అధికారంలో ఉండగా తప్పుల మీద తప్పులు చేసింది కాంగ్రెస్ నాయకులే తప్ప.. తాను ఎలాంటి తప్పు చేయలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. లలిత్ మోదీ వ్యవహారంపై లో్క్సభలో బుధవారం జరిగిన చర్చకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తుండటంతో.. తన సమాధానం వినేందుకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని చెప్పారు.