని చెప్పారు. దీనికి కొనసాగింపుగానే తాజాగా శివపాల్ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత మరిన్ని వార్తలకై చదవండి పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా అఖిలేశ్కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్కు రెండు చక్రాలం -
పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనగా మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు సవాల్ విసిరారు. అఖిలేష్కు శివపాల్ స్వయానా బాబాయ్ అవుతారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎస్పీ జతకట్టడాన్ని శివపాల్ తప్పుపట్టారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన ములాయం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎతాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, యూపీలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవలేదు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ తరఫునే జస్వంత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ములాయంను అఖిలేష్ అవమానించారని, కావాలనే తన వర్గీయులకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎక్కువ మంది తనతోనే ఉన్నారని శివపాల్ చెప్పారు. యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 11న ఓట్లను లెక్కిస్తారు. సమాజ్వాదీ పార్టీ.. అఖిలేష్, శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్గా ఉన్న శివపాల్ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి అఖిలేష్ పోరాడుతున్నారు. సంబంధిత వార్తలు చదవండి అఖిలేశ్కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్కు రెండు చక్రాలం -
ఉత్తరప్రదేశ్లో...
బీజేపీదే గెలుపు! టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 202 సీట్లు ౖకైవసం చేసుకోగలదని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వేలో తేలింది. ఎన్నికల్లో 34% ఓట్లు బీజేపీకి దక్కుతాయని సర్వే పేర్కొంది. ఇక, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి కేవలం 147 సీట్లు గెలుచుకోగలదని, కూటమికి 31శాతం ఓట్లుపడతాయని సర్వే వెల్లడించింది. ముస్లిం ఓట్లపై ఆశలుపెట్టుకున్న మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కేవలం 47సీట్లు వస్తాయంది. బీఎస్పీకి 24శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొంది. అజిత్సింగ్కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్, ఇతర పార్టీలకు ఏడు సీట్లు దక్కుతాయని తెలిపింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంగా అఖిలేశ్ యాదవ్ తొలిస్థానంలో నిలిచారు. 39% మంది అఖిలేశ్కు మద్దతుపలికారు. 23% మంది మద్దతుతో మాయావతి రెండోస్థానం పొందారు. ఎస్పీ కూటమిదే! ది ఏబీఎన్–సీఎస్డీఎస్ సర్వే న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమి 187–197 సీట్లు సాధించగలదని ది ఏబీఎన్ న్యూస్–సీఎస్డీఎస్–లోక్నీతి తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో తేలింది. ఈ కూటమికి 35శాతం ఓట్లుపడతాయంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. కాబోయే సీఎం అర్హత ఉన్న వ్యక్తిగా 26% మద్దతుతో అఖిలేశ్ మందునిలిచారు. ఇక 118–128సీట్లు బీజేపీకి దక్కే వీలుందని సర్వే చెబుతోంది. నోట్ల రద్దు అంశం రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వెల్లడైంది. నోట్లరద్దు నిర్ణయానికి మద్దతు గత నెలరోజుల్లో 35శాతం నుంచి 41శాతానికి చేరింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 76–86సీట్లు రావచ్చు. బీజేపీకి మద్దతుపలికే 21శాతం మంది సంప్రదాయ ఓటర్లు సైతం ఈసారి ఎస్పీ–కాంగ్రెస్ కూటమికీ ఓట్లేసే వీలుంది.