ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోనే ప్రారంభించనున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గంగదేవిపల్లికి హెలికాప్టర్లో రానున్నారు. గ్రామంలో గ్రామజ్యోతి ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.