కొన్నాళ్లుగా చలికి దూరంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక శీతాకాలాన్ని చవి చూడనున్నారు. వాస్తవానికి నవంబర్ మూడో వారం నుంచే చలి మొదలవుతుంది. కానీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో ఈ ఏడాది చలి కాస్త ఆలస్యమైంది. అల్పపీడనాలు, ద్రోణుల వల్ల ఆకాశంలో మేఘాలేర్పడతాయి.