బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 122 కాగా ఆయనకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. బలపరీక్షలో భారీగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.