విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రామభద్రాపురం వద్ద ఒడిషాకు చెందిన ఓ బస్సు బోల్తాపడ్డ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతులలో మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం.డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, నిద్రమత్తులో ఉండటం వల్లే మలుపు తిరిగే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Published Sun, Nov 20 2016 8:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement