పెద్ద నోట్ల రద్దు పండుటాకుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పింఛన్ సొమ్ము తెచ్చుకునేందుకు వెళ్లి ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది వృద్ధులు పిట్టల్లా రాలిపోయారు. వీరిలో ముగ్గురు బుధవారం మృతి చెందారు. ఇన్నాళ్లూ పెద్దగా కష్టపడకుండానే చేతికందిన పింఛన్ సొమ్ము.. ఇపుడు చుక్కలు చూపిస్తోంది. నోట్ల రద్దుదెబ్బకు పింఛన్ సొమ్మును నగదుగా చేతికివ్వ లేక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దీంతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి, జమ అయిన డబ్బు తీసుకోవడానికి వెళ్లి తీవ్ర ఇక్కట్ల నడుమ తుది శ్వాస విడిచారు.