బలప్రదర్శనకు దిగిన ములాయం! | Mulayam Singh Yadav and Shivpal Yadav leave for Delhi | Sakshi
Sakshi News home page

బలప్రదర్శనకు దిగిన ములాయం!

Published Sun, Jan 8 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

బలప్రదర్శనకు దిగిన ములాయం!

బలప్రదర్శనకు దిగిన ములాయం!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు విషయమై ఇటు ములాయం, అటు అఖిలేశ్‌ వర్గాల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎస్పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు తనవైపే ఉన్నారని, కాబట్టి ఆ పార్టీ సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని అఖిలేశ్ వర్గం బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అఖిలేశ్‌ బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి 'ఆధారాల'ను కూడా చూపెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని కోరింది.

అయితే, ఎస్పీకి ప్రతీక అయిన సైకిల్‌ గుర్తును వదులుకోవడానికి ములాయం ఎంతమాత్రం సిద్ధపడటం లేదు. ఈ విషయంలో కొడుకు అఖిలేశ్‌తో అమీ-తుమీకి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం ఆదివారం ఉదయమే కొడుకు అఖిలేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ వెంటనే లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి సోదరుడు శివ్‌పాల్‌ యాదవ్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ములాయం మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ్ముడు శివ్‌పాల్‌తోపాటు తన వర్గం కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. అఖిలేశ్‌కు పోటీగా తన బలప్రదర్శన చాటుకోవడానికి ఈ భేటీని ములాయం వర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ములాయం, శివ్‌పాల్‌ ఢిల్లీకి తరలివెళ్లారు. పార్టీ గుర్తుపై ఈసీని కలిసి ఎట్టిపరిస్థితుల్లో తమ వర్గానికే దక్కేలా చూడాలని ములాయం వర్గం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement