కశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం లోక్ సభలో కశ్మీర్ అల్లర్లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ వివరణ ఇస్తూ భారత్కు కశ్మీర్ కిరీటం వంటిదని అన్నారు. కశ్మీర్ అల్లర్లపై చర్చ జరగడం అనేది చాలా అవసరం, ముఖ్యమైనది కూడా అని చెప్పారు. లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల ప్రమేయం ఈ అల్లర్ల వెనుక ఉందని చెప్పారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణమైన బృహాన్ మనీ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కమాండర్ గా పనిచేశాడని అన్నారు.