కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి.