గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలుకు సంబంధించిన మరో ప్రధానమైన,కీలకమైన అడుగు పడింది. జీఎస్టీ అమలు అతి కీలకంగా భావించే భారత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం జీఎస్టీకి సంబంధించిన నలుగురు సహాయక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగు జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఏడాది జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నానికి మార్గం మరింత సుగమమం కానుంది.