దేశం ముందుకు వెళ్లాలంటే సరైన నాయకత్వం అవసరం అని, అప్పుడే ఆ దేశం శక్తివంతం అవుతుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఉదయం వెంకయ్య నాయుడకు విజయవాడలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ....‘ మోదీ రూపంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు.2019లో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నదే నా కోరిక. బీజేపీలో దాదాపు అన్ని పదవులు అనుభవించాను. క్రియాశీలక రాజకీయాల నుంచి నన్ను తప్పించారనడం సరికాదు.