కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ జోరుగా ప్రలోభాలకు తెరతీశాయి. నంజన్గుడ, గుండ్లుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో.. ఇక్కడ డబ్బులు ఏరులై పారుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.