తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనకు తొలుత హెలికాప్టర్లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే వాతావరణం అనుకూలంగా లేదంటూ ఏటీసీ అనుమతి నిరాకరించింది. దీంతో కేసీఆర్ రోడ్డుమార్గంలో బయల్దేరారు. ఈ పర్యటనలో వరద స్థితిని, ప్రాజెక్టుల జలకళను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే సీఎం మధ్యాహ్నం వీహంగ వీక్షణం చేసే అవకాశం ఉంది